మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్న సినిమా ఇది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్గా వస్తున్న ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాను ఈటీవీ విన్ అసోసియేషన్తో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్పై రిక్కి సమర్పణలో హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. మార్చి 6న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాస్య బ్రహ్మా బ్రహ్మానందం, బండ్లగణేష్ అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా
హాస్య బ్రహ్మా బ్రహ్మానందం మాట్లాడుతూ ” తమ్ముడు శివాజీ నాకు అత్యంత ఆప్తుడైన వ్యక్తి. యంగ్ బ్యాచ్ అంతా కలిసి ఓ మంచి సినిమాను చేశారు. అలీ అన్న శివాజీ సినిమా ఫంక్షన్కు వెళదాం రా అన్నాడు. వెంటనే ఆలోచించకుడా వచ్చాను. గతంలో శివాజీ నిర్మించిన సినిమాలతో పాటు ఆయనతో కలిసి నటించాను. ఇలాంటి పండగ వాతావరణం ఉన్న ఫంక్షన్లో పాల్గొనడం నాకు ఉత్సాహంగా ఉంది. ఈ సినిమాలో ఎంతో మంది ప్రతిభ ఉన్న కమెడియన్స్ నటించారు. ఇంత మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఒకే సినిమాలో కనిపించడం చాలా అరుదు. అది ఈసినిమాకు దక్కింది. పండగ వాతావరణంలో ఉన్న ఈ సినిమా అందర్ని నవ్వులతో అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈసినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని, నిర్మాతగా శివాజీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
బండ్ల గణేష్ మాట్లాడుతూ ” ఈటీవీవిన్ సంస్థ ఎంతో మంది నూతన ప్రతిభను ప్రోత్సాహిస్తున్నారు. శివాజీ నా ఆత్మబంధువు, సోదరుడు. శివాజీ ఎప్పుడూ బాగుండాలని కోరుకునే వ్యక్తి. ఈ సినిమా ఓటీటీ అనగానే డిజప్పాయింట్ అయ్యాను. సాయి, నితిన్కు ఫోన్ చేసి థియేటర్లో విడుదల చేయమని చెప్పాను. అనిల్ రావిపూడి సలహాతో ఈ సినిమా థియేటర్లో రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా సూపర్హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఈటీవీ విన్ సంస్థ ఇలాగే కొత్తవారిని ఎంకరైజ్ చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
ఈ టీవీ విన్ హెడ్ సాయికృష్ణ మాట్లాడుతూ ఈ సినిమాను శివాజీ, లయ గారు ఎంతో బాధ్యతగా, ప్రేమగా తీశారు. ఈ సినిమను అందరూ ఫ్యామిలీతో రండి. ఈసినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్కు చేరువ కావాలని ఫ్యామిలీ టికెట్ కాంబోను ప్రకటించాం. కేవలం 499 రూపాయలకు 4 నాలుగు టికెట్లు ఓ పాప్ కార్న్ను సింగిల్ స్క్రీన్స్లో, 799 రూపాయాలకు నాలుగు టికెట్లు, ఓ బిగ్ పాప్కార్న్ను మల్టీప్లెక్స్ థియేటర్స్లో ఈ ప్యాకేజీలో భాగంగా అందించనున్నారు.అందరూ ఈ ఆఫర్ను సద్వినియోగపరుచుకోవాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
కథానాయకుడు శివాజీ మాట్లాడుతూ ”
ఈటీవీ విన్ నుంచి వస్తున్న సినిమా అంటే ఆడియన్స్లో క్యూరియాసిటీ ఉంటుది. ఇప్పుడు సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం విషయంలో కూడా అలాంటి ఆసక్తి ఉంది. సినిమా ప్రేక్షకుడికి దూరం కాకూడదు అనే ఉద్దేశంతో ఈటీవీ విన్ వారు థియేటర్లో ఈసినిమా చూడటానికి ఓ ఫ్యామిలీ ప్యాకేజీని ప్రకటించారు. కేవలం 499 రూపాయలకు 4 నాలుగు టికెట్లు ఓ పాప్ కార్న్ను సింగిల్ స్క్రీన్స్లో, 799 రూపాయాలకు నాలుగు టికెట్లు, ఓ బిగ్ పాప్కార్న్ను మల్టీప్లెక్స్ థియేటర్స్లో ఈ ప్యాకేజీలో భాగంగా అందించనున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్రెండ్స్ ఇలా అందరిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్ను ప్రకటించారు ఇందువల్ల సినిమా మరింత మందికి దగ్గరవుతుంది. ఖచ్చితంగా ఈసినిమా ఆడియన్స్ను డిజప్పాయింట్ చేయదని ఖచ్చితంగా చెప్పగలను. ఫ్యామిలీ అందరూ కలిసి హ్యపీగా ఈ సినిమాను థియేటర్లో ఎంజాయ్ చేయవచ్చు. ఈటీవీ విన్ సాయి, నితిన్, బాపినీడు గారికి నా కృతజ్క్షతలు. ఈ కార్యక్రమానికి బ్రహ్మానందం గారు రావడం ఎంతో సంతోషంగా ఉంది. బండ్ల గణేష్ గారు కూడా అడగ్గానే వచ్చారు. అలీ కూడా తన సొంత సినిమాలా భావించాడు. అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఈ రోజు ఈ సినిమా అంత మంచి అవుట్పుట్ వచ్చింది. అందరికి నా కృతజ్క్షతలు” అన్నారు.
నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ ” శివాజీ గారి సినిమా విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ వేడుక చూస్తే మాకు ఎంతో ఎనర్జీ వచ్చింది. ఈ సినిమాలో మంచి ఫన్ ఉంది. క్రైమ్ ఎలిమెంట్ ఉంది. హీరో కామన్ మ్యాన్ పాత్ర. అందరికి కనెక్ట్ అయ్యే పాత్ర ఇది. ఈ సినిమా సక్సెస్తో శివాజీ గారి కష్టం ఫలించబోతుంది’ అన్నారు.
ఈటీవీ విన్ నితిన్ చక్రవర్తి మాట్లాడుతూ ”ఈ వేడుకలో అందరూ సూపర్హీరోస్ ఉన్నారు. ఎంతో మంది కష్టాల్లో ఉన్నప్పుడు బ్రహ్మానందం, అలీ గారు వాళ్ల కామెడీతో బయటపడే సారు. ఈ సారి మార్చిలో సంక్రాంతి రాబోతుంది. శివాజీతో ఈ ప్రయాణ కొనసాగాలని కోరుకుంటున్నారు. కామెడీని ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఈ సినిమాలో సూపర్ కామెడీ హీరోస్ అందరూ ఈసినిమాతో తమ నటనతో అందరూ చిన్ననాటి రోజులను గుర్తు చేస్తారు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరికి నచ్చే సినిమా ఇది. సినిమా చూసి అందరూ నవ్వూతూ థియేటర్స్ నుండి వెళతారు’ అన్నారు.
కథానాయిక లయ మాట్లాడుతూ ”ఈవెంట్ ఇంత మంది రాకతో ఎంతో కలర్ఫుల్గా వుంది. శివాజీ గారితో నా నాలుగో సినిమా. ఆడియన్స్ అంచనాలకు మించిన విధంగా ఉంటుంది సినిమా. సినిమా అందరికి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఫ్యామిలీ ప్రేక్షకులకు ప్రకటించిన ప్యాకేజీ ఎంతో బాగుంది. దర్శకుడు ఈ చిత్రాన్ని ఎంతో క్లారిటీగా తెరకెక్కించాడు. భవిష్యత్లో పెద్ద దర్శకుడిగా ఎదుగుతాడు. ఈ సినిమా మా అందరికి గుర్తుండిపోతుంది’ అన్నారు.
ఈ కార్యక్రమంలో అలీ, దర్శకుడు సుదీర్ శ్రీరామ్, రచయిత మిథిల్, డీవోపీ రిత్విక్ రెడ్డి, ఎడిటర్ బాలు మనోజ్, బోలే షావలి, బబ్లూ, రోహన్, ప్రిన్స్, షాబుద్దిన్, చిత్రం శ్రీను, కమల్, చమ్మక్ చంద్ర, ఇమ్మాన్యుయల్, పృథ్వీ, మహిపాల్, తదితరులు పాల్గొన్నారు.
‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఫ్యామిలీ టికెట్ కాంబో బంపర్ ఆఫర్
ఓ మంచి చిత్రం మరింత మంది ప్రేక్షకులకు రీచ్ కావాలని ఉద్దేశంతో ఈసినిమాకు ఓబంపర్ ఆఫర్ను ప్రకటించారు మేకర్స్. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా ప్రేక్షకుడికి దూరం కాకూడదు అనే ఉద్దేశంతో థియేటర్లో ఈసినిమా చూడటానికి ఓ ఫ్యామిలీ ప్యాకేజీని ప్రకటించారు. కేవలం 499 రూపాయలకు 4 నాలుగు టికెట్లు ఓ పాప్ కార్న్ను సింగిల్ స్క్రీన్స్లో, 799 రూపాయాలకు నాలుగు టికెట్లు, ఓ బిగ్ పాప్కార్న్ను మల్టీప్లెక్స్ థియేటర్స్లో ఈ ప్యాకేజీలో భాగంగా అందించనున్నారు. ఈ బంపర్ఆఫర్తో సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం థియేటర్లతో కళకళలాడబోతుంది.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…