మిస్టర్ అండ్ మిస్, ఓ స్త్రీ రేపు రా, మహానటులు వంటి చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అశోక్ రెడ్డి తాటిపర్తి రీడింగ్ ల్యాంప్ క్రియేషన్స్ పై నిర్మాతగా చేస్తున్న కొత్త సినిమా డిటెక్టివ్ కార్తీక్. ఈ చిత్రానికి వెంకట్ నరేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. రజత్ రాఘవ్, గోల్డీ నిస్సీ, శ్రుతి మోల్, అనుష నూతల, మ్యాడీ, అభిలాష్ బండారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలకు సిద్ధమవుతోంది.
రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా నిర్మాత అశోక్ రెడ్డి తాటిపర్తి మాట్లాడుతూ – మర్డర్ మిస్టరీ కథతో ఈ చిత్రాన్ని నిర్మించాం. రిషిత అనే పదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసును ఇన్వెస్టిగేట్ చేసేందుకు సంధ్య అనే డిటెక్టివ్ వస్తుంది. ఆమె కూడా మిస్సింగ్ కావడంతో కార్తీక్ ఆ కేసును టేకప్ చేస్తాడు. ఈ క్రమంలో అతను ఊహించని ఎన్నో పరిణామాలను ఎదుర్కొ సంధ్యను ఎలా చేరుకున్నాడు అనేది కథాంశం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉంటుంది. అన్నారు.
ఈ చిత్రానికి – సినిమాటోగ్రఫీ – సిద్ధం నరేష్, ఎడిటింగ్ – కార్తిక్ కట్స్, సంగీతం – మార్కస్ ఎం, ఆర్ట్ డైరెక్టర్ : హేమంత్ కుమార్ జి, కో ప్రొడ్యూసర్ – పార్థు రెడ్డి, ప్రొడ్యూసర్ – అశోక్ రెడ్డి తాటిపర్తి, పీఆర్వో – జీఎస్కే మీడియా, రచన దర్శకత్వం – వెంకట్ నరేంద్ర.
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…
సావిత్రి గారు అద్భుతాలకే అద్భుతం - ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో పద్మశ్రీ డా. బ్రహ్మానందం ఆంగ్లంలోకి…
‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ -మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్…