’మిషన్ సి -1000‘’ – గ్రాండ్ రిలీజ్ మార్చి 6.

Must Read

ఎస్వి క్రియేషన్ తమ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘’మిషన్ సి1000‘’ మార్చి 6న దేశవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

దర్శకత్వం వహించి, ప్రధాన పాత్రలో నటించిన తేజేశ్వర్, ఈ చిత్రాన్ని తెలుగు, హిందీతో పాటు అనేక భారతీయ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

దేశభక్తి, శాస్త్ర విజ్ఞానం, హై-వోల్టేజ్ యాక్షన్ మేళవింపుతో రూపొందిన ఈ కథలో రామ్ (తేజేశ్వర్) అనే ధైర్యవంతుడు, నిబద్ధత గల యువకుడు కీలక పాత్ర పోషిస్తాడు. భారతదేశ గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్న ఒక ప్రమాదకర ఉగ్రవాద సంస్థ లక్ష్యంగా మారిన అద్భుత శాస్త్రీయ సూత్రాన్ని కాపాడటమే అతని మిషన్. దేశ రక్షణ, జాతీయ సమగ్రత, సాంస్కృతిక అవగాహన, యువత సాధికారత వంటి శక్తివంతమైన అంశాలను ఈ చిత్రం ప్రతిపాదిస్తుంది.

ఉత్కంఠభరిత యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ ఘట్టాలు, బలమైన నేపథ్య సంగీతంతో ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ మాస్ ఎలివేషన్ అనుభూతిని అందించనుంది.

తారాగణం:తేజేశ్వర్, ప్రగ్యా నయన్, కబీర్ సింగ్, జయ ప్రకాష్, సుధ, అనీష్ కురువిల్లా, సంజయ్ పాండే, కాళీ చరణ్ మహారాజ్.ప్రకటన

కథ, స్క్రీన్ ప్లే & దర్శకత్వం: తేజేశ్వర్,సినిమాటోగ్రఫీ: మహేందర్ ఎస్,సంగీతం: శ్రీధర్ ఆత్రేయ, నేపథ్య సంగీతం: విన్ను,ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, కొరియోగ్రఫీ: గణేష్ స్వామి, పోరాటాలు: స్టంట్ జాషువా, VFX: అనంత్ ఇయ్యునినిర్మాణ బృందం, నిర్మాతలు: శ్రీమతి. కిరణ్మయి, విరాట్ శౌర్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: డా.ఎలసాగరం ప్రభాకర్, రేవంత్, గండికోట శ్రీనివాస్, సహ నిర్మాతలు: ఎం. మురళి, ఉమా మహీంద్ర, జగదీశ్వర్, సుశీల్, శివ, మధు, సౌజన్య, విగ్నేష్.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News