Categories: Uncategorized

ఇద్దరు సీఎంల భేటీలో తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించాలి – టీఎఫ్ సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్

ఈ రోజు ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో సమావేశమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై వారు చర్చించనున్నారు. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలను సైతం పరిష్కరించేలా చర్చ జరగాలని కోరారు టీఎఫ్ సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ మేరకు ఆయన పలు సూచనలు చేశారు.

ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు సమావేశమై ఇరు రాష్ట్రాల సమస్యలపై చర్చలు జరపడం ఆహ్వానించదగ్గ విషయం. ఇదే సందర్భంలో తెలుగు చిత్ర పరిశ్రమ గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరగాలని కోరుకుంటున్నాను. ఒక సీనియర్ నిర్మాతగా, దర్శకుడిగా నేను వారి దృష్టికి కొన్ని సమస్యలు తీసుకురావాలని భావిస్తున్నా. తెలుగు సినిమా పరిశ్రమలో యూఎఫ్ వో, క్యూబ్ వంటి డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల రేట్లు నిర్మాతలకు భారంగా మారాయి. ఇతర రాష్ట్రాల్లో రెండు మూడు వేలు ఉన్న యూఎఫ్ వో, క్యూబ్ రేట్లు మన దగ్గర పది నుంచి పదిహేను వేల దాకా వసూలు చేస్తున్నారు.

ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు ఈ కంపెనీలకు అడ్వైజర్లుగా ఉండి ఈ వ్యాపారానికి సపోర్ట్ చేస్తున్నారు. ప్రపంచం గర్వించేలా ఎదుగుతున్న తెలుగు సినిమాకు మాత్రం ఇతర రాష్ట్రాల కంటే క్యూబ్, యూఎఫ్ వో ఎక్కువ వసూలు చేస్తున్నాయి. దీనిపై గతంలో నేను నిరాహారదీక్ష చేశాను. అయినా మార్పు రాలేదు. గతంలో 50 వేలకు ఒక ప్రింట్ చొప్పున పది ప్రింట్లు కొంటే నిర్మాతకు అదే సరిపోయేది. చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకడం లేదు. మెయిన్ సెంటర్స్ లో థియేటర్స్ కు రెంట్ సిస్టమ్ ఉంది. ఇది చిన్న నిర్మాతలకు తమ సినిమాల రిలీజ్ టైమ్ లో ఇబ్బందిగా మారుతోంది.

టికెట్ బుకింగ్స్ కూడా ప్రైవేట్ కంపెనీల ద్వారా కాకుండా ప్రభుత్వమే ఎఫ్ డీసీ ద్వారా చేయిస్తే ప్రైవేట్ వారికి అనసరంగా డబ్బులు పోకుండా ఉంటాయి. థియేటర్స్ లో తినుబండారాల రేట్లు విపరీతంగా ఉంటున్నాయి. వాటిని తగ్గించాలి. చిన్న చిత్రాలకు అప్పట్లో పది లక్షల రూపాయల రాయితీ ఇచ్చేవారు. ఇప్పడు కూడా అలాంటి సిస్టమ్ తీసుకొచ్చి..ఇరవై నుంచి యాభై లక్షల రూపాయల రాయితీ ఒక్కో చిన్న చిత్రానికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దాని వల్ల చిన్న సినిమా బతుకుతుంది. ఇవాళ తెలుగులో తెరకెక్కే సినిమాల్లో నూటికి 90శాతం చిన్న చిత్రాలే.

సింగిల్ విండో సిస్టమ్ ద్వారా షూటింగ్స్ కు ఉచితంగా పర్మిషన్స్ ఇవ్వాలి. అలాగే షూటింగ్స్ జరిగే ప్రాంతంలో చిత్ర యూనిట్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం మా సంస్థలో దీక్ష అనే సినిమాను రూపొందిస్తున్నాను. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. దీక్ష సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. మంచి పాటలు, ఫైట్స్ తో దీక్ష సినిమా ఘన విజయం సాధిస్తుంది. అన్నారు.

Tfja Team

Recent Posts

ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రం.. అందరికీ తప్పకుండా నచ్చుతుంది.. ‘సన్ ఆఫ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత, హీరో సాయి సింహాద్రి

సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’. ఈ మూవీని…

53 minutes ago

‘హేబల్‌వంత్‌’ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది: థాంక్యూ మీట్‌ ఫర్‌ బ్రేక్‌ ఈవెన్‌ డన్‌ ఈవెంట్‌లో వెల్లడించిన చిత్ర నిర్మాత

ప్రామిసింగ్‌ కథానాయకుడు సుహాస్‌, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'హే బల్‌వంత్‌'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌…

3 hours ago

మహేష్ విట్ట ‘’ఉత్తుత్త హీరోలు‘’ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపిన హీరో ప్రదీప్ మాచిరాజు

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…

1 day ago

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

2 days ago

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…

3 days ago

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”ఓం శాంతి శాంతి శాంతిః”

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

3 days ago