నేషనల్ లెవెల్ లో ట్రెండింగ్ అవుతున్న ఆదిత్యా రామ్ ప్యాలెస్

Must Read


గొప్ప కుటుంబాల్లో పుట్టి గొప్ప విజయాలను సాధించటం గొప్పకాదు… ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తి అసాధారణ విజయాలతో అద్భుతాలను సృష్టించడమే అసలైన విజయం. ఒక సాధారణ తోటరాముడు కోటలోని రాజకుమారి మనసు గెలుచుకున్న కథలో ఉండే కిక్కే వేరు. అలాగే ఒక సాధారణ వ్యక్తి అంచనాలకు అందనిస్థాయిలో ఒక శక్తిగా,ఒక వ్యవస్థగా విస్తరిల్లడంలో గొప్ప స్ఫూర్తిదాయకమైన ప్రస్థానం ఉంటుంది.

అలాంటి ఇన్స్పిరేషనల్ జర్నీ ఆదిత్యారామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఆదిత్య రామ్ జీవితంలో కనిపిస్తుంది. ఒక చిన్న రియల్టర్ గా వ్యాపార జీవితాన్ని ప్రారంభించిన ఆదిత్య రామ్ ఈ రోజున ఒక రియల్ ఎస్టేట్ టైకూన్ గా, వేలకోట్ల అధిపతిగా, భారతదేశంలోనే వన్ ఆఫ్ ద టాప్ బిలియనియర్స్ గా ఎదగడంలో నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగసే రాకెట్ వేగం కనిపిస్తుంది. క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన, నియమపాలన వంటి సత్ లక్షణాలనే తారకమంత్రాలుగా భావించిన ఆదిత్య రామ్ తన వ్యాపారాన్ని శాఖోప శాఖలుగా విస్తరించారు.

ఆదిత్య రామ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్

ఆదిత్య రామ్ స్టూడియోస్

ఆదిత్య రామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్

ఆదిత్య రామ్ మూవీస్

ఆదిత్య రామ్ కన్వెన్షన్స్ అండ్ రిసార్ట్స్

ఆదిత్య రామ్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్

ఆదిత్య రామ్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్

ఆదిత్యారామ్ వరల్డ్ మేకింగ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్

ఆదిత్య రామ్ చారిటబుల్ ట్రస్ట్

ఇలాంటి ఇంకా ఎన్నెన్నో సంస్థల సమాహారంగా ఎదిగింది ఆదిత్య రామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. దేశంలో వేలకోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులు కోకొళ్లలుగా ఉన్నారు. కానీ వారిలో ఏ ఒక్కరిద్దరికో మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు.. never before.. ever after అన్న ప్రత్యేకమైన క్రెడిట్ దక్కుతాయి. ఇంతకూ ఆ ప్రత్యేకత ఏమిటంటే…. ఆదిత్య రామ్ ప్యాలెస్ హేష్ ట్యాగ్ అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవటమే ఆ ప్రత్యేకత. అవును ఇప్పుడు చెన్నై మహానగరంలోని కాస్ట్లియస్ట్ ఏరియా అయిన ఈసీఆర్ రోడ్డులో ఆదిత్య రామ్ నిర్మించిన “ఆదిత్యా రామ్ ప్యాలెస్” ఇప్పుడు ట్విట్టర్లో టాప్ త్రీ లో ట్రెండింగ్ అవుతుందన్న వార్త ‘టాక్ ఆఫ్ ద నేషన్ ‘ అయింది. టాక్ ఆఫ్ ద నేషన్ అయ్యేంత అద్భుతం ఏం జరిగింది…? అంటే జరిగిందనే చెప్పాలి…. కలలో కనిపించే ఇంద్రభవనం కళ్ళముందే సాక్షాత్కరిస్తే అది అద్భుతం కాక మరేమౌతుంది…? అసలు 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చాక సౌత్ ఇండియాలో ఒక్కటంటే ఒక్క ప్యాలెస్ నిర్మాణం జరిగిన దాఖలాలు లేవు. అందుకే ఇప్పుడు చెన్నై మహానగరంలో ఆదిత్య రామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఆదిత్య రామ్ నిర్మించిన “ఆదిత్య రామ్ ప్యాలెస్” టాక్ ఆఫ్ ద కంట్రీగా సంచలనం సృష్టిస్తుంది. రియల్ ఎస్టేట్ అండ్ సినిమా రంగాలలో తిరుగులేని వ్యక్తిగా, శక్తిగా, వ్యవస్థగా ఎదిగిన ఆదిత్య రామ్ చెన్నై ఈసీఆర్ రోడ్డులోని తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంలో నిర్మించిన “ఆదిత్య రామ్ ప్యాలెస్” ఇంద్రభవనాన్ని తలపిస్తూ నేషనల్ వైడ్ గా థర్డ్ ప్లేస్ లో ట్రెండింగ్ అవుతుంది.

తెలుగువారైన ఆదిత్య రామ్ పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రియల్ ఎస్టేట్ అండ్ సినిమా రంగాలలో ప్రభంజన విజయాలు సాధించటం మనందరికీ గర్వకారణం. కుటుంబాన్ని అమితంగా ప్రేమించే ఆదిత్య రామ్ తన కుటుంబం కోసం అత్యాధునిక సౌకర్యాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏకంగా ఒక ఇంద్ర భవనాన్ని బహూకరించడం విశేషం. సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సైతం తలలు తిప్పి మరీ “ఆదిత్య రామ్ ప్యాలెస్” ను ఆసక్తిగా తిలకిస్తూ పోవటం ఇప్పుడు ‘టాక్ ఆఫ్ ద చెన్నై సిటీ’ అయింది. చెన్నై మహానగరంలో ఎన్నెన్నో ప్రతిష్టాత్మకమైన వెంచర్స్ నిర్మించి “రియల్ ఎస్టేట్ టైకూన్” గా ఎన్నెన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు సొంతం చేసుకున్న ఆదిత్య రామ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం తో పాటు సినిమా రంగంలో కూడా సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నా రు.

గతంలో సందడే సందడి, ఖుషీ ఖుషిగా, స్వాగతం, ఏక్ నిరంజన్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆదిత్య రామ్ దాదాపు పుష్కరకాల విరామం తరువాత చిత్ర రంగ పునః ప్రవేశం చేయటాన్ని స్వాగతనీయ పరిణామంగా భావిస్తుంది చిత్ర పరిశ్రమ. welcome to the most Dynamic Decessive , Goal oriented Creative business Tycoon Mr Adityaaram.. 💐💐💐🙏🙏🙏

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News