మైత్రీ మూవీ మేకర్స్ తో తెలుగులో లాంచ్కావడం నా అదృష్టం: అతుల్యరవి

Must Read

‘మీటర్’ లో మాస్ ఎంటర్‌ టైన్‌ మెంట్ తో పాటు బలమైన ఎమోషన్స్ వుంటాయి. మైత్రీ మూవీ మేకర్స్ తో తెలుగులో లాంచ్ కావడం నా అదృష్టం: అతుల్య రవి

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్  ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌ టైన్‌ మెంట్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన మీటర్ టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ స్పెషల్‌ గా ఏప్రిల్ 7న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన అతుల్య రవి విలేఖరుల సమావేశంలో ‘మీటర్’  విశేషాలని పంచుకున్నారు.

‘మీటర్’తో తెలుగు పరిశ్రమలోకి రావడం ఎలా అనిపిస్తోంది ? 

తెలుగు పరిశ్రమలోకి రావాలని బలంగా కోరుకున్నారు. దేవుడి దయ వలన  మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి ప్రముఖ సంస్థ నిర్మిస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమాలో అవకాశం రావాడం చాలా ఆనందంగా వుంది. కథ చెప్పినప్పుడే చాలా నచ్చింది. అంతకుమందే కిరణ్ అబ్బవరం గారి ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా కూడా చూశాను. చాలా నచ్చింది.

కథలో మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏమిటి ?

మీటర్ పక్కా కమర్షియల్ మూవీ. ఇందులో అద్భుతమైన ఎమోషన్స్ కూడా వున్నాయి. ఒక కమర్షియల్ సినిమాలో ఎమోషన్స్ వున్నపుడు అందరూ కనెక్ట్ అవుతారు. పాటలు కూడా చాలా బావుంటాయి. భారీ సెట్ లో ఒక సాంగ్ చేశాం. డ్యాన్సులు కూడా బావుంటాయి. మాస్ ఫైట్స్ రోమాన్స్ లవ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ తో పాటు ఫాదర్ సెంటిమెంట్ కీలకంగా వుంటుంది.

తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారు ?

మీటర్ చేస్తున్నప్పుడే (నవ్వుతూ). సినిమాలు చూస్తూ.. టీంతో మాట్లాడుతున్నపుడు అలా వచ్చేసింది. ఇంకా చక్కగా నేర్చుకోవాలి.

మీటర్ లో మీ పాత్రలో ఎలా వుంటుంది ?

ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్ గా వుంటుంది. అబ్బాయిలు అంటే ఇష్టం లేని పాత్రలో కనిపిస్తాయి. నా పాత్ర సీరియస్ గా వుంటుంది. కానీ అందులో నుంచే కామెడీ జనరేట్ అవుతుంది. నా పాత్ర ఫస్ట్ హాఫ్ లో చాలా కామెడీ వుంటుంది.

చమ్మక్ చమ్మక్ పోరి పాటలో డ్యాన్స్ చాలా బాగా చేశారు కదా ?

నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఇంట్లో వాళ్ళు నేర్పించలేదు. అయితే డ్యాన్స్ అంటే చాలా ఆసక్తి. ఎవరైన నేర్పితే మాత్రం ఎలాంటి మూమెంట్స్ అయిన చాలా త్వరగా నేర్చుకుంటాను.

ఈ పాత్ర మీ నిజ జీవితానికి దగ్గరగా వుంటుందా ?

లేదండీ. ఇది పూర్తిగా భిన్నం.

ఇది మీకు కొత్త పరిశ్రమ కదా.. దీనికి అలవాటు పడటానికి ఎంత సమయం పట్టింది ?

నాకు అలాంటి ఫీలే లేదండీ. కథ విన్నప్పుడే చాలా కంఫర్ట్ బుల్ అనిపించింది. లుక్ టెస్ట్ అయిన తర్వాత నేరుగా షూటింగ్ కి వెళ్ళాం. కిరణ్ గారు కూడా చాలా ఫ్రండ్లీ. తనలాగే నేను కూడా షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ మూవీ చేసే వచ్చాను. ఆ కామన్ కనెక్షన్ మొదటి నుంచి వుంది. మేము ఎప్పుడూ సినిమా గురించే మాట్లాడుకుంటాం.

ఇందులో కిరణ్ – మీ పాత్ర కెమిస్ట్రీ ఎలా వుంటుంది?

కిరణ్ – నాకు వున్న కాంబినేషన్ సీన్స్ చాలా సరదాగా వుంటాయి. హీరోయిన్ ఫాలో చేసి టీజ్ చేయడం, ప్రేమించడం.. ఇలా హిలేరియస్ గా ఉంటుంది. మరో కోణంలో ఎమోషన్స్ ఫైట్స్ మాస్ వుంటుంది. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న ఈ సినిమాని కిరణ్ అద్భుతంగా చేశారు. ఎమోషన్స్ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యాయి.

ఎలాంటి జోనర్స్ సినిమాలు చేయాలని వుంది ?

ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ చేయాలని వుంది. అలాగే రస్టిక్ సినిమాలు కూడా చేయాలని వుంది. ప్రయోగాత్మక పాత్రలు కూడా చేయాలనే ఆసక్తివుంది.

తెలుగులో ఏ హీరోలతో కలిసిపని చేయాలని వుంది ?

పవన్ కళ్యాణ్ గారు, బాలయ్య గారు, చిరంజీవి గారు,, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, జా.ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు , రామ్ గారు, నితిన్ గారు.. ఇలా చాలా పెద్ద లిస్టే వుంది(నవ్వుతూ).

మీటర్ ప్రమోషన్స్ రెస్పాన్స్ ఎలా వుంది ?

ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానికి చాలా అనందంగా వుంది. ఇంత అభిమానం ఊహించలేదు. ఎక్కడికి వెళ్ళిన ప్రేక్షకులు ప్రేమాభిమానాలు కురిపించడం గొప్ప అనుభూతి. వారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు.

మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌ టైన్‌మెంట్ తో కలసి పని చేయడం ఎలా అనిపించింది ?

మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో తెలుగు లో లాంచ్ కావడం నా అదృష్టం. నవీన్ గారు, రవి గారు, చెర్రీ గారికి జీవితాంతం రుణపడి వుంటాను

కొత్తగా చేయబోతున్న సినిమాలు ?

తమిళ్ లో హరీష్ కళ్యాణ్ తో డీజల్ సినిమా చేస్తున్నా. ఇంకొన్ని చర్చల దశలో వున్నాయి.

అల్ ది బెస్ట్

థాంక్స్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News