పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ .. ‘ఈ మధ్య కాలంలో నేను మా ఇంట్లో కంటే హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్నాను. ఎందుకో అందరికీ తెలిసే ఉంటుంది (నవ్వుతూ). ‘ ఐ, నోబడీ’ అనే చిత్రాన్ని చాలా సూక్ష్మంగా, ఒక్క ఫ్రేమ్ మిస్ అవ్వకుండా చూడాల్సి ఉంటుంది. నోబడీ అనే వ్యక్తి.. ఓ పెద్ద వ్యక్తిగా మారకుండా ఉండేందుకు సీఎం ఇంకో పెద్ద బాంబ్ వేస్తారు. అప్పుడు మీడియా, సోషల్ మీడియా అనేది రాజీవన్ అనే పాత్ర గురించి పట్టించుకోదు. ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా నడిస్తే.. సెకండాఫ్ అంతా నెక్ట్స్ లెవెల్లో వెళ్తుంది. మంచి సినిమా తీస్తే విజయాన్ని అందిస్తారని తెలుగు ప్రేక్షకుల మీద నాకు అపరిమితమైన నమ్మకం ఉంది. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, అనుకూలంగా నేను ఎప్పుడూ సినిమాలు తీయను. నేను కేవలం ఆడియెన్స్ను ఎంటర్టైన్ చేసేందుకు మాత్రమే చిత్రాల్ని చేస్తుంటాను. ‘ ‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం. అన్నీ కూడా నేచురల్ లొకేషన్స్లో, త్రివేండ్రం సిటీ రోడ్ల మీదే చిత్రీకరించాం. ముకేష్ ఆర్ మెహతా, సి.వి.సారథి గారు నాకు అండగా నిలిచి చిత్ర నిర్మాణంలో సహకరించారు. ఇందులో కథ డబ్బు చుట్టూ తిరగదు. ఈ సమాజం ఇచ్చే బలవంతపు ఐడెంటిటీ, సోషల్ మీడియా, మీడియా ప్రభావం వంటి వాటి చుట్టూ తిరుగుతుంది. నేను ఏ కథ విన్నా కూడా ఓ ప్రేక్షకుడి గానే వింటాను. రాజమౌళి గారు, కార్తికేయ గారు నా టైంకి, డేట్స్కి తగ్గట్టుగా షూటింగ్ను ప్లాన్ చేస్తున్నారు. నాకు నటుడిగా బాగానే డబ్బులు వస్తున్నాయి. నిర్మాతగా నేను డబ్బులు సంపాదించాలని అనుకోను. మంచి చిత్రాల్ని అందించాలనే చూస్తుంటాను” అని అన్నారు.
పార్వతి తిరువోతు మాట్లాడుతూ .. ‘పృథ్వీకి సినిమాలంటే ఎంతో పిచ్చి. ఆయనకు సినిమాల పట్ల ఉండే ప్యాషన్ నాకు చాలా ఇష్టం. ఆయన ముందు నేను ఒక స్టూడెంట్లా ఉండి ఎంతో నేర్చుకుంటూ ఉంటాను. రాజీవన్, మీరా పాత్రలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. తెరపై ఎప్పుడూ ఫైటింగ్ చేస్తూనే కనిపిస్తుంటాం. పృథ్వీ, సుప్రియ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటారు. మీరాలాంటి పాత్ర నాకు దక్కడం ఆనందంగా ఉంది. పృథ్వీతో డిఫరెంట్ చిత్రాలు చేసే అవకాశం దక్కడం నా అదృష్టం. నాకు ఎప్పుడూ ఒకే రకమైన పాత్రల్ని చేయాలని అనిపించదు. తెలుగులో ఓ సరికొత్త పాత్రతో రావాలని వెయిట్ చేస్తున్నాను” అని అన్నారు.
సంగీత దర్శకుడు జేక్స్ బిజాయ్ మాట్లాడుతూ .. ‘‘ ‘ఐ, నోబడీ’ పాటల విషయంలో నిస్సాం ముందే ఓ నిర్ణయంతో ఉన్నారు. అందరికీ అర్థం అవ్వాలని, ఎక్కువగా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఇంగ్లీష్, హిందీ భాషల్లో పాటలు కంపోజ్ చేశాం’ అని అన్నారు.
మైత్రి శశి మాట్లాడుతూ .. ‘‘ ‘ఐ, నోబడీ’ చిత్రం నాకు చాలా నచ్చింది. నెక్ట్స్ సీన్ ఏంటి? అన్నది అస్సలు గెస్ చేయలేం. యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటాయి. పృథ్వీరాజ్ గారు అద్భుతంగా నటించారు. తెలుగు వారికి కూడా ఈ చిత్రం చాలా నచ్చుతుందని, పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. కొత్త రకమైన సినిమాలు ఎప్పుడు వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు’ అని అన్నారు.
నిర్మాత ముకేష్ ఆర్ మెహతా మాట్లాడుతూ .. ‘పృథ్వీరాజ్ గారు నిర్మాతల మనిషి. మాకు కూడా నాలుగు డబ్బులు రావాలనే ఆలోచిస్తుంటారు. మేం తీసే సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నా కూడా మా బంధం మాత్రం ఆయనతో కొనసాగుతూనే ఉంటుంది. మా మూవీని తెలుగు ఆడియెన్స్ కచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. థియేటర్ రిలీజ్ కోసమే ఈ సినిమాని తీశానని ఐమాక్స్ లార్జ్ స్క్రీన్లో ప్రివ్యూ వేశాను. ఇంకా ఓటీటీ రైట్స్, డిజిటల్ రైట్స్ని ఎవ్వరికీ అమ్మలేదు. థియేట్రికల్ రన్ పూర్తయ్యాకే ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుంది’ అని అన్నారు.
పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు, హకీమ్ షాజహాన్, అశోకన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం: నిస్సాం బషీర్, కథ – స్క్రీన్ప్లే – సంభాషణలు: సమీర్ అబ్దుల్, ఛాయాగ్రహణం: దినేష్ పురుషోత్తమన్ , సంగీతం: జేక్స్ బిజాయ్, నిర్మాతలు: ముకేష్ ఆర్ మెహతా, సుప్రియా మీనన్, సి.వి.సారథి.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. '90s'…
జెజె ఆర్ట్ మూవీస్, పవనసుత ప్రొడక్షన్స్, గాయత్రి సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా మహేష్ కుమార్ సంక, భగవాన్ నిర్మాతలుగా మణికంఠ…
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో…
తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి…
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal