నిర్మాత గా ఒక చరిత్ర సృష్టించిన ఎం.ఎస్. రాజు , దర్శకునిగా ‘అగధ’ చిత్రాన్ని ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ చిత్రం ‘అగధ’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14, 2026న భారీ స్థాయిలో విడుదల కానుంది. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఆ మధ్య విడుదలైన ‘అగధ’ టీజర్ ఒక సెన్సేషన్ సృష్టించింది. ప్రేక్షకులు ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూసేలా చేసింది. టీజర్ లోని విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మిస్టీరియస్ వాతావరణం, గ్రాండియర్ మేకింగ్కు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి. 14 మిలియన్ల మంది ఈ టీజర్ ని వీక్షించారంటేనే, ఎంతలా ప్రేక్షకుల్లోకి రీచ్ అయ్యిందో అర్థమవుతోంది.
‘అగధ’ గురించి దర్శకుడు ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ, ”‘అగధ’ నా డ్రీమ్ ప్రాజెక్ట్. టీజర్లో చూసింది ఈ సినిమా ప్రపంచంలో ఒక చిన్న భాగం మాత్రమే. సినిమాలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇది ప్రతి ఫ్రేమ్లోనూ ఓ విజువల్ వండర్లా అనిపించే సినిమా. అలాగే ఎమోషన్స్ కి టాప్ ప్రయారిటీ ఇచ్చాం. ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్ అద్భుతంగా పనిచేశారు. ముఖ్యంగా కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ తమ పాత్రల్లో అసాధారణ నటన కనబరిచారు. ప్రేక్షకులు థియేటర్లలో ఒక కొత్త అనుభూతిని పొందుతారు. మైథలాజికల్ అంశాలు, మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అత్యున్నత విజువల్ ఎక్స్పీరియన్స్తో ఓ ఎమోషనల్ రోలర్ కోస్ట్ రైడ్ లా రూపొందిన ‘అగధ’ చిత్రం ఆగస్ట్ 14, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది” అని తెలిపారు.
నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు మాట్లాడుతూ, ”‘అగధ’ను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించాం. టీజర్కు వచ్చిన స్పందన మా ఆనందాన్ని మరింత పెంచింది. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని విశ్వసిస్తున్నాం” అన్నారు.
నటి కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ, “మహాదేవి పాత్ర నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది” అన్నారు.
హీరో శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ, ”‘డర్టీ హరి’ తర్వాత మళ్లీ ఎం.ఎస్. రాజు గారితో పని చేయడం సంతోషంగా ఉంది. ‘అగధ’లో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. సినిమాలో ఎన్నో సర్ప్రైజ్లు ఉన్నాయి” అన్నారు.
కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయరాణి రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి రచన – దర్శకత్వం: ఎం.ఎస్. రాజు,
సమర్పణ: అజయ్ కేఆర్,
నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు,
బ్యానర్: శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్,
సంగీతం: రాకేష్ వెంకటాపురం,
సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి,
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ,
ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్,
అదనపు స్క్రీన్ప్లే: చైతన్య వేగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్.వి.ఎన్. సుబ్బరాజు.
‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ -మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్…
మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా రెయిన్బో సినిమాస్ బ్యానర్ మీద ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను తెరకెక్కించిన…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
పీఆర్ఓగా, జర్నలిస్ట్గా తెలుగు సినీ పరిశ్రమలో అందరికి సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ, మరో నిర్మాత పవన్ తరిగోపులతో…
లెజెండ్రీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా ‘దాదా - ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ సినిమా ఫస్ట్ లుక్…
కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఈ రోజు హైదరాబాద్ ఎఫ్ ఎన్ సీసీ లో చెన్నై…