ప్రపంచవ్యాప్తంగా జూలై 14న “రివెంజ్” విడుదల

Must Read

ఆది అక్ష‌ర ఎంట‌ర్టైన్ మెంట్స్ ప‌తాకంపై బాబు పెదపూడి హీరోగా న‌టిస్తూ నిర్మించిన చిత్రం రివెంజ్. నేహదేశ్ పాండే హీరోయిన్‌. రెట్టడి శ్రీనివాస్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ ఇప్పటికే విడుదలై చిత్రంపై అంచనాలను పెంచింది.

ఈ సందర్భంగా హీరో, నిర్మాత బాబు పెద‌పూడి మాట్లాడుతూ..“మా ఫ్యామిలీ స‌పోర్ట్ తో అబ్రాడ్ వెళ్లాను. కానీ నాకు మొద‌టి నుంచి సినిమాలంటే ఎంతో ఇష్టం. అబ్రాడ్ లో ఉంటూనే త్రివిక్ర‌మ్ గారి అత‌డు, ద‌శ‌ర‌థ్ గారి శ్రీ సినిమాల్లో మంచి క్యారక్ట‌ర్స్ చేశాను. ఇంకా కొన్ని అవ‌కాశాలు వ‌చ్చినప్ప‌టికీ నాకున్న బిజీ వ‌ల్ల చేయలేక‌పోయాను. ఈ నేప‌థ్యంలో మూడేళ్ల కిత్రం ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ గారితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఒక మంచి న‌టుడుగా న‌న్ను ప‌రిచ‌యం చేయ‌డానికి నాకోసం చాలా పాత్ర‌లు రాశారు. త‌న డెడికేష‌న్ న‌చ్చి ఈ సినిమా త‌న‌కిచ్చాను. అద్భుతంగా తీశారు. ట్రైల‌ర్ చూశాక ఇది ఒక సైకో క‌థ అనిపించవచ్చు. కానీ బ‌ర్నింగ్ పాయింట్స్ తో తీసిన సినిమా ఇది. ప్రతి ఆడియన్ హర్ట్ ని టచ్ చేసే కథ. మ‌నం అమితంగా ఇష్ట‌పడే వాళ్ల‌కు ఏమైనా జ‌రిగితే మ‌నం ఎలా మారిపోతాం అనేది సినిమా. ఆర్టిస్ట్స్ , టెక్నీషియ‌న్స్ అంతా ప్రాణం పెట్టి ప‌నిచేశారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల‌ చేస్తున్నాం“ అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కుడు రెట్టడి శ్రీనివాస్ మాట్లాడుతూ..“30 ఏళ్లుగా సినిమా రంగంలో ఉంటున్నా. విజ‌య్ భాస్క‌ర్, వంశీ గార్ల వంటి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుల వ‌ద్ద ప‌ని చేశాను. పొద‌రిల్లు, ఐపిసి సెక్ష‌న్ రెండు సినిమాలు డైర‌క్ట్ చేశాను. ఇది మూడో సినిమా. హీరో, నిర్మాత బాబుగారి ప్యాష‌న్ చూశాక ఒక మంచి క‌థ రాయాల‌ని డిసైడ్ అయ్యాను. చాలా పాత్ర‌లు రాశాను. చివ‌రిగా రివెంజ్ క‌థ తీశాం. మొద‌ట క్యార‌క్ట‌ర్ రాసి ఆ త‌ర్వాత సినిమా క‌థ రాశాను. బాబుగారు ఎక్సెలెంట్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చారు. సెన్సార్ పూర్తయింది. జూలై 14న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.

ఆరోహి, భార్గ‌వ్, నాగేష్ క‌ర్ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి డిఓపిః చిడ‌త‌ల న‌వీన్‌; సంగీతంః విజ‌య్ కురాకుల‌; పీఆర్వోః ర‌మేష్ చందు; ఎడిట‌ర్ః మేన‌గ శ్రీను; నిర్మాత: బాబురావు పెదపూడి(USA) ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః రెట్టడి శ్రీనివాస్.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News