దేవర’గా ఎన్టీఆర్ ఇర‌గ‌దీశారు. సినిమాను ఆద‌రిస్తోన్న అభిమానుల‌కు ధ‌న్య‌వాదాలు క‌ళ్యాణ్ రామ్‌

Must Read

మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టించిన‌ ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై  మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌ను నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో…

చిత్ర ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ మాట్లాడుతూ ‘‘ఇంత పెద్ద విజ‌యాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. మూడేళ్ల క‌ష్ట‌మే దేవ‌ర సినిమా. నిన్న రాత్రి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఫోన్ కాల్స్ వ‌స్తున్నాయి. నా కెరీర్‌లో బెస్ట్ మూవీ అంటున్నారు. ఈ అవ‌కాశం ఇచ్చిన ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్‌, సుధాక‌ర్‌గారికి థాంక్స్‌. నా న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు స్పెష‌ల్ థాంక్స్‌. జాన్వీ, శ్రీకాంత్, సైఫ్ అలీఖాన్‌, ర‌త్న‌వేలు, సాబు సిరిల్, అనిరుధ్ స‌హా అంద‌రూ త‌మ సినిమాగా భావించి చివరి నిమిషం వ‌ర‌కు క‌ష్ట‌ప‌డ్డారు. అందుకే సినిమాకు ఇంత మంచి స‌క్సెస్ ద‌క్కింది. ఈ జ‌ర్నీలో భాగ‌మైన అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.

సాబు సిరిల్ మాట్లాడుతూ ‘‘సినిమాను ఇంత గొప్ప‌గా ఆద‌రిస్తున్న ఎన్టీఆర్ అభిమానుల‌కు, సినీ ప్రేమికుల‌కు థాంక్స్‌. ఈ మూవీ మాకెంతో స్పెష‌ల్. అంద‌రం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాం. కొర‌టాల శివ‌గారు నాపై న‌మ్మ‌కంతో అవ‌కాశం ఇచ్చారు. ర‌త్న‌వేలు నా వ‌ర్క్‌ను త‌న కెమెరాతో ఇంకా గొప్ప‌గా చూపించారు. నాతో పాటు సినిమాకు వ‌ర్క్‌చేసిన టీమ్ స‌భ్యుల‌కు థాంక్స్‌. నిర్మాత‌లు అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా సినిమాను నిర్మించారు. అంతర్జాతీయ ప్ర‌మాణాల‌తో సినిమాను నిర్మించారు. ముఖ్యంగా అండ‌ర్ వాట‌ర్ స‌న్నివేశాల‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది’’ అన్నారు.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘‘మా అందరి నాలుగేళ్ల కష్టమే ఈ దేవ‌ర సినిమా. ప్రేక్ష‌కులు చూపిస్తోన్న ఆద‌ర‌రాభిమానాల‌కు, ఇస్తున్న రికార్డ్ బ్రేకింగ్ క‌లెక్ష‌న్స్‌కు ధ‌న్య‌వాదాలు. నంద‌మూరి అభిమానుల‌కు మెమెప్పుడూ రుణ‌ప‌డి ఉంటాం. ఈ సినిమా కోసం క‌ష్ట‌ప‌డిన కొర‌టాల శివ‌గారికి థాంక్స్‌.  శివ‌గారు రాసిన క‌థ‌కు సాబు సిరిల్‌గారు న్యాయం చేశారు. రెండేళ్లు క‌ష్ట‌ప‌డ్డారాయ‌న‌. ఎన్టీఆర్ ఇర‌గ‌దీశాడు. మాట‌ల్లేవు. నాకెంతో గ‌ర్వంగా ఉంది. త‌ను వ‌న్ మ్యాన్ షో చేశాడు. గూజ్ బ‌మ్స్ వ‌చ్చాయి. మ‌రోసారి అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ ‘‘టాలీవుడ్  స్టార్ హీరో సినిమా వ‌స్తుందంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవ‌ర్‌సీస్‌లోనూ పండుగ వాతావ‌రణం  ఉంటుంది. నేను రాత్రి షోకు వెళ్లాను. రాత్రంతా నిద్ర కూడా పోలేదు. అంత ఆతృత‌గా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాను ఆద‌రిస్తోన్న ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. కొర‌టాల శివ‌గారు అండ్ టీమ్ మూడేళ్లు క‌ష్ట‌ప‌డ్డారు. ఎంటైర్ టీమ్ డైరెక్ట‌ర్‌గారికి అండ‌గా నిల‌బ‌డ్డారు. ఎన్టీఆర్‌గారిని రెండు గంట‌ల న‌ల‌బై నిమిషాలు అలా చూస్తుండిపోయారు. సినిమాలో టెంపో అలా మెయిన్ టెయిన్ అవుతూ వ‌చ్చింది. బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా క‌లెక్ష‌న్స్ వ‌స్తున్నాయి. డే వ‌న్ క‌లెక్ష‌న్స్ ప‌రంగా టాప్ 2 మూవీ అయ్యేలా ఉంది. మేక‌ర్స్ ఆ వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తారు. ఈ సినిమా ఇంత పెద్ద విజ‌యాన్ని సాధించిందంటే కార‌ణం ఎన్టీఆర్‌గారే కార‌ణం. ఆయ‌న ప్రెజ‌న్స్ నుంచి ప్ర‌తి సీన్‌లో హోల్డ్ చేస్తూ వ‌చ్చారు. వ‌న్ మ్యాన్ షోగా సినిమాను నిల‌బెట్టారు. ఈ మూవీని నైజాంలో రిలీజ్ చేసే అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌ల‌కు థాంక్స్‌’’ అన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News