హరోం హర’కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

Must Read

నవ దళపతి సుధీర్ బాబు లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ ‘హరోం హర’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన హరోం హర అన్ని వర్గాల ప్రేక్షకులు ఆకట్టుకొని, బ్లాక్ బస్టర్ హిట్ సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో నిర్మాతలు సుబ్రహ్మణ్యం, సుమంత్ జి నాయుడు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

సుబ్రహ్మణ్యం గారు.. హరోం హర తో సూపర్ హిట్ కొట్టారు. ముందుగా మీకు కంగ్రాట్స్..
-అందరికీ థాంక్ యూ. సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. చాలా మంచి రేటింగ్స్ వచ్చాయి. మంచి సినిమా చేశామని అందరూ అభినందిస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి దర్శకులు మారుతి గారు, సంపత్ నంది ఫోన్ చేసి మంచి సినిమా తీశారని చెప్పారు. ఖచ్చితంగా ఓ మంచి సినిమా తీస్తామని ముందు నుంచి చెబుతున్నాం. ఇప్పుడు అదే జరిగింది. కలెక్షన్స్ చాలా బావున్నాయి. అన్ని చోట్ల హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది.

-దర్శకుడు సాగర్ మీద పూర్తి నమ్మకం పెట్టాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు.

సుమంత్ గారు.. హరోం హరోతో మీ జర్నీ గురించి చెప్పండి ?
డాడీ బిజినెస్ కారణంగా రాజమండ్రిలో వుండేవారు. ఈ సినిమా షూటింగ్ లో వందశాతం నా ఇన్వాల్మెంట్ వుండేది. ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ దగ్గరుండి చూసుకున్నాను.

సుమంత్ గారు.. మీకు ఇష్టమైన హీరోలు ?
నాకు ప్రభాస్, రామ్ చరణ్ గారంటే చాలా ఇష్టం. స్టెప్ బై స్టెప్ వెళ్లి వాళ్ళతో సినిమా చేయాలని వుంది.

సుబ్రహ్మణ్యం గారు.. సుధీర్ బాబు గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
సుధీర్ బాబు గారితో కలసి పనిచేయడం చాలా బావుంది. చాలా మంచి ఎక్స్ పీరియన్స్.

సుధీర్ బాబు గారి సమ్మోహనం సినిమాని ముందు మీరే ప్రోడ్యుస్ చేయాలనుకున్నారని విన్నాం.?
-అవునండీ.. సమ్మోహనం నేనే చేయాలి. ఇంద్రగంటి గారితో కూడా రెండు మూడు మీటింగులు కూడా అయ్యాయి. అయితే కొన్ని కారణాలు వలన అది చేయడం కుదరలేదు. అది చాలా మంచి సినిమా. ఫ్రీ టైం లో ఆ సినిమా చాలా సార్లు చూస్తుంటాను.

హరోం హరలో హీరోయిన్ మాళవిక అద్భుతంగా చేశారు. కానీ ప్రమోషన్స్ లో కనిపించకపోవడానికి కారణం ?
-మాళవిక చాలా మంచి యాక్టర్. తన పెర్ఫర్మెన్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. తను లా చదువుతుంది. ఎగ్జామ్స్ వుండటం వలన ప్రమోషన్స్ కి రావడం కుదరలేదు.

చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది కదా ?
-చైతన్ చాలా ఫ్రండ్లీ గా ఉంటారు. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాకి టాప్ అతనే. కెమరామ్యాన్ కూడా అద్భుతంగా చేశాడు.

సుబ్రహ్మణ్యం గారు.. హరోం హర కథలో మీకు నచ్చిన ఎలిమెంట్ ?
తండ్రి కొడుకుల సెంటిమెంట్ చాలా నచ్చింది. నేను మా అబ్బాయి కూడా అలానే వుంటాం. ఎదున్నా షేర్ చేసుకుంటాం. అలాగే ఫైట్స్ కూడా టాప్ గా వున్నాయి. ఫైట్స్ కోసం సినిమాని దాదాపు పదమూడుసార్లు చూశాను.

హరోం హర బ్లాక్ బస్టర్ ని కంటిన్యూ చేస్తూ మరో ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారని విన్నాం ?

-రెండు మూడు ప్రాజెక్ట్స్ వున్నాయి. సినిమాల్లో వుండాలని, మా అబ్బాయిని ఇక్కడే వుంచాలని నా గట్టి నిర్ణయం. మాకు సినిమాలు అంటే చాలా పాషన్. మీ అందరి సపోర్ట్ తో ఇక్కడే కొనసాగాలని కోరుకుంటున్నాం.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News