డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ
బహుజన చక్రవర్తిగా కీర్తి పొందిన చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి రూపొందించిన యానిమేషన్ మూవీ “సర్దార్ సర్వాయి పాపన్న”. ఈ సినిమాను వి.జి.మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. దీపక్ న్యాతి నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు వహిస్తున్నారు. ఈ యానిమేషన్ మూవీ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – మేము ఆహ్వానించగానే మా కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని ఈ నెల 21న రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని మా ఆర్కే ఫిలింస్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. పన్నుల దోపిడీ నుంచి పేద ప్రజలను కాపాడిన వీరుడు సర్దార్ పాపన్న. బడుగు, వెనకబడిన కులాల వారిని ఒక్కటి చేసి పోరాడం సాగించాడు, 30 కోటలను జయించాడు. గోల్కొండ కోటపై కూడా తిరుగుబాటు చేశాడు. అలాంటి ధీరుడిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. నేను పాతికేళ్ల కిందట సర్వాయి పాపన్న సినిమా రూపొందించాను. అప్పటికి ప్రజల్లో ఆయన గురించి అవగాహన లేదు. ఈ రోజు పల్లె పల్లెనా సర్దార్ పాపన్న విగ్రహాలు ఉన్నాయి. ఆయన చరిత్ర గురించి తెలిసింది. ఆ ధీరుడి నేపథ్యంతో సినిమా రూపొందించిన వెంకటేష్ గౌడ్ ను అభినందిస్తున్నా. సర్దార్ సర్వాయి పాపన్న సినిమాకు పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా అన్నారు.
దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి మాట్లాడుతూ – సర్దార్ సర్వాయి పాపన్న 376 జయంతి సందర్భంగా ఈ రోజు మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నాం. పాపన్న గురించి అనేక గ్రంథాల్లో సమాచారం సేకరించి ఈ సినిమాను రూపొందించాను. బాహుబలి లా మా సినిమా కూడా అలాంటి భారీ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇస్తుందని నమ్ముతున్నాం. నాకున్న పరిమితుల్లో అనేక వ్యయప్రయాసలకు ఓర్చి ఈ సినిమాను రూపొందించాను. ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు.
హీరోయిన్ పాయల్ ముఖర్జీ మాట్లాడుతూ – సర్దార్ సర్వాయి పాపన్న మూవీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఆ సీన్స్ అన్నీ నాకు బాగా నచ్చాయి. సినిమా కూడా ఇలాగే మనందరికీ నచ్చేలా ఉంటుందని నమ్ముతున్నాను. ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా అన్నారు.
సింగర్ ఏపూరి సోమన్న మాట్లాడుతూ – కోట్లాది మంది బహుజనులు ఈ సినిమా చూసేందుకు వేచి ఉన్నారు. సబ్బండ కులాలను ఏకం చేసి గెరిల్లా పోరాటంతో జైత్రయాత్ర చేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఆయన చరిత్రతో రూపొందించిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అన్నారు.
ప్రముఖ రచయిత, పాత్రికేయుడు పొన్న రవిచంద్ర మాట్లాడుతూ – సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను చాలా మంది వక్రీకరించారు. కానీ దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ చరిత్రను సమగ్రంగా అధ్యయనం చేసి ఆయన చరిత్రను నిజంగా ప్రజల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ ప్రయత్నం చేసినందుకు వెంకటేష్ గౌడ్ ను, మూవీని రిలీజ్ చేస్తున్న రామకృష్ణ గౌడ్ ను అభినందిస్తున్నా అన్నారు.
మాజీ ఎంపీ మధు యాస్కి గౌడ్ మాట్లాడుతూ – సమసమాజాన్ని స్థాపించేందుకు కృషి చేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఈ రోజు ఆయన 376 జయంతి. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం, ఆ కార్యక్రమంలో నేను అతిథిగా పాల్గొనడం సంతోషంగా ఉంది. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ట్యాంక్ బండ్ మీద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. లక్షలాది మంది కోరిక నెరవేరుతున్న రోజు ఇది. అందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి , మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అభినందనలు. అలాగే తెలంగాణ తొలి మండలి ఛైర్మన్ గా స్వామి గౌడ్ గ్రామ గ్రామాన తిరిగి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలు ఏర్పాటు చేయించారు. అలాంటి వీరుడి చరిత్రను కళ్లకు కట్టినట్లు తెరకెక్కించిన దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆయనకు సెల్యూట్ చేస్తున్నా. ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న రామకృష్ణ గౌడ్ గారు 2003లోనే సర్వాయి పాపన్న సినిమా తీసిన ఘనత పొందారు. ఆయనకు ఈ సినిమా మంచి విజయం అందించాలని కోరుకుంటున్నా అన్నారు.
తెలంగాణ శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ – మేమంతా ఎదురు చూస్తున్న రోజు ఇది. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేస్తుండటం సంతోషంగా ఉంది. పార్టీలకు అతీతంగా ఎంతోమంది ఇందుకోసం కృషి చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న సినిమాను అద్భుతంగా రూపొందించారు వెంకటేష్ గౌడ్ గారు. ఈ సినిమాను థియేటర్స్ లో ప్రతి ఒక్కరూ చూడాలి. ఈ నెల 21న మన రామకృష్ణ గౌడ్ గారు రిలీజ్ చేస్తున్నారు. వారి ప్రయత్నం సక్సెస్ కోవాలని కోరుకుంటున్నా అన్నారు.
ఈ కార్యక్రమంలో బి.సి. సాధికార సంఘం అధ్యక్షులు కొండ దేవన్న, గాయకుడు ఏపూరి సోమన్న, దిల్ సుఖ్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్ గౌడ్, సర్దార్ పాపన్న వారసుడు రాజన్న, గౌడ సంఘాల నాయకులు గట్టు రామచంద్రరావు, హీరోయిన్ పాయల్ ముఖర్జీ, డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ, డైరెక్టర్, రైటర్ దీపక్ న్యాతి, తదితరులు పాల్గొన్నారు.
వీఎఫ్ఎక్స్, సూపర్ విజన్ – పి. శ్రీనివాస్
ఎడిటర్ – సతీష్ పెటేటి, మణి
సినిమాటోగ్రఫీ, విజువల్ డైరెక్షన్ – మిర్జాపురి సైమన్
లీడ్ ఏఐ విజువల్ డైరెక్టర్ – సురేష్ మల్ల
మ్యూజిక్ సూపర్ వైజర్, లిరిక్స్ – వెంకటేష్ గౌడ్ లింగంపల్లి
బ్యానర్ – వి.జి. మూవీ మేకర్స్
నిర్మాత, దర్శకత్వం – వెంకటేష్ గౌడ్ లింగంపల్లి
రిలీజ్ – ఆర్ కే ఫిలింస్ (డా.ప్రతాని రామకృష్ణ గౌడ్)
పీఆర్ఓ – చందు రమేష్
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో…
తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి…
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…