‘జవాన్’ ప్రివ్యూ వచ్చేసింది..

Must Read

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘జవాన్’. హై యాక్షన్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ ప్రివ్యూని సోమ‌వారం (జూలై 10) రోజున విడుద‌ల చేశారు. ఈ ప్రివ్యూ ఇప్పుడు ఇంట‌ర్నెట్‌ను షేక్ చేసేస్తుంది. స‌మాజంలోని త‌ప్పుల‌న స‌రిదిద్ద‌డానికి ఓ వ్య‌క్తి చేసే ఎమోష‌న‌ల్ జ‌ర్నీయే జ‌వాన్ సినిమా అని ప్రివ్యూ చూస్తే అర్థ‌మ‌వుతుంది.

Jawan |Official Telugu Prevue |Shah Rukh Khan |Atlee |Nayanthara |Vijay Sethupathi |Deepika |Anirudh

యాక్ష‌న్ ప్యాక్డ్‌గా రూపొందిన జ‌వాన్ మూవీ ప్రివ్యూ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లింది. భారీ విజువ‌ల్స్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేస్తుంది. ప్రేక్ష‌కుల‌కు ఓ అద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. యాక్ష‌న్‌, ఎమోష‌న్స్ ప‌ర్‌ఫెక్ట్ కాంబినేష‌న్‌లో జ‌వాన్ అంద‌రినీ అల‌రిచంనుంద‌ని ప్రివ్యూలో చూపించారు. ప్రతి ఫ్రేమ్‌లో భారీత‌నం, గొప్ప విజువ‌ల్స్‌ను చూస్తుంటే ప్రేక్ష‌కులు ఊహించిన దాని కంటే ఎక్కువ‌గా సినిమా ఉంటుంద‌నిపిస్తుంది.

జ‌వాన్ ప్రివ్యూని గ‌మ‌నిస్తే కింగ్ ఖాన్ షారూక్ వాయిస్ ఓవ‌ర్‌తో ప్రారంభం అవుతుంది. ప్ర‌తి ఫ్రేమ్ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను పెంచుతూ వ‌చ్చింది. మ‌రీ ముఖ్యంగా షారూక్ ఖాన్ డిఫ‌రెంట్ లుక్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని విధంగా షారూక్ లుక్స్ ఉన్నాయి. షారూక్‌తో పాటు న‌య‌న తార, దీపికా ప‌దుకొనె, ప్రియ‌మ‌ణి వంటి భారీ తారాగ‌ణం.. సినిమాలో భారీ విస్పోట‌న స‌న్నివేశాలతో రూపొందిన యాక్ష‌న్ సీక్వెన్స్‌, గ్రాండ్ స్కేల్‌లో తెర‌కెక్కిన పాట‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. మ‌రీ ముఖ్యంగా ‘ఈ మౌనం, ఈ బిడియం…’  రెట్రో సాంగ్‌లో షారూ క్ పెర్ఫామెన్స్ మెప్పిస్తోంది.

వ‌రుస హిట్స్‌తో త‌న‌దైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుడు అట్లీ మ‌రోసారి త‌న‌దైన మార్క్ చూపించారు. ఈ సినిమాలో తను డైరెక్ట‌ర్‌గా నెక్ట్స్ లెవ‌ల్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించార‌ని అర్థ‌మ‌వుతుంది. ఇక అనిరుద్ సంగీతం ప్రేక్ష‌కుల్లో మ‌రింత ఉత్సాహాన్ని నింపుతుంది. జవాన్‌లో గ్రామీ అవార్డ్స్‌లో నామినేట్‌కాబ‌డ్డ‌ అత్యంత ప్రజాదరణ పొందిన రాజా కుమారి రూపొందించిన ‘ది కింగ్ ఖాన్ రాప్’ మరింత జోష్‌ను నింపుతుంది. ఇవ‌న్నీ మ‌నం జ‌వాన్ ప్రివ్యూలో చూడొచ్చు.

ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టి వ‌ర‌కు రానీ విధంగా భారీ బ‌డ్జెట్‌తో పాటు భారీ తారాగ‌ణం ఈ సినిమాలో ఉంది. షారూక్ ఖాన్‌తో పాటు న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి, దీపికా ప‌దుకొనె, సాన్యా మ‌ల్హోత్రా, ప్రియ‌మ‌ణి, గిరిజ ఓక్‌, సంజిత భ‌ట్టాచార్య‌, లెహ్రా ఖాన్‌, అలియా ఖురేషి, రిది దోగ్రా, సునీల్ గ్రోవ‌ర్‌, ముఖేష్ చ‌బ్రా త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. నిజ‌మైన పాన్ ఇండియా మూవీగా జ‌వాన్ అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌వుతుంది.

ఈ ఏడాది అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న సినిమాల్లో జ‌వాన్ ఒక‌టి అని చెప్ప‌టంలో సందేహం లేదు. పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌తో ఆస‌క్తి పెంచుతూ వ‌చ్చిన ఈ సినిమా ప్రివ్యూ ఇప్పుడు అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచేసింది. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ స‌మర్ప‌ణ‌లో  గౌరీ ఖాన్ నిర్మాత‌గా జ‌వాన్ సినిమాను నిర్మిస్తున్నారు. అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గౌర‌వ్ వ‌ర్మ స‌హ నిర్మాత‌. ప్ర‌పంచ వ్యాప్తంగా  ‘జవాన్’ చిత్రం సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News