సోను సూద్, మాల్యవి కరణోదయ సొసైటీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలో అంబులెన్స్ ప్రారంభం, నిరుపేద కుటుంబాలకు ఉచితంగా ఆటోలను అందించారు
రియల్ హీరో సోనుసూద్, మాల్యవి కరణోదయ సొసైటీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలో సంకిరెడ్డిపల్లి, అమ్మడవాకుల గ్రామాలకు ఉచితంగా అంబులెన్స్ ను ప్రారంభించారు. హైదరాబాదులోని దమ్మాయిగూడ, చిల్కానగర్ ప్రాంతాలకు చెందిన నిరుపేద కుటుంబాల ఆటో కార్మికులకు జీవనోపాధి కోసం ఆటోలను బహూకరించారు. ఈ సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చిన మాల్యవి కరుణోదయ సొసైటీ ఫౌండర్ కొండ కృష్ణమ్మకు సోనూ సూద్ అభినందనలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలంటూ ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. అంబులెన్స్ స్వచ్ఛందంగా ప్రధానం చేయడం అంటే ప్రాణాలను రక్షించడం లాంటిదే అని పేర్కొన్నారు. సంకిరెడ్డిపల్లి, అమ్మడవాకుల గ్రామ ప్రజలు సోను సూద్ అంబులెన్స్ ను వినియోగించుకుని సురక్షితంగా ఉండాలని కోరారు. జీవనోపాధి కోసం కష్టపడుతున్న ఆటో కార్మికులకు ఉచితంగా ఆటోలను అందించడం అంటే కుటుంబాలను నిలబెట్టడం అని ఫౌండర్ కొండ కృష్ణమ్మకు అభినందనలు తెలిపారు. అందిపుచ్చుకున్న అవకాశాన్ని ఉపయోగించుకొని కుటుంబాలకు అండగా నిలవాలని ఆటో కార్మికులకు హితువు చెప్పారు. ఈ సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలంటూ మాల్యవి కరణోదయ సొసైటీ వారిని కోరారు.
మాల్యవి కరణోదయ సొసైటీని 2004 ఫౌండర్ కొండా కృష్ణమ్మ హైదరాబాదులో స్థాపించారు. 22 సంవత్సరాలుగా ఈ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికీ గాంధీ ఆసుపత్రి నీలోఫర్ ఆసుపత్రి తదితర ప్రభుత్వ ఆసుపత్రుల ప్రాంగణంలో నిత్యాన్నదానం చేస్తూనే ఉన్నారు. చాలామంది నిరుపేదల కళా సహకారమయ్యేలా వారి ఇంటి నిర్మాణం కోసం మెటీరియల్ సప్లై చేశారు. కరోనా సమయంలో కూడా సొసైటీ సేవలను ఆపకుండా మరింత విస్తృతంగా చేశారు. మహిళలకు ఉపాధి కోసం కుట్టుమిషన్లను కూడా బహుకరించారు. మాల్యవి కరణోదయ సొసైటీ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలను మరెన్నో చేస్తూ సమాజం మీద తమ ప్రేమను, బాధ్యతను కొనసాగించాలని ఆశిస్తున్నారు.
ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ కొండ కృష్ణమ్మ మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న తమను ప్రోత్సహిస్తూ ముందుకు వచ్చిన రియల్ హీరో సోనూ సూదుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమాజంలో పేదవారికి అండగా ఉంటూ అందరి ఆశీర్వాదంతో సొసైటీని ఇలాగే అప్రతిహతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
సరికొత్త కంటెంట్ తో ఆడియెన్స్ ను ఎప్పటికప్పుడు కొత్తగా ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో…
యంగ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్…
మోస్ట్ టాలెంటెడ్, ఎనర్జిటిక్ రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నా వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్పై యతి నిర్మాతగా…
‘కోర్ట్’, ‘బ్యాండ్ మేళం’ అంటూ యంగ్ అండ్ టాలెంట్ నటుడు హర్ష్ రోషన్ వరుస విజయాలతో దూసుకుపోతోన్నారు. హర్ష్ రోషన్,…
దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ ఫ్రాంచైజీ "మిర్జాపూర్ : ది మూవీ" టీజర్ విడుదలైంది. ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన…
▪️ ప్రసాద్ ల్యాబ్స్లో సినీ ప్రముఖుల సమక్షంలో వేడుక▪️ జూలై 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల▪️ హీరోయిన్గా వెండితెరకు ఈటీవీ…