సోను సూద్, మాల్యవి కరణోదయ సొసైటీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలో అంబులెన్స్ ప్రారంభం, నిరుపేద కుటుంబాలకు ఉచితంగా ఆటోలను అందించారు
రియల్ హీరో సోనుసూద్, మాల్యవి కరణోదయ సొసైటీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలో సంకిరెడ్డిపల్లి, అమ్మడవాకుల గ్రామాలకు ఉచితంగా అంబులెన్స్ ను ప్రారంభించారు. హైదరాబాదులోని దమ్మాయిగూడ, చిల్కానగర్ ప్రాంతాలకు చెందిన నిరుపేద కుటుంబాల ఆటో కార్మికులకు జీవనోపాధి కోసం ఆటోలను బహూకరించారు. ఈ సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చిన మాల్యవి కరుణోదయ సొసైటీ ఫౌండర్ కొండ కృష్ణమ్మకు సోనూ సూద్ అభినందనలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలంటూ ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. అంబులెన్స్ స్వచ్ఛందంగా ప్రధానం చేయడం అంటే ప్రాణాలను రక్షించడం లాంటిదే అని పేర్కొన్నారు. సంకిరెడ్డిపల్లి, అమ్మడవాకుల గ్రామ ప్రజలు సోను సూద్ అంబులెన్స్ ను వినియోగించుకుని సురక్షితంగా ఉండాలని కోరారు. జీవనోపాధి కోసం కష్టపడుతున్న ఆటో కార్మికులకు ఉచితంగా ఆటోలను అందించడం అంటే కుటుంబాలను నిలబెట్టడం అని ఫౌండర్ కొండ కృష్ణమ్మకు అభినందనలు తెలిపారు. అందిపుచ్చుకున్న అవకాశాన్ని ఉపయోగించుకొని కుటుంబాలకు అండగా నిలవాలని ఆటో కార్మికులకు హితువు చెప్పారు. ఈ సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలంటూ మాల్యవి కరణోదయ సొసైటీ వారిని కోరారు.
మాల్యవి కరణోదయ సొసైటీని 2004 ఫౌండర్ కొండా కృష్ణమ్మ హైదరాబాదులో స్థాపించారు. 22 సంవత్సరాలుగా ఈ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికీ గాంధీ ఆసుపత్రి నీలోఫర్ ఆసుపత్రి తదితర ప్రభుత్వ ఆసుపత్రుల ప్రాంగణంలో నిత్యాన్నదానం చేస్తూనే ఉన్నారు. చాలామంది నిరుపేదల కళా సహకారమయ్యేలా వారి ఇంటి నిర్మాణం కోసం మెటీరియల్ సప్లై చేశారు. కరోనా సమయంలో కూడా సొసైటీ సేవలను ఆపకుండా మరింత విస్తృతంగా చేశారు. మహిళలకు ఉపాధి కోసం కుట్టుమిషన్లను కూడా బహుకరించారు. మాల్యవి కరణోదయ సొసైటీ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలను మరెన్నో చేస్తూ సమాజం మీద తమ ప్రేమను, బాధ్యతను కొనసాగించాలని ఆశిస్తున్నారు.
ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ కొండ కృష్ణమ్మ మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న తమను ప్రోత్సహిస్తూ ముందుకు వచ్చిన రియల్ హీరో సోనూ సూదుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమాజంలో పేదవారికి అండగా ఉంటూ అందరి ఆశీర్వాదంతో సొసైటీని ఇలాగే అప్రతిహతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…
సావిత్రి గారు అద్భుతాలకే అద్భుతం - ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో పద్మశ్రీ డా. బ్రహ్మానందం ఆంగ్లంలోకి…
‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ -మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్…