‘టిక్ టాక్’ ను మరిపించేలా “ME 4 Tic Tic” యాప్.

Must Read

ప్రస్తుత జీవితంలో మనందరికీ సోషల్ మీడియా అనేది తప్పనిసరి అయ్యింది. ఎక్కడో చిన్న పల్లెటూరు లో ఉన్న వారు సైతం ఒక వైపు చదువుకుంటూ, మరో వైపు సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ ను నిరూపించుకుంటూ ఎంతో పాపులర్ అయ్యారు. అయితే కొన్ని భద్రతా కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం “టిక్ టాక్” ను బ్యాన్ చేసింది. ఆ తరువాత యువత తమ ట్యాలెంట్ ను ప్రపంచానికి తెలియజేయడానికి మరో ఆల్టర్నేట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా “రియోజాన్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. INC” సంస్థ వారు “ME 4 Tic Tic” యాప్ ను హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో ప్రముఖులు మరియు యువత సమక్షంలో ఘనంగా లాంచ్ చేయడం జరిగింది. టిక్ టాక్ లేక ఇబ్బంది పడుతున్న ట్యాలెంటెడ్ యూత్ కు ‘ME 4 టిక్ టిక్’ యాప్ ఒక యూజర్ ఫ్రెండ్లీ గా ఉంటుంది. ఈ “ME 4 టిక్ టిక్” యాప్ కు రియోజాన్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్. ఇండియా విభాగానికి డి.సతీష్ రెడ్డి గారు CEO గా వ్యవహరిస్తున్నారు.
ఈ యాప్ లాంచ్ కు ముఖ్య అతిథులుగా వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, ఫిల్మ్ ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి, సినీ జోష్ వెబ్ సైట్ సీ ఈ ఓ రాంబాబు పర్వతనేని, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, పీ ఆర్ ఓ ఆర్.డి.ఎస్ ప్రకాష్ ల చేతుల మీదుగా ఘనంగా లాంచ్ చేయడం జరిగింది. “ME 4 Tic Tic” యాప్ ఇండియా CEO, డి.సతీష్ రెడ్డి మాట్లాడుతూ..

‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ యాప్ అయిన “ME 4 Tic Tic ” ను మీడియా సమక్షంలో ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ “రియోజాన్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. INC” కంపెనీ వారి ఈ యాప్ 150 దేశాలలో అందుబాటులో ఉంటుంది. ఇంతకు ముందు ఉన్న చైనా యాప్ లో సెక్యూరిటీ ప్రాబ్లెమ్ ఉన్నందున వాటిని కేంద్రం బ్యాన్ చేయడం జరిగింది. అయితే ఇండియా లో మేము విడుదల చేసిన “ME 4 టిక్ టిక్” యాప్ అనుమతుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం మరువలేనిది. వారందరికీ మా ధన్యవాదాలు. అలాగే తెలంగాణ ఐ టి మినిస్టర్ కె. టి. ఆర్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. వారికి నా ధన్యవాదాలు. మేము విడుదల చేసిన “ME 4 టిక్ టిక్” యాప్ ఫుల్ సెక్యూర్డ్ గా ఉంటుంది. ఇందులో ఉండే డేటా చాలా సేఫ్. ఈ రియోజాన్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. INC వారి ఈ యాప్ 150 దేశాలలో అందుబాటులో ఉంది. ఇది మన భారత ఐటీ యువత రూపొందించిన హైలీ సెక్యూర్డ్ యాప్. మేము ఆమెజాన్ తో టై అప్ అయ్యాం. వారి సర్వర్ల ద్వారా ఇది పనిచేస్తుంది. కాబట్టి అమెజాన్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఈ యాప్ ఉంటుంది. టిక్ టాక్ ను మరిపించేలా మేము విడుదల చేసిన “ME 4 టిక్ టిక్” యాప్ లో అన్ని రకాల కంటెంట్ తో అందరినీ అలరిస్తుంది. చాలా మంది ఈ యాప్ ఫారిన్ క్రియేట్ అయ్యింది అనుకుంటున్నారు. కానీ ఇది పూర్తిగా ఇండియాలో యువతీ, యువకుల తెలివి తేటలతో రూపొందించిన యాప్.

ఒక ఇండియన్ అయిన నేను ఇండియాలో ఈ యాప్ లాంచ్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. “VIP ప్రైమ్” సంస్థ ఇండియా లో సినిమాలు కొనటం ప్రారంభించింది. ;సీఈఓ డి. సతీష్ రెడ్డి రియోజాన్ నుండి ఈ ఒక్క యాప్ మాత్రమే కాకుండా ఇదే సంస్థ నుండి ప్రేక్షకులను అలరించడానికి “VIP ప్రైమ్” అను ఓటిటి ప్లాట్ ఫామ్ కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతుంది. “VIP ప్రైమ్” సంస్థ ఇండియా లో సినిమాలు కొనటం ప్రారంభించింది. ఇది ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండాలనే పట్టుదలతో ఈ రోజు దానికి సంబంధించిన లోగోను విడుదల చేయడం జరిగింది. ఈ ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో ఇండియన్ సినిమాల బిజినెస్ చేయడం ప్రారంభించాము. అలాగే మన తెలుగు న్యూస్ అందించడానికి ఇండియాలో “BIJ” ఓటీటీ న్యూస్ ను అందుబాటులోకి తెస్తున్నాము. ఈ న్యూస్ 150 దేశాల్లో చూసేలా ఈ యాప్ ను డిజైన్ చేశాము. మేము అమెజాన్ తో బిజినెస్ పార్టనర్ గా ఉన్నందున, మేము అందించే ఈ కంటెంట్ అమెజాన్ సర్వర్ ద్వారా ప్రసారమవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాము’ అన్నారు. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ వినాయకరావు మాట్లాడుతూ..

“అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇదివరకు మనలో ఉన్న ట్యాలెంట్ ను ఏ రూపంలో చూయించాలో తెలియక చాలా కష్టపడాల్సి వచ్చేది.అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చిన తరువాత టిక్ టాక్ వలన చాలా మంది సినిమా స్టార్స్ కంటే ఎక్కువ పాపులారిటీ సాధించారు. ప్రస్తుతం అలాంటివి లేని టైమ్ లో ఇప్పుడు రియోజాన్ వారు “ME 4 టిక్ టిక్” ను తీసుకురావడం శుభపరిణామం. ఈ యాప్ ద్వారా కూడా ఎంతో మంది యువతీ, యువకులు స్టార్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, సినీ నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ఇదివరకు సినిమాలో ఏ క్యారెక్టర్ కు ఎవరు సూట్ అవుతారని ఫోటో షూట్ చూసి సెలెక్ట్ చేసేవారు. అయితే సోషల్ మీడియా వచ్చిన తరువాత చాలామంది దర్శక, నిర్మాతలకు ఈజీ అయ్యింది. అనూహ్యంగా ‘టిక్ టాక్’ బంద్ అయిన తరువాత “ME4 టిక్ టిక్” పేరుతో వస్తున్న ఈ యాప్ పెద్ద సక్సెస్ అవ్వాలి అన్నారు.సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ సినీ జోష్ సీఈఓ రాంబాబు పర్వతనేని మాట్లాడుతూ.. టిక్ టాక్ యాప్ ను ఇండియాలో బ్యాన్ చేసిన తరువాత “ME4టిక్ టిక్” యాప్ లైసెన్స్ పొందడమే గొప్ప అచీవ్ మెంట్ గా భావించాలి. అక్కడే రియోజాన్ సంస్థ విజయం సాధించింది అని చెప్పవచ్చు. ఈ యాప్ ఇండియా లోని మన తెలుగు రాష్ట్రం నుండి 150 దేశాలకు వెళ్లడం గర్వకారణం. అందుకు టీం అందరికీ కంగ్రాట్స్” అన్నారు. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ఆర్.డి.ఎస్.ప్రకాష్ మాట్లాడుతూ.. “ఇంతకు ముందు ఉన్న యూత్ అంతా వారి ట్యాలెంట్ ను చైనా యాప్ లో ప్రూవ్ చేసుకొనే వారు.

అయితే అది బ్యాన్ అయిన తరువాత యువత తమ ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో ఇండియన్ టెక్నాలజీ తో భారత యువత రూపొందించిన “ME4 టిక్ టిక్” రావడం హర్షించదగ్గ విషయం . ప్రస్తుతం తెలుగు సినిమా ఫీచర్ ఫిలిమ్స్ మాత్రమే కాక.. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ లలో వస్తున్నాయి. కనుక ఇప్పుడు వచ్చే “ME 4 టిక్ టిక్” యాప్ ద్వారా టాలెంట్ ఉన్న వారిని గుర్తించడం ఇండస్ట్రీ కి చాలా ఈజీ అవుతుంది. వెంటనే ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని వారి ట్యాలెంట్ ను నిరూపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర బృందం తో పాటు ఈ యాప్ ను ఆశీర్వదించటానికి వచ్చిన శ్రేయోభిలాషులు, అతిధులు దర్శకుడు జి. వి. కృష్ణన్, నిర్మాతలు శివ కంఠమనేని, శాంతన్ రెడ్డి, Drసింధు రెడ్డి, ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ జె. ప్రభాకర్ రెడ్డి, హీరో నాగ వర్మ,, హీరోయిన్ ప్రియ పాల్ ఇంకా పలువురు సాంకేతిక నిపుణులు, యువత.. పాల్గొని రియోజాన్ సంస్థ నుంచి వస్తున్న ఈ యాప్ హైదరాబాద్ నుంచి 150 దేశాలకు చేరడం చాలా హ్యాపీ గా వుందని రియోజాన్ టీం అందరికీ ఆల్ ద బెస్ట్” చెప్పారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News