ఘనంగా హక్కు ఇనిషేటివ్ ‘మన హక్కు హైదరాబాద్’ కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల కార్యక్రమం*

Must Read

ప్రజల, ప్రభుత్వ భాగస్వామ్యంతో సామాజిక చైతన్యాన్ని కలిగించే పలు కార్యక్రమాలు చేపడుతున్న హక్కు ఇనిషేటివ్ సంస్థ మన హక్కు హైదరాబాద్ కర్టెన్ రైజర్ ప్రచార గీతాన్ని శుక్రవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఆవిష్కరించింది. ఈ నెల 14వ తేదీ నుంచి జుబ్లీహిల్స్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో వై డిమాలిషన్స్ ఇన్ హైదరాబాద్ అనే చర్చా కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ఈ చర్చా కార్యక్రమంలో పలువురు మేధావులు, పౌరుల పాల్గొంటారు. ఈ నేపథ్యంలో మన హక్కు హైదరాబాద్ కర్టెన్ రైజర్ ప్రచార గీతాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కోటి, ఈ పాటను కంపోజ్ చేసిన సింగర్ అనుదీప్ దేవ్, దర్శకుడు యదు వంశీ, హక్కు ఇనిషేటివ్ డైరెక్టర్స్ రాహుల్ హేమ్నాని, అనూజ్ పార్థి, సంస్థ ప్రతినిధి వివేకానంద్, ప్రముఖ ఫిలిం జర్నలిస్టులు సురేష్ కొండేటి, ప్రభు, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో

జర్నలిస్ట్ సురేష్ కొండేటి మాట్లాడుతూ – మన హక్కు సాంగ్ ను లాంఛ్ చేసినందుకు కోటి గారికి థ్యాంక్స్. హైదరాబాద్ గురించి ఎంతో అవగాహన చేసుకుని ఈ పాట రాశారు. మ్యూజిక్, లిరికల్ పరంగా సాంగ్ అద్భుతంగా ఉంది. చాలా బాగా పాడారు. ఎంతోమందికి ఇన్సిపిరేషన్ కలిగించేలా పాట ఉండటం హ్యాపీగా ఉంది. అన్నారు.

జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ – హక్కు అని మాట్లాడిన ప్రతి చోటా బాధ్యత ఉంటుంది. హైదరాబాద్ నగరాన్ని శుభ్రంగా, ప్రశాంతంగా ఉంచుకునే బాధ్యత మనందరి మీదా ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమంతో ముందుకు వచ్చిన హక్కు ఇనిషేటివ్ సంస్థకు నా అభినందనలు తెలుపుతున్నా. అన్నారు.

దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ- ఎన్నో మంచి కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న హక్కు ఇనిషేటివ్ వారికి నా అభినందలు. మన వాయిస్ వినిపించేందుకు, మనకు సపోర్ట్ గా నిలిచేందుకు వారు చేస్తున్న ప్రయత్నం స్ఫూర్తికరంగా ఉంది. అన్నారు.

సింగర్, కంపోజర్ అనుదీప్ దేవ్ మాట్లాడుతూ – మన హక్కు హైదరాబాద్ కర్టెన్ రైజర్ సాంగ్ ను కంపోజ్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ఈ పాటను కేవలం రెండు రోజుల్లోనే కంపోజ్ చేశాను. అందుకు నా మ్యూజిక్ టీమ్ ఎంతో సపోర్ట్ చేసింది. వారందిరికీ థ్యాంక్స్. ఈ పాట ద్వారా మరికొంత మంది ఇన్స్ పైర్ అయితే అదే ఎంతో సంతృప్తినిస్తుంది. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూ – హక్కు ఇనిషేటివ్ గురించి ఇక్కడికి వచ్చిన వాళ్లు మాట్లాడుతుంటే తెలుసుకున్నా. సామాజిక చైతన్యాన్ని పంచే ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఈ సంస్థ చేయడం హ్యాపీగా ఉంది. ఇది మన నగరం. మన ఇంటిని ఎలా శుభ్రంగా, బాగా ఉండేలా చూసుకుంటామో అలాగే మన నగరం బాగుండేలా చూసుకోవాలి. ఆ బాధ్యత మనందరి మీదా ఉంది. మన హక్కు హైదరాబాద్ చర్చా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పౌరులు పాల్గొనాలి. ఈ స్ఫూర్తిని మనమంతా తీసుకోవాలని కోరుతున్నా. అన్నారు.

హక్కు ఇనేషేటివ్ డైరెక్టర్స్ రాహుల్ హేమ్నాజీ, అనూజ్ పార్థి, సంస్థ ప్రతినిధి వివేకానంద్, మాట్లాడుతూ – ఈ రోజు మన హక్కు హైదరాబాద్ కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల కార్యక్రమంలో పాల్గొన్న కోటి గారికి, ఇతర అతిథులకు థ్యాంక్స్. మా సంస్థ ద్వారా మాన్ సూన్ ప్రిపరెడ్నెస్, శానిటేషన్ వారియర్స్, సిటిజన్ సేఫ్టీ వంటి ఎన్నో సామాజిక చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ నెల 14న హైదరాబాద్ ఫిలినగర్ క్లబ్ లో వై డిమాలిషన్స్ ఇన్ హైదరాబాద్ టాపిక్ మీద చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ చర్చలో మీరంతా పాల్గొనాల్సిందిగా, మంచి ప్రచారం కల్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్నారు.

హక్కు ఇనిషియేటివ్ సంస్థ ప్రతినిధి వివేకానంద్ మాట్లాడుతూ మన హక్కు హైదరాబాద్ కార్యక్రమాన్ని, ప్రజలందరికీ చేరువ చేసి దీనిలో అందరూ భాగస్వాములు అవ్వాలని, ప్రచార గీతం నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా అందరికీ పంపించాలని, 9240023000 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని తెలియజేశారు. సోషల్ మీడియా ద్వారా మన హక్కు హైదరాబాద్ ని మన బాధ్యతగా ప్రజలందరికీ తీసుకువెళ్లాలని కోరారు

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News