స్టార్ హీరో ఉపేంద్ర నటించిన ఏ(A) చిత్రం జూన్ 21 విడుదల సందర్భంగా ట్రైలర్ లాంచ్

Must Read

ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై స్టార్ హీరో ఉపేంద్ర నటించిన ఏ(A) చిత్రం తెలుగులో 4కేలో గ్రాండ్‌ రీరిలీజ్‌కు ముస్తాబు అవుతుంది. జూన్ 21వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ చేస్తున్న సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు నిర్మాతలు. ఈ వేడుకలో చిత్ర హీరో ఉపేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్రాన్ని ఉద్దేశించి మాట్లాడారు.

చందు ఎంటర్ టైన్మెంట్ స్థాపకులు లింగం యాదవ్ మాట్లాడుతూ.. ముందుగా రీరిలీజ్ చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే ఛత్రపతి, యోగి లాంటి బ్లాక్ బస్టర్ మూవీలను రీరిలీజ్ చేశామని, ఈ సందర్భంగా ఉపేంద్ర నటించిన ఏ సినిమాను సైతం రీరిలీజ్ చేయాలనే సంకల్పం ఎప్పటి నుంచో ఉందని పేర్కొన్నారు. ఏ చిత్రం అంటే తనకు ఎప్పటి నుంచో చాలా ఇష్టమని లింగం యాదవ్ వెల్లడించారు. మూవీ కోసం బెంగళూరు వెళ్లి హీరో ఉపేంద్రను కలిసినప్పుడు ఆయన స్పందించిన తీరు అభిమాని అయిపోయానని చెప్పారు. అడిగిన వెంటనే దేవుడిలా వరం ఇచ్చారని ఉపేంద్ర గొప్పతనాన్ని కొనియాడారు. ఇక ఏ చిత్రాన్ని జూన్ 21 థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి అని పేర్కొన్నారు.

నిర్మాత సైదులు మాట్లాడుతూ.. లింగం యాదవ్ ఈ సినిమా గురించి చెప్పినప్పుడు వెంటనే హీరో ఉపేంద్రను కలువడానిక బెంగళూరు వెళ్లి అన్ని రైట్స్ తీసుకున్నామని తెలిపారు. అడిగిన వెంటనే ఆయన స్పందించిన తీరు చూసి ఆశ్చర్యం వేసిందని ఆయన మంచితనం ఏంటో ఆరోజు తెలిసిందని నిర్మాత సైదులు చెప్పారు. ఈ సినిమా కోసం ఒక బైట్ ఇవ్వండి సర్ అంటే ఏకంగా హైదరాబాద్‌కే వచ్చి స్వయంగా మాట్లాడుతా అని చెప్పడం ఆశ్యర్యం వేసిందని అన్నారు. జూన్ 21 విడుదల కాబోతున్న ఏ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

హీరో ఉపేంద్ర మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని అప్పడు ఆదరించిన ప్రేక్షకులకు, ఇప్పడు రీరిలీజ్ సైతం ఆదరించాడానికి సిద్ధంగా ఉన్న నవతరం ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన సినిమాలను ప్రేక్షకులకు చేరవేసిన మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఏ సినిమా తన జీవితంలో మరిపోలేనిది అని.. 26 సంవత్సరాల క్రితం ఈ చిత్రం విడుదల అవుతున్న సమయంలో ఎంత ఉత్సాహంగా ఉన్నానో ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని థియేటర్లో చూసి ఇప్పటి ప్రేక్షకులు షాక్ అవుతారని చెప్పారు. కచ్చితంగా జూన్ 21న థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి అని పేర్కొన్నారు.

కన్నడ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఏ(A) బుద్దిమంతులకు మాత్రమే అనేది శీర్షిక. ఈ చిత్రంలో ఉపేంద్ర సరసన చాందినీ నటించారు. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం కన్నడలో 1998లోనే 20 కోట్లకు పైగా వసూల్ చేసి ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. అంతటి కల్ట్ ఫిల్మ్ జూన్ 21 న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందని సినిమా ప్రీయులు, ఉపేంద్ర ఫ్యాన్స్ తెగ సంబరం చేసుకుంటున్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News