శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నం.2 గా శివాజీ లయ లు హీరో హీరోయిన్లుగా ఓ సరికొత్త క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా తో సుధీర్ శ్రీరామ్ అనే దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమ కి పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా కి నిర్మాత కూడా శివాజీ కావడం మరో విశేషం. ఈ చిత్రానికి సంబందించిన పూజ కార్యక్రమాలు ఇటీవలే నిర్వహించారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ కొట్టగా, శివాజీ కుమారుడు రిక్కీ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, దిల్ రాజు మరియు దర్శకులు బోయపాటి శ్రీను చేతుల మీదుగా స్క్రిప్ట్ ని అందుకోగా, ఫస్ట్ డైరెక్షన్ బోయపాటి శ్రీను చేసారు.
ఇంతకు ముందు శివాజీ లయ జంటగా కలిసి నటించిన సినిమాలు ‘మిస్సమ్మ’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, మరియు ‘అదిరిందయ్యా చంద్రం’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడమే కాకుండా ఇద్దరికీ హిట్ పెయిర్ అనే ట్యాగ్ ని కూడా అందించాయి. మళ్ళీ వీరిరువురు జంటగా నటించనుండటం తో, అటు పరిశ్రమ లో ఇటు ప్రేక్షకుల్లో యెనలేని ఆసక్తి నెలకొంది.
ఈ నెల 20 నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా కి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.…
సీజన్ 1, సీజన్ 2లతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తి భారీ విజయాలు సాధించిన అతి పెద్ద ఫ్యామిలీ ఎంటర్టైనింగ్…
నందు, అవికా గోర్ జంటగా నటిస్తూ నిన్న ప్రేక్షకుల ముందుకువచ్చిన 'అగ్లీ స్టోరీ' చిత్రానికి వచ్చిన అనూష స్పందనకు ఈ…
ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్తో ము. మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా చేస్తున్న చిత్రం ‘నాన్న కుట్టి’. యాక్షన్,…
సినీ కార్మికులకు అండగా నిలబడటంలో ఎప్పుడూ ముందుంటారు ప్రముఖ నిర్మాత, దర్శకులు చదలవాడ శ్రీనివాసరావు. చిత్రపురి కాలనీకి కోట్లాది రూపాయల…
వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ఆయన హీరోగా…