మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్న సినిమా ఇది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్గా వస్తున్న ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాను ఈటీవీ విన్ అసోసియేషన్తో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్పై రిక్కి సమర్పణలో హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. మార్చి 6న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసందర్భంగా హీరోయిన్ లయ ఈ చిత్ర విశేషాల గురించి విలేకరులతో మాట్లాడారు.
దాదాపు 20 ఏళ్ల గ్యాప్ తరువాత శివాజీ గారితో కలిసి నటించడం ఎలా అనిపించింది?
శివాజీ గారు నేను కలిసి నటించి 20 ఏళ్లు అవుతుంది. ఈ చిత్రంలో నటించాలి అనగానే ఫ్యామిలీ డ్రామా అనుకున్నాను. కానీ ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అనగానే నాకు ఇష్టమైన జోనర్లో ఉంది అనిపించింది. నాకు కామెడీ సినిమాలంటే ఇష్టం. అందరికి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. కామెడీ జోనర్ అనేది అని ఏజ్ల వారికి నచ్చుతుంది. ఈ కామెడీ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది డార్క్ కామెడీ జోనర్. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ఇది. కథ వినగానే యూనిక్ ఫీలింగ్ వచ్చింది.
మీ పాత్ర ఈ సినిమాలో ఎలా ఉంటుంది?
ఈ చిత్రంలో నేనుఉత్తర పాత్రలో నటించాను. ఇప్పటి వరకు నన్ను నేను ఇలాంటి పాత్రలో చూసుకోలేదు. నాకు కూడా ఈ పాత్ర వినగానే ఎంతో ఎక్జ్సయిటింగ్గా అనిపించింది. మంగపతిలాంటి పవర్ఫుల్ పాత్ర చేసిన హీరోను డామినేట్ చేసే పాత్ర నాది. కానీ శివాజీ గారు ఎంతో ఎంకరైజ్ చేశారు. నా రోల్ బాగా నచ్చింది. నేను, శివాజీ కలిసి నటించిన సన్నివేశాలు ఎంతో హిలేరియస్ గా ఉంటాయి.
ఈ సినిమాను మొదట్లో ఓటీటీకి అనుకున్నారు? ఇప్పుడుథియేటర్లో విడుదల కాబోతుంది?
ప్రారంభంలో థియేటర్కే అనుకున్నాం. కానీ మధ్యలో అనుకోకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అన్నారు. నన్ను నేను పెద్ద స్క్రీన్లో చూసుకోవడం అలవాటు కాబట్టి ఓటీటీ అనగానే కొంచెం డిజప్పాయింట్ అయ్యాను. అయితే మళ్లీ చాలా మంది ప్రముఖులు సినిమా చూసి ఇది థియేటర్లో విడుదల చేసే సినిమా అని అనడంతో మళ్లీ థియేటర్లోకి రాబోతుంది. . మా అమ్మాయి ఓటీటీలో సినిమా అనగానే ఎంతో బాధపడింది. నా సినిమా అంటే వెండితెరపై చూడాలనేది తన కోరిక. ఇప్పుడు థియేటర్ అనగానే ఎంతో ఆనందంగా ఉంది.
సినిమా మీద మీ అంచనాలు ఎలా ఉన్నాయి?
ట్రైలర్ బాగుంది. అందరికి నచ్చింది అంటున్నారు. సినిమా కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అందరిని సంతృప్తిపరిచే సినిమా ఇది. అందరూ ఓ మంచి సినిమా శాటిస్ఫాక్షన్తో వెళ్లిపోతారు.
శివాజీలో ఎలాంటి మార్పు ఏమైనా?
సినిమా అంటే ఆయనకు పాషన్. ప్రతిసారి సినిమాను జనాలకు ఎలా రీచ్ చేయాలి అనే విషయంపై తపన పడుతుంటాడు. సినిమాను అన్ని రకాలుగా ఆయన ప్రేమిస్తుంటాడు. సినిమాపై ప్రేమ అప్పటికంటే ఇప్పుడు ఇంకా పెరిగింది.
దర్శకుడు సుధీర్ శ్రీరామ్ గురించి?
స్టోరీ ఎంత బాగా రాసుకున్నాడో. అంత క్లారిటీగా తెరకెక్కించాడు. చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. సినిమాను ఎంతో హిలేరియస్గా తెరకెక్కించాడు. తనకు ఎలా కావాలో అలాంటి నటనను నటీ నటుల నుండి తీసుకున్నాడు. కాంప్రమైజ్ అవ్వని దర్శకుడు. అతనికి ఏం కావాలో అది బాగా తెలుసు. మంచి ప్రతిభ గల దర్శకుడు.
ఈసినిమాలో మీ పాత్ర ప్రత్యేకత ఏమైనా ఉందా?
లయ అంటే ఎడిపించడం. ఏడవటం.. అనే గుర్తింపు ఉంది. కానీ ఈ సినిమాలో నేనే ఏడిపిస్తాను. ఎంతో ఎంజాయ్ చేసిన పాత్ర ఇది. స్వార్థంగా, తన భర్త, ఫ్యామిలీ గురించి ఆలోచించే స్వార్థపరులు పాత్ర. నా భర్త బాగుండాలి అని కోరుకునే మనస్తత్వం ఉన్న పాత్ర ఇది.
మీకు ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది?
లీడ్రోల్ పర్మినిట్ కాదు. లీడ్ రోల్స్ వస్తే చేస్తాను. కానీ కథ, నా పాత్ర నచ్చితే చిన్నపాత్రలైనా చేస్తానుఅమ్మాయిలకు పాత్రలకు పరిధి తక్కువ. వచ్చే పాత్రల్లో బెస్ట్ పాత్రలను చేస్తాను. సాఫ్ట్ రోల్స్ఆల్రెడీ చేశాను. కాబట్టి స్ట్రాంగ్ క్యారెకర్స్ చేయాలని ఉంది. నేను బేసికల్గా చూడ్డానికి స్టాప్ట్గా ఉన్నా నేను ఏదైనా చెప్పాలంటే చాలా స్ట్రాంగ్గా చెబుతాను. వదలలో నాలో మరో కోణాన్ని చూస్తారు.
మీ తదుపరి సినిమాలు?
వదల అనే సినిమాలో జగపతిబాబు భార్యగా చేస్తున్నాను. శ్రీకాంత్తో కూడా ఓ సినిమా చేస్తున్నాను. నాగేశ్వర రెడ్డి దర్వకుడు. యమలీల తరహాలో సోషియో ఫాంటసీ సినిమా. వదల అనేది సైకలాజికల్ థ్రిల్లర్. డిఫరెంట్ జోనర్లో ప్రయత్నిస్తున్నాను.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…