ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్‌ కాంబినేష‌న్‌లో యాక్ష‌న్ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభం

Must Read

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆద‌ర‌ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క్రేజీ ప్రాజెక్ట్స్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న ఈ స్టార్ హీరో ఇప్పుడు బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ పాన్ ఇండియా మూవీని చేస్తున్నారు. కెజియ‌ఫ్‌, స‌లార్ చిత్రాల త‌ర్వాత నీల్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి ఎన్టీఆర్ నీల్ అనే వ‌ర్కింగ్ టైటిల్‌ను పెట్టారు. ఎప్పుడో అధికారికంగా ప్ర‌క‌టించిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా అని ఫ్యాన్స్ స‌హా ప్రేక్ష‌కులు ఎదురు చూడ‌సాగారు. అంద‌రి ఆశ‌ల‌ను నిజం చేస్తూ శుక్ర‌వారం ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు. 

హైద‌రాబాద్‌లో ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఎన్టీఆర్ అత‌ని కుటుంబ స‌భ్యుల‌తో పాటు డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్, ప‌లువురు సినీ ప్ర‌ములు హాజ‌ర‌య్యారు. అభిమానుల‌కు ఆనందాన్నిచ్చేలా ‘ఎన్టీఆర్ నీల్’ ప్రాజెక్ట్‌ను జనవరి 9, 2026లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. 

బ్లాక్ బ‌స్ట‌ర్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌తో మెప్పించిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ వంటి మ్యాన్ ఆఫ్ మాసెస్‌ను నెక్ట్స్ రేంజ్లో ప్రొజెక్ట్ చేస్తార‌న‌టంలో సందేహం లేదు. ఈ విష‌యం ఫ్యాన్స్‌లో మ‌రింత ఆస‌క్తిని పెంపొందిస్తోంది. ఇండియ‌న్ సినీ హిస్టరీ ఈ మూవీ సరికొత్త రికార్డుల‌ను  క్రియేట్ చేస్తుంద‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. 

ప్ర‌తిష్టాత్మ‌క‌మైన నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై ఈ సినిమా రూపొంద‌నుంది. ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబో మూవీ అంటే అభిమానుల్లో, ప్రేక్ష‌కుల్లో ఎలాంటి అంచ‌నాలుంటాయో, ఆ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మించేలా ఎన్టీఆర్‌నీల్ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మించి,  కెజియ‌ఫ్ త‌ర‌హా ఓ స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌నున్నారు మేక‌ర్స్. 

మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, న‌వీన్ ఎర్నేని, ర‌వి శంక‌ర్ ఎల‌మంచిలి, హ‌రికృష్ణ కొస‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ర‌వి బస్రూర్ సంగీతాన్ని అందిస్తు్న్నారు. చ‌ల‌ప‌తి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్న ఈ భారీ చిత్రం కోసం స్టార్ యాక్ట‌ర్స్‌, న‌టీన‌టులు సిద్ధ‌మ‌వుతున్నారు. 

న‌టీన‌టులు: 

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్స్ :  మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్‌, నిర్మాత‌లు:  నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, న‌వీన్ ఎర్నేని, ర‌వి శంక‌ర్ య‌ల‌మంచిలి, హ‌రికృష్ణ కొస‌రాజు, సినిమాటోగ్ర‌ఫీ:  భువ‌న్ గౌడ‌, సంగీతం:  ర‌వి బ‌స్రూర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  చ‌ల‌ప‌తి, పి.ఆర్‌.ఒ:  వంశీ కాకా

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News