మెగాస్టార్ చిరంజీవి, న‌య‌న‌తార న‌టించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’.. ఫిబ్రవరి 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్

ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్‌ను సాధించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ ఇప్పుడు డిజిట‌ల్‌లో సంద‌డి చేయ‌టానికి సిద్ధ‌మైంది. ప్ర‌ముఖ ఓటీటీ మాధ్య‌మం జీ5లో ఫిబ్ర‌వ‌రి 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. చిరంజీవి, న‌య‌న‌తార జంట‌గా న‌టించిన ఈ చిత్రం ఈ సీజ‌న్‌లో విడుద‌లైన చిత్రాల‌న్నింటిలో అతి పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిల‌వ‌గా దీని డిజిట‌ల్ హ‌క్కుల‌ను జీ5 సొంతం చేసుకుంది. ఇప్ప‌టికే సంక్రాంతికి ప్ర‌క‌టించినట్లుగా జీ5లో అందుబాటులో ఉన్న అన్నీ భాష‌ల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌తో పాటు ద‌క్షిణాసియా ప్రేక్ష‌కుల‌ను కూడా మెప్పించ‌నుంది.

మ‌న శంక‌ర వ‌ర ప్రసాద్ గారు సినిమాకు అనీల్ రావిపూడి రైట‌ర్‌, డైరెక్ట‌ర్‌. మెగాస్టార్ చిరంజీవి ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌థానాయ‌కుడిగా మెప్పించారు. ఆయ‌న‌తో పాటు వెంక‌టేశ్ ద‌గ్గుబాటి, న‌య‌న‌తార‌, క్యాథ‌రిన్ ట్రెసా త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో అల‌రించారు. బ‌ల‌మైన ఎమోష‌న్స్‌, ఫ్యామిలీ డ్రామాతో పాటు మంచి యాక్ష‌న్‌ను కూడా క‌ల‌గ‌లిపి సీట్ ఎడ్జ్ డ్రామాగా ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను రూపొందించారు. ఓ నేష‌న‌ల్ సెక్యూరిటీ ఆఫీస‌ర్ (చిరంజీవి) త‌న‌కు దూర‌మైన కుటుంబాన్ని కాపాడుతూ ప్రేమ‌, బాధ్య‌త‌తో చేసే ప్ర‌యాణంగా ఈ సినిమాలో చూపించారు. చిరంజీవికున్న గొప్ప తిరుగులేని సినీ లెగ‌సీకి దేశ వ్యాప్తంగా న‌య‌న‌తార గ్లామ‌ర్ అప్పీల్ తోడు కావ‌టంతో థియేట‌ర్స్‌లో సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఈ సంద‌ర్భంగా..

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘‘మన శంకర వర ప్రసాద్ గారు’ అనేది కుటుంబంలోని బంధాలు, బాంధవ్యాలు గురించి చెప్పిన ఎంట‌ర్‌టైన‌ర్‌. ఈ సినిమాపై థియేటర్లలో ప్రేక్షకులు చూపిన ప్రేమ మాకెంతో ఆనందాన్నిచ్చింది. ఇప్పుడు ZEE5 ద్వారా ఈ సినిమా ఇంకా ఎక్కువ భాషల్లో, ఎక్కువ దేశాల్లో ఉన్న ప్రేక్షకుల దగ్గరకు చేరువ కానుండంటం మ‌రింత సంతోషంగా ఉంది. ఒక కథ సినిమాహాళ్లను దాటి, నేరుగా ప్రజల ఇళ్లలోకి చేరడం అనేది ఎప్పుడూ చాలా ప్రత్యేకమే’’ అన్నారు.

న‌య‌న‌తార మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో మంచి ఎమోష‌న్స్ ఉన్నాయి. దీనికి తోడు చ‌క్క‌టి హాస్యం, మంచి యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ క‌ల‌యిక‌లో రూపొందట‌మే ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టింది. చిరంజీవి గారితో పాటు మొత్తం టీమ్‌తో కలిసి పని చేయడం నాకు చాలా మంచి ఎక్స్‌పీరియెన్స్‌. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు ZEE5లో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాను ఇంట్లో కూర్చొని చూసి ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు.

వెంక‌టేశ్ ద‌గ్గుబాటి మాట్లాడుతూ ‘‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే, చక్కటి వినోదాన్ని..హృదయాన్ని తాకే బంధాలతో, ఎమోష‌న్స్‌తో చ‌క్క‌గా క‌ల‌గలిపి సినిమా చేశారు. చిరంజీవి గారితో తొలిసారి కలిసి పని చేయడంతో ఈ జ‌ర్నీ నాకింకా ప్రత్యేకంగా మారింది. ఇప్పుడు ఈ సినిమా ZEE5 ద్వారా అనేక భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల వరకు చేరుతుండటం చాలా సంతోషంగా ఉంది. కుటుంబం అంతా కలిసి ఈ సినిమాలోని భావోద్వేగం, హాస్యం, డ్రామాను ఆస్వాదిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది’’ అన్నారు.

డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. మంచి భావోద్వేగాలు, నవ్వులు, ఉత్కంఠభరితమైన స‌న్నివేశాలున్న సినిమా. థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్ మ‌రింత ఉత్సాహాన్నిచ్చింది. ఇప్పుడీ సినిమా OTTలో మరింత బలంగా ప్రేక్షకులను మెప్పిస్తుంద‌ని న‌మ్ముతున్నాను. ZEE5లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కావడం వల్ల ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాను ఇప్పుడు వివిధ భాష‌లు, సంస్కృతులున్న ప్రేక్ష‌కులు చూడ‌బోతున్నారు. డైరెక్ట‌ర్‌గా ఇది నాకెంతో ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది’’ అన్నారు.

ఫిబ్రవరి 11 నుంచి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బ్లాక్‌బస్టర్ మాయాజాలాన్ని మళ్లీ ఎక్స్పీరియెన్స్ చేయటానికి సిద్ధంగా ఉండండి! సినిమా ZEE5లో ప్రత్యేకంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

TFJA

Recent Posts

‘యమకింకరుడు’ ట్రైలర్‌ విడుదల చేసిన “రాక్షసుడు” నిర్మాత కె.ఎస్. రామారావు!

(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…

19 hours ago

‘మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ

హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…

20 hours ago

గ్రాండ్‌గా జరిగిన ‘MRP – నీకెంత నాకెంత’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. జూలై 17న రిలీజ్

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…

2 weeks ago

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “అదే నీవు అదే నేను” టీజర్ రిలీజ్

తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…

2 weeks ago

నా కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా ‘రక్త చరిత్ర’-రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో రామ్ గోపాల్ వర్మ

"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…

2 weeks ago

యతిరాజు పాత్రలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన శివాజీ

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…

2 weeks ago