“సంతాన ప్రాప్తిరస్తు” చిత్రంతో మంచి విజయాన్ని దక్కించుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో విక్రాంత్..ఇప్పుడు మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంలోని నటనకు ఆయన ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్ – జ్యూరీ స్పెషల్ అవార్డ్’ అందుకున్నారు. కెరీర్ ప్రారంభంలోని ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డ్ దక్కడంపై హీరో విక్రాంత్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ అవార్డ్ తనకు మరిన్ని మంచి చిత్రాలు చేయాలనే స్ఫూర్తిని కలిగించిందని విక్రాంత్ చెప్పారు.
“సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి రూపొందించారు. “సంతాన ప్రాప్తిరస్తు” గతేడాది నవంబర్ లో థియేట్రికల్ గా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. డిజిటల్, శాటిలైట్ ప్లాట్ఫామ్స్ లో కూడా ప్రేక్షకాదరణ పొందింది. జియో హాట్స్టార్లో 6 వారాలకు పైగా నెం.1 తెలుగు మూవీగా ట్రెండ్ అవుతూ, స్టార్ మా ఛానెల్లో కూడా మంచి టీఆర్ పీ రేటింగ్స్ సాధించింది. ప్రస్తుతం విక్రాంత్ దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ లో “మార్కండేయ” అనే మిస్టిక్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు.
ప్రెస్ నోట్ Date: 26/07/2026పద్మశ్రీ పురస్కార గ్రహీత, కళా ప్రపూర్ణ డా. మంచు మోహన్ బాబు గారు మే 4…
నటుడు సాయికుమార్ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులుండరు. ఆయన్ను తలచుకోగానే ముందు గుర్తుకు వచ్చేది ఆ గంభీరమైన గాత్రం, ఆకట్టుకునే…
-మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ కావడం నా కల తీరిన అనుభూతినిస్తోంది - డైరెక్టర్ రవి నంబూరి -నివి పాత్ర…
డాక్టర్ టర్నెడ్ హీరోపవన్ మహావీర్ ఆగస్టు 7 విడుదలకు సిద్ధమవుతున్న"అమ్మా…….నాకు ఆ అబ్బాయి కావాలి" జిఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై…
విభిన్న కాన్సెప్ట్తో రూపొందుతున్న 'లూసీ' చిత్రానికి సంబంధించిన షూటింగ్ విజయవంతంగా పూర్తైంది. మైండ్-బెండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా…
ఆగస్టు 7 విడుదలకు సిద్ధమవుతున్న"అమ్మా…….నాకు ఆ అబ్బాయి కావాలి" జిఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ ను హీరోగా…