లెజెండరీ యాక్టర్ తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అసుర సంహారం’. శ్రీ సాయి ప్రవర్తిక బోయళ్ళ సమర్పణలో, శ్రీ సాయి తేజో సెల్యూలాయిడ్స్ బ్యానర్పై సాయి శ్రీమంత్, శబరిష్ బోయెళ్ళ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిషోర్ శ్రీకృష్ణ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్స్, సాంగ్ లాంచింగ్ కార్యక్రమం తనికెళ్ల భరణి చేతుల మీదుగా ఘనంగా జరిగింది.
సుమారు 750కి పైగా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన తనికెళ్ల భరణి, ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన ‘విలేజ్ క్రైమ్ డ్రామా’గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో తనికెళ్ల భరణితో పాటు మిధున ప్రియ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. “అసుర సంహారం అంటే చెడుపై మంచి సాధించిన విజయం. డైరెక్టర్ కిషోర్ శ్రీకృష్ణ మంచి సబ్జెక్టను తెరకెక్కించారు. సినిమా బాగా వచ్చింది. ఈ సినిమాలో ఒక విలేజ్ లో డిటెక్టివ్ పాత్ర పోషింసించాను. ఈ సినిమా నిర్మించడంలో, షూటింగ్ పార్టులో NRI శబరిష్, మిధున ప్రియ మాకు బాగా సహకరించారు.” అని చెప్పారు.
దర్శకుడు కిషోర్ శ్రీకృష్ణ మాట్లాడుతూ.. “తనికెళ్ల భరణి గారు ఇందులో ‘విలేజ్ డిటెక్టివ్’గా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా సినీ చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా మారుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మిథున్ ప్రియా గారి సహాకారం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని తెలిపారు.
నటీ, excutive ప్రొడ్యూసర్ మిథున్ ప్రియా మాట్లాడుతూ… కొన్ని సినిమాల్లో చేసాను. ఇది నాకు పెద్ద సినిమా. నెల్లూరు చుట్టూ షూటింగ్ చేశాం. ఈ సినిమాకు ప్రేక్షకుల సహకారం, ఆశీస్సులు కావాలి. మార్చిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.” అని తెలిపారు.
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్…
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా "కపుల్ ఫ్రెండ్లీ". ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ…
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో…
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ…
ప్రేక్షకులకి వేలంటైన్స్ డే విషెస్ చెబుతూ.. ఫిబ్రవరి 13 న “స్కై” మూవీని మేకర్స్ ధియేటర్ రిజీజ్ చేస్తున్నారు. మురళీ…