ఎస్వి క్రియేషన్ తమ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘’మిషన్ సి1000‘’ మార్చి 6న దేశవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
దర్శకత్వం వహించి, ప్రధాన పాత్రలో నటించిన తేజేశ్వర్, ఈ చిత్రాన్ని తెలుగు, హిందీతో పాటు అనేక భారతీయ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
దేశభక్తి, శాస్త్ర విజ్ఞానం, హై-వోల్టేజ్ యాక్షన్ మేళవింపుతో రూపొందిన ఈ కథలో రామ్ (తేజేశ్వర్) అనే ధైర్యవంతుడు, నిబద్ధత గల యువకుడు కీలక పాత్ర పోషిస్తాడు. భారతదేశ గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్న ఒక ప్రమాదకర ఉగ్రవాద సంస్థ లక్ష్యంగా మారిన అద్భుత శాస్త్రీయ సూత్రాన్ని కాపాడటమే అతని మిషన్. దేశ రక్షణ, జాతీయ సమగ్రత, సాంస్కృతిక అవగాహన, యువత సాధికారత వంటి శక్తివంతమైన అంశాలను ఈ చిత్రం ప్రతిపాదిస్తుంది.
ఉత్కంఠభరిత యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ ఘట్టాలు, బలమైన నేపథ్య సంగీతంతో ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ మాస్ ఎలివేషన్ అనుభూతిని అందించనుంది.
తారాగణం:తేజేశ్వర్, ప్రగ్యా నయన్, కబీర్ సింగ్, జయ ప్రకాష్, సుధ, అనీష్ కురువిల్లా, సంజయ్ పాండే, కాళీ చరణ్ మహారాజ్.ప్రకటన
కథ, స్క్రీన్ ప్లే & దర్శకత్వం: తేజేశ్వర్,సినిమాటోగ్రఫీ: మహేందర్ ఎస్,సంగీతం: శ్రీధర్ ఆత్రేయ, నేపథ్య సంగీతం: విన్ను,ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, కొరియోగ్రఫీ: గణేష్ స్వామి, పోరాటాలు: స్టంట్ జాషువా, VFX: అనంత్ ఇయ్యునినిర్మాణ బృందం, నిర్మాతలు: శ్రీమతి. కిరణ్మయి, విరాట్ శౌర్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: డా.ఎలసాగరం ప్రభాకర్, రేవంత్, గండికోట శ్రీనివాస్, సహ నిర్మాతలు: ఎం. మురళి, ఉమా మహీంద్ర, జగదీశ్వర్, సుశీల్, శివ, మధు, సౌజన్య, విగ్నేష్.
'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్లోనే ‘మకుటం’ ఓ స్పెషల్…
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్…
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…
తెలుగు సిల్వర్ స్క్రీన్పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…
సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…