‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ : ప్రెస్ మీట్ లో త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ & టీం

ఈషా ఫేం త్రిగుణ్, పాపం ప్రతాప్ ఫేం పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో చేస్తున్న హోల్సమ్ ఎంటర్టైనర్ ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా ముత్యాల రామ్ దాస్ ఈ చిత్రాన్ని వరల్డ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. మే 15న సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్‌లో నిర్మాత అరవింద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ సినిమా చాలా క్రియేటివ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. పాయల్, త్రిగుణ్ అందరూ మంచి టీమ్‌వర్క్‌తో చేశారు. ఇందులో విజువల్స్, మ్యూజిక్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఇది అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్‌టైనర్. ఈ సమ్మర్‌లో ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమాను థియేటర్స్‌లో చూడండి. నచ్చితే పదిమందికి చెప్పండి. మీ అందరి ప్రోత్సాహం కావాలని కోరుకుంటున్నాను. రామ్ దాస్ గారు మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమాను గ్రాండ్‌గా మీ ముందుకు తీసుకొస్తున్నారు. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. దాసరి గారు “ప్రేక్షక దేవుళ్లు” అనేవారు. ఆయన ఎందుకు అలా అనేవారో ఈ రోజు అర్థమైంది. ప్రేక్షకులు కనికరిస్తేనే సినిమా ప్రాణం పోసుకుంటుంది. ఈ సినిమా మనం రోజువారీగా చూసే పాత్రలు, సంఘటనలతో సరదాగా ఉంటుంది. అలాగే ఇందులో అద్భుతమైన ప్రేమకథ ఉంటుంది. ఆ ప్రేమకథలోని కాన్ఫ్లిక్ట్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. రామ్ దాస్ గారు ఈ సినిమాను రిలీజ్ చేయడం మా నమ్మకాన్ని మరింత బలపరిచింది. ఈ సినిమా సమ్మర్‌లో అందరూ ఎంజాయ్ చేసే సినిమా. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా మీ జీవితంలో గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో చూపించిన క్లైమాక్స్ కూడా నిజ జీవితానికి ఉపయోగపడుతుంది. టెక్నికల్‌గా ఈ సినిమా చాలా బలంగా ఉంటుంది. పాయల్, త్రిగుణ్ అద్భుతంగా నటించారు. పాయల్ తెలుగు నేర్చుకుని డైలాగులు చెప్పారు. త్రిగుణ్ నా ఫస్ట్ హీరో. తనని ఎప్పటికీ మర్చిపోలేను. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది.

హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాకు గుర్తింపు ఇచ్చింది తెలుగు చిత్ర పరిశ్రమ. నేను ఇక్కడే సెటిల్ అవ్వాలని భావిస్తున్నాను. వరుసగా ఇక్కడ సినిమాలు రావడం, తాజాగా ‘పాపం ప్రతాప్’తో విజయం రావడం ఆనందంగా ఉంది. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రాజెక్ట్ ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మే 15న అందరూ థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను.

హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది ఫుల్ ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మంచి కాన్సెప్ట్ కూడా ఉంటుంది. చాలా మంచి సినిమా తీసుకొస్తున్నాం. మే 15న ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. ఈ సమ్మర్‌లో సినిమా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. పాయల్ లక్ ఈ సినిమాకి కలిసి రావాలని కోరుకుంటున్నాను. అందరికీ నచ్చే సినిమా ఇది. ఈ సినిమాను థియేటర్స్‌లో చూసి పెద్ద హిట్ ఇస్తారని కోరుకుంటున్నాను.

డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రామ్ దాస్ మాట్లాడుతూ.. ‘ఈషా’తో విజయాన్ని అందుకున్న త్రిగుణ్, ‘పాపం ప్రతాప్’తో మంచి ప్రశంసలు అందుకున్న పాయల్ రాధాకృష్ణ ఈ చిత్రంలో చాలా చక్కగా నటించారు. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ చాలా మంచి కాన్సెప్ట్‌తో రూపొందించారు. మంచి కాన్సెప్ట్ ఉంటే చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తాయి. ఇందులో కూడా అలాంటి మంచి కాన్సెప్ట్ ఉంది. నిర్మాత అరవింద్ చాలా మంచి ప్యాషన్‌తో నిర్మించారు. ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్స్‌లో సూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను.

నటీనటులు: త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ & అనీష్ కురువిల్లా, శివాజీరాజా, హర్ష వర్ధన్, సత్య కృష్ణన్, హర్ష చెముడు, నెల్లూరు సుదర్శన్, సివిఎల్ నర్సింహారావు, గుండు సుదర్శన్, వేణు యెల్దండి, సప్తగిరి, గిరిధర్, సరయు, సత్తిపండు

దర్శకత్వం: మధుదీప్ చెలికాని
నిర్మాత: అరవింద్ మండెం
సమర్పణ: CH.V.S.N బాబ్జీ
బ్యానర్ : లోటస్ క్రియేటివ్ వర్క్స్
స్క్రిప్ట్ కోఆర్డినేటర్: పవన్ కొడాలి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రవికుమార్ వి.
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: ప్రకాష్ చెరుకూరి, అరుణ్ చిలువేరు
సౌండ్ డిజైనర్: సంతోష్ వొదనల
యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్ సుంకర
పబ్లిసిటీ డిజైన్స్: JK ఫ్రేమ్స్
PRO: తేజస్వి సజ్జా

TFJA

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

4 days ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

5 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

2 weeks ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

2 weeks ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

2 weeks ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

2 weeks ago