‘సలార్ పార్ట్ 1: సీస్ ఫైర్’ టీజర్ రిలీజ్

Must Read

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌తో ప్ర‌శాంత్ నీల్ ఎపిక్ యూనివ‌ర్స్ ‘సలార్ పార్ట్ 1: సీస్ ఫైర్’ టీజర్ రిలీజ్ చేసిన హోంబలే ఫిలింస్.

Salaar Teaser | Prabhas, Prashanth Neel, Prithviraj, Shruthi Haasan, Hombale Films, Vijay Kiragandur


‘సలార్ పార్ట్ 1: సీస్ ఫైర్’ టీజ‌ర్‌: హోంబ‌లే ఫిలింస్ పాన్ ఇండియా మూవీలో మ‌ర‌చిపోలేని ప్ర‌భాస్ థ్రిల్ల‌ర్ రైడ‌ర్
పాన్ఇండియా ఫిల్మ్ ‘సలార్ పార్ట్ 1: సీస్ ఫైర్‌’ టీజర్ విడుదల చేసిన హోంబలే ఫిలింస్.. ప్రభాస్, ప్రశాంత్ నీల్‌తో ఎపిక్ రైడ్


పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో హోంబలే ఫిలింస్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘సలార్ పార్ట్ 1: సీస్ ఫైర్‌’. మూవీ గురించి ప్రకటన వెలువడిన రోజు నుంచి ఫ్యాన్స్, ప్రేక్ష‌కులు ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ను గురువారం ఉద‌యం 5 గంట‌ల 12 నిమిషాల‌కు విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌టం ద్వారా ఈ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను మ‌రింత‌గా పెంచారు. అంద‌రూ ఊహించిన‌ట్లే ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ త‌న యూనివ‌ర్స్ నుంచి థ్రిల్లింగ్ యాక్ష‌న్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఉన్న టీజ‌ర్‌ను చూస్తుంటే ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ రాస్తుంద‌నిపిస్తుంది.


బిగ్గెస్ట్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ సృష్టించిన ప్ర‌త్యేక‌మైక‌మైన ప్ర‌పంచం KGF. ఈ బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాను రూపొందించిన నీల్ దానికి కొన‌సాగింపుగా ఎన్నో సీక్వెల్స్‌ను రూపొందించుకునేలా ప్లాన్ చేసుకున్నారు. భారీ బ‌డ్జెట్‌, భారీ తారాగ‌ణంతో రూపొందిన స‌లార్ మూవీ టీజ‌ర్‌లో ప్రేక్ష‌కుల‌కు క‌ళ్లు చెదిరే టీజర్‌ను అందించింది. స‌లార్ యూనివ‌ర్స్‌లోని పార్ట్ 1కు సంబంధించిన టీజ‌ర్ మాత్ర‌మే ఇది. ఇక థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌లో ఇంకెన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలుంటాయ‌నేది అంద‌రిలోనూ క్యూరియాసిటీని క‌లిగిస్తోంది.
స‌లార్.. ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో పాన్ ఇండియా మూవీగా ‘స‌లార్ 1: సీస్ ఫైర్‌’ తెర‌కెక్కుతోంది. విజ‌య్ కిర‌గందూర్ నిర్మాత‌. ఇదే బ్యాన‌ర్‌లో రూపొందిన కె.జి.య‌ప్ సినిమాలో సాంకేతిక నిపుణులే స‌లార్ సినిమాకు కూడా వ‌ర్క్ చేస్తున్నారు. ఇండియ‌న్ సినిమా స్క్రీన్‌పై ఇలాంటి సినిమా రాలేదనేంత గొప్ప‌గా రూపొందిస్తున్నారు. రామో జీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం 14 భారీ సెట్స్ వేసి మ‌,రీ చిత్రీక‌రించారు. ప్ర‌భాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, శ్రుతీ హాస‌న్‌, జ‌గ‌ప‌తిబాబు వంటి భారీ తారాగ‌ణంతో ప్ర‌శాంత్ నీల్ అన్ కాంప్ర‌మైజ్డ్‌గా సినిమాను రూపొందిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 28న తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ‌, త‌మిళ భౄష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుద‌ల‌వుతుంది.


బాహుబ‌లి, కె.జి.య‌ఫ్ చిత్రాల‌ను రూ.400 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందించారు. ఇప్పుడు ఈ చిత్రాల‌కు స‌మానంగా స‌లార్ సినిమాను ఆడియెన్స్‌ను అల‌రించ‌నుంది. . స‌లార్ సినిమాను ఓ విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్ద‌డానికి విదేశీ సాంకేతిక నిపుణులు, అలాగే స్టార్ స్టంట్ మెన్స్ ను ఈ సినిమా కోసం ఉప‌యోగిస్తున్నారు. ప్ర‌భాస్‌, పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, శ్రుతీ హాస‌న్‌, ఈశ్వరీ రావు, జ‌గ‌ప‌తిబాబు, శ్రియా రెడ్డి త‌దిత‌రులు బిగ్ స్క్రీన్‌పై త‌మ న‌ట‌న‌తో పాత్ర‌ల‌కు ప్రాణం పోశారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News