సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సింగ్ గీతం’ విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న రిలీజ్
చాలా మంది ఫిల్మ్ మేకర్స్ సినిమా విడుదల అనేది ఒక ముగింపు ఘట్టం. అయితే లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, క్రియేటివ్ ఫిల్మ్మేకర్ నాగ్ అశ్విన్ లకు మాత్రం తాము ఊహించిన ప్రతి క్రియేటివ్ ఎలిమెంట్ తెరపై అత్యుత్తమంగా ఆవిష్కృతమయ్యేలా చూసుకోవడమే ముఖ్యం. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సింగ్ గీతం’ చిత్రం తొలుత జూన్ 11న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు జూన్ 12కి వాయిదా పడింది. కథలో కీలక పాత్ర పోషించే కొన్ని ముఖ్యమైన సీజీఐ, విజువల్ ఎఫెక్ట్స్ పనులను మరింత మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
‘సింగ్ గీతం’ ఒక ఫాంటసీ, సూపర్నేచురల్ ప్రపంచాన్ని ఆవిష్కరించే చిత్రం. ఇందులో సంగీతంతో పాటు విజువల్స్ కూడా కథనంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ప్రేక్షకులను ఆ ప్రపంచంలో పూర్తిగా లీనం చేసే అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతో, చిత్ర బృందం ఫైనల్ అవుట్పుట్ను మరింత పర్ఫెక్ట్ చేయడానికి అదనపు సమయం కేటాయిస్తోంది. థియేటర్లలోకి తొందరపడి తీసుకురావడం కంటే అత్యుత్తమ నాణ్యతతో అందించాలనే ఆలోచనతోనే ఈ ఒకరోజు వాయిదా నిర్ణయం తీసుకున్నారు.
వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయాన్, అహల్యా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, శాలిని కొండెపూడి కీలక పాత్ర పోషిస్తున్నారు. రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలు, నేపథ్య సంగీతం మెయిన్ హైలెట్స్ గా నిలవనున్నాయి.
ఇప్పటివరకు విడుదలైన పాటలు, టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చి సినిమాపై అంచనాలు పెంచాయి. విభిన్నమైన కాన్సెప్ట్, సింగీతం శ్రీనివాసరావు మార్క్ సృజనాత్మకత, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కలిసి ‘సింగ్ గీతం’ ను ఈ ఏడాది అత్యంత ప్రత్యేకమైన చిత్రాలలో ఒకటిగా నిలబెడుతున్నాయి.
చిన్న చిత్రాలకు థియేటర్స్ లభించని పరిస్థితులు ఇండస్ట్రీలో చూస్తున్నాం. అలాగే చిన్న నిర్మాతలు తమ సినిమాలను థియేటర్స్ లో రిలీజ్…
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా 'ఇరుముడి'. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం #RAPO23 అధికారికంగా లాంచ్ చేశారు. ఎన్నో ఏళ్ల పాషన్,…
సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ ప్రాజెక్ట్గా విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న చిత్రం ‘మకుటం’. స్వర్గీయ ఆర్…
అక్టోబర్ 2న వెంకటేష్-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదల తెలుగు సినీ ప్రియులు ఎంతగానో…
కర్ణాటక..చిక్కబళ్ళాపుర జిల్లా చింతామణి లో నివసించిన గాయత్రమ్మ ఆంజినప్పవాళ్ళ నిర్మాణంలో నవనారాయణ క్రియేషన్స్ బ్యానర్లో కాగితం పడవలు సినిమాను నిర్మించారు…