పరారి” మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదల మార్చి30న రిలీజ్

Must Read

శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్ లో, గాలి ప్రత్యూష సమర్పణలో, యోగేశ్వర్ అతిధి జంటగా, సాయి శివాజీ దర్శకత్వంలో, జివివి గిరి నిర్మించిన చిత్రం పరారీ..ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్ కు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ చిత్రం మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా వచ్చిన కాంగ్రెస్ లీడర్ అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ నటులు సుమన్, ప్రసన్న కుమార్ లు థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయగా , దర్శకులు చంద్ర మహేష్, నిర్మాత తుమ్మల పల్లి రామసత్య నారాయణ, ప్రతాని రామకృష్ణ గౌడ్ లు థియేట్రికల్ ప్రోమో ను విడుదల చేశారు.నటి కవిత సాంగ్ ప్రోమో ను విడుదల చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్స్ సి. హెచ్ హనుమంత రావు, గాలి అనిల్ కుమార్, రవతు కనకయ్య, పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొని చిత్ర హీరో యోగేశ్వర్ బర్త్ డే సెలెబ్రేషన్ గ్రాండ్ గా జరిపి కేక్ కట్ కట్ చేశారు అనంతరం కాంగ్రెస్ నాయకులు శ్రీ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. గిరి గారి అబ్బాయి యోగేష్ హీరో బాగా నటించారు. గిరి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా.చాలా రిచ్ గా తీశారు. మంచి కథతో వస్తున్న ఈ సినిమా యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్ అన్నారు.

శ్రీ .వి.హనుమంతరావు మాట్లాడుతూ.. తెలుగుకు ఆస్కార్ అవార్డు వచ్చిన సమయంలోనాగార్జున యూనివర్సిటీలో ఆర్. జీ.వి మహిళలను కించ పరచే విధంగా మాట్లాడడం కరెక్ట్ గా లేదు. తను వెంటనే మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలి. చెప్పక పొతే తనను ఇండస్ట్రీ వారందరూ తనను బహిస్కరించి చంచల్ గుడా జైలుకు పంపాలి. ఈ సినిమాలో నటించిన హీరో కు నిర్మాతకు ఈ సినిమా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటులు సుమన్ మాట్లాడుతూ.. మన తెలుగు సినిమాకు ఆస్కార్ వచ్చేలా కృషి చేసిన RRR టీం కు కంగ్రాట్స్. ఇది మన తెలుగు వారందరూ గర్వించే రోజు.ఇలాగే మన తెలుగు వారు మంచి సినిమాలు తీసి మరిన్ని ఆస్కార్ తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిర్మాత గిరి నను హీరోగా పెట్టి సినిమా తీస్తాను అంటే వద్దని తన కొడుకును హీరోగా మలచి ఇంట్రడ్యూజ్ చేయడం జరిగింది. అంజి గారు మా సినిమాకు డి. ఓ. పి గా చేయడం చాలా హ్యాపీ.. మహిత్ లాంటి మంచి మ్యూజిక్ డైరెక్టర్ లభించారు. ఇలా అందరూ మంచి టెక్నిషియన్స్ లభించడంతో సినిమా చాలా బాగా వచ్చింది.హీరో యోగేష్ చాలా బాగా నటించాడు. ఒక వైపు చదువు, మరో వైపు షూటింగ్ ఇలా కాలీ లేకుండా ఈ సినిమా కొరకు చాలా కస్టపడ్డాడు. .ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు మంచి సినిమా చూశాము అనే ఫీల్ కలిగేలా కలుగుతుంది. ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

నటి కవిత మాట్లాడుతూ.. ఈ సినిమా పాటలు చాలా బాగున్నాయి. ఇందులో హీరో చాలా చక్కటి నటనను ప్రదర్శించాడు. తను ఐ ఏఎస్ కు ప్రిపేర్ అవుతూ నటించడం చాలా గ్రేట్. మంచి కథతో ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పరారి చిత్రం చిత్ర యూనిట్ అందరికీ గొప్ప విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత జి వి వి గిరి మాట్లాడుతూ: మా కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. చక్రి తమ్ముడు మహిత్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నేను సుమన్ గారి అభిమానిని. ఆయన ఈ మూవీ లో సుమన్ మంచి క్యారెక్టర్ చేశారు. ఈ సినిమా బాగా వచ్చింది.ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా మంచి కథ కథనాలతో తెరకెక్కిన పరారీ అందరిని మెప్పిస్తుందని అన్నారు.

సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ మాట్లాడుతూ..
హీరో యోగేష్ కు జన్మదిన శుభాకాంక్షలు.తను ఇందులో బాగా నటించాడు.సుమన్ గారు మా సినిమాకు చాలా ఎఫెక్ట్ పెట్టి పని చేశారు. ఇందులో సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ఈ సినిమా నాకు మంచి పేరు వస్తుంది. నిర్మాత గిరి గారు ఎక్కడ ఖర్చుకు వెను కాడకుండా నిర్మించారు. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు థాంక్స్ అని అన్నారు.

డి. ఓ. పి గరుడ వేగ అంజి మాట్లాడుతూ.. గిరి గారు చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత. మంచి కథను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమాలో తన కొడుకు యోగీశ్వర్ చాలా బాగా నటించాడు. మహిత్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. దర్శకుడు మంచి టీం తో అనుకున్న టైంలో, బడ్జెట్ లో సినిమా పూర్తి చేశాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈసినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నిర్మాత గిరి గారు అబ్బాయి ఈ సినిమా తో హీరోగా పరిచయం అవుతున్నారు. తను ఇందులో బాగా నటించాడు.అల్ ది బెస్ట్ యోగిశ్వర్.ఈ సినిమా టీజర్ బాగుంది. మహిత్ సాంగ్స్ బాగున్నాయి. ఈ నెల 30 న వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి చిత్ర బృందానికి మంచి పేరు రావాలని అన్నారు

శ్రీ రౌతు కనకయ్య మాట్లాడుతూ.. మహిత్ గారు ఈ సినిమాకు మంచి సాంగ్స్ ఇచ్చాడు. సుమన్ గారు ఇందులో బాగా చేశాడు.చిత్ర యూనిట్ అందరికీ ఆల్ డ బెస్ట్ అన్నారు.

సుప్రీం కోర్డ్ రిటైడ్ జడ్జ్ శ్రీ మాల్యాద్రి మాట్లాడుతూ..మంచి భవిష్యత్తు ఉన్న యోగీశ్వర్ కు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

దర్శకులు చంద్ర మహేష్ మాట్లాడుతూ.. పరారి ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి. హీరో కు ఇది మొదటి సినిమా అయినా చాలా బాగా నటించాడు.ఈ నెల 30 న వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

చిత్ర హీరో యోగిశ్వర్ మాట్లాడుతూ..సుమన్ సార్ తో నా మెదటి సినిమాలో నటిస్తానని అనుకోలేదు. మా డి. ఓ పి అంజి గారు నన్ను బాగా చూయించారు. మంచి కథ, మంచి కామెడీ, ఫైట్స్ తో వస్తున్న ఈ సినిమా చూసిన వారందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఇందులో నటించిన నటులు, టెక్నిషియన్స్ అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

శ్రీ గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. మా కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. మా అన్న కుమారుడు యోగీశ్వర్ నటించిన ఈ సినిమా తర్వాత తను మరెన్నో సినిమాలో నటించి మంచి పేరు తెచ్చికోవాలని అన్నారు.

చిత్ర హీరోయిన్ గీతాంజలి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.

నటీ నటులు
యోగిశ్వర్, అతిధి, సుమన్, భూపాల్, శివాని సైని, రఘు కారుమంచి, మకరంద్ దేశముఖ్, షయాజి షిండే, అలీ , శ్రవణ్, కల్పాలత, జీవ తదితరులు

సాంకేతిక నిపుణులు
నిర్మాత: జి వి వి గిరి,
దర్శకత్వం: సాయి శివాజీ
సంగీతం మహిత్ నారాయణ్,
లిరిక్ రైటర్స్: రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, సినిమాటోగ్రఫీ; గరుడ వేగా అంజి,
ఎడిటర్ గౌతమ్ రాజు,
ఆర్ట్స్; ఆనంద్, కోటి అబలయ్,
యాక్షన్ :నందు,
కొరియోగ్రఫీ: జానీ, భాను,

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News