ఆస్కార్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన’ఓ సుందరి’పాట విడుదల

Must Read

పెళ్లి చూపులు, బొమ్మలరామారం, ఎగిసే తారాజువ్వలు, జార్జి రెడ్డి చిత్రాలతో పాటు పిట్టకథలు వెబ్ సిరీస్ లోనూ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ బేతగంటి. అతను దర్శకుడుగా మారి తెరకెక్కించిన చిత్రం ‘రామన్న యూత్ సిల్లీమాంక్స్ స్టూడియోస్ సమర్పణలో ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి రజినీ నిర్మాత. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎంటర్టైనింగ్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీపై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. తాజాగా ఓ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఇంతకు ముందే ఈ పాటకు సంబంధించి ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమోతోనే హిట్ సాంగ్ అనిపించుకున్న ఈ గీతాన్ని ప్రస్తుతం సూపర్ హిట్ సాంగ్స్ లిరిసిస్ట్ గా పేరు తెచ్చుకున్న కాసర్ల శ్యామ్ రాశాడు. కమ్రాన్ సంగీతం అందించగా ఆస్కార్ విన్నింగ్ సాంగ్ పాడిన రాహుల్ సిప్లిగంజ్ ఆలపించాడు.

‘‘రాజుగాని మెల్లోనా సిలకల పేరు నువ్వేనే.. మోజు పడ్డడే నీపైనే ఓ స్వప్నా.. రాజ్యమేదీ లేకున్నా.. హల్చల్ చేస్తడే ఊళ్లోనే.. రాణిలెక్కనే జూస్తాడే ఓ స్వప్నా.. నువ్వు దారం వీడో బీడీ.. మస్తుంటదే ఇద్దరి జోడీ.. ఇల్లుటమే రమ్మంటొస్తడే’’ అంటూ సాగే ఈ గీతం గ్రామీణ ప్రేమల్లో స్వచ్ఛతను, అమాయకత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించేలా కనిపిస్తోంది. తెలంగాణ పద ప్రయోగాలతో కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను వినగానే ఆకట్టుకునేలా ట్యూన్ చేశాడు సంగీత దర్శకుడు. ఆ ట్యూన్ అంతే ఈజ్ తో ఆలపించాడు రాహుల్ సిప్లిగంజ్. కంప్లీట్ క్యాచీ ట్యూన్ తో పూర్తిగా మాంటేజ్ సాంగ్ లా ఉన్న ఈ గీతంలో హీరో, దర్శకుడూ అయిన నవీన్, అమూల్య రెడ్డిల జోడీ అత్యంత సహజంగా ఉంది.

అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న రామన్న యూత్ లో
నటీనటులు : అనిల్ గీల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, రోహిణి జబర్దస్త్, యాదమ్మ రాజు, టాక్సీ వాలా విష్ణు, అమూల్య రెడ్డి, కొమ్మిడి విశ్వేశ్వర్ రెడ్డి, జగన్ యోగిరాజు, బన్నీ అభిరాన్, మాన్య భాస్కర్,  వేణు‌ పొలసాని తదితరులు

సాంకేతిక నిపుణులు : కాస్ట్యూమ్ డిజైనర్ – అశ్వంత్ బైరి, సౌండ్ డిజైన్ – నాగార్జున తాళ్లపల్లి, ఎడిటర్ – రూపక్ రొనాల్డ్ సన్, నవీన్, ఆర్ట్ -‌ లక్ష్మీ సింధూజ, సంగీతం – కమ్రాన్ , సినిమాటోగ్రఫీ – ఫహాద్ అబ్దుల్
మజీద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్  – శివ ఎంఎస్ కే, పీఆర్వో – జీఎస్కే
మీడియా, రచన దర్శకత్వం – నవీన్ బేతిగంటి.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News