సువిక్షిత్, గీతికా రతన్ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్గుడ్ లవ్ ఎంటర్టైనర్ ‘దూరదర్శిని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం మే 15న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్.
దర్శకుడు మాట్లాడుతూ ” అందరి మనసులను హత్తుకునే సినిమా ఇది. అందరూ పల్లెటూరులో విహారించిన అనుభూతి కలుగుతుంది. అందరికి పాత జ్క్షాపకాలు గుర్తుకుతెస్తుంది. ఈ చిత్రంలో తల్లిదండ్రులకు, యూత్కు, సమాజానికి నచ్చే అంశాలు ఉన్నాయి. అందరికి 90వ దశకం రోజులను గుర్తకు తెస్తుంది. అందరూ చిత్రలహరి పోగ్రామ్ కోసం వేచి చూసిన రోజులు గుర్తుకు వస్తాయి. ఈ సినిమాలో మంచి ఎమోషన్ ఉంది. అందరి హృదయాలను హత్తుకుంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి వాళ్ల గోల్డెన్ డేస్లోకి తీసుకవెళుతుంది. సువిక్షిత్కు హీరోగా మంచి పేరును తీసుకొస్తుంది. ప్రముఖ వ్యక్తులు మా సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది. అందరూ మే 15న విడుదలవుతున్న మాసినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ సినిమా పతాక సన్నివేశాలు అందర్ని ఆలోచింపజేస్తాయి. సినిమా చూసిన వచ్చిన తరువాత ఆ ఫీల్ మిమ్ములను వదిలివెళ్లదు’ అన్నారు.
హీరో సువిక్షిత్ మాట్లాడుతూ ” అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఓ పెద్దాయన బిక్షాటన చేస్తూ కనిపించాడు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన లైఫ్ స్టోరియే సినిమా ఇది. ఆయన సొంత కొడుకు వల్ల ఆ పెద్దాయన బిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈ కథ. యదార్థ సంఘటన చుట్టు అల్లుకున్న కథ ఇది. ఈ సినిమా చూసి ఎడవకుండా ఉన్నా వాళ్ల లైఫ్ను నేను సెటిల్ చేస్తాను. దూరదర్శిని ఓ జంటను ఎలా కలిపింది అనేది కథ. ఇప్పుడు ఈ కథ గురించి చెబుతున్న నేను ఎమోషన్ అవుతాను. ఓ తండ్రికి మానసిక పరిస్థితి ఎందుకు అలా అయ్యింది? కొడుకు వల్ల బిక్షాటన ఎందుకు చేయాల్సిన వచ్చింది? అనేది ఈ చిత్ర కథ. ఈ సినిమా టికెట్తో పాటు ఖర్చీఫ్ కూడా ఫ్రీగా ఇస్తాం. ఎందుకు ఈ సినిమా చూసి ఎడ్వకుండా ఎవరూ ఉండలేరు’ అన్నారు.
లావణ్య రెడ్డి, కిట్టయ్య, తేజ తదితరులు ఈ చిత్రంలో నటించారు.
సూర్య అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వనాథ్ & సన్స్’. బ్లాక్బస్టర్ దర్శకుడు…
డైనమిక్ హీరో విష్ణు మంచు గత ఏడాది ‘కన్నప్ప’ అంటూ ఆడియెన్స్ను ఎంతగానో ఆకట్టుకున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్…
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…
సోమవారం సాయంత్రం హైదరాబాద్ AMB సినిమాస్లో జరిగిన “సేవ్ ది టైగర్స్ సీజన్ 3” గ్రాండ్ ప్రీమియర్కు అద్భుతమైన స్పందన…
విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్తో కలిసి ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్పై రామంజనేయులు జవ్వాజీ…
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియో తన తాజా తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘ఇసకపట్నం’ ట్రైలర్ను…