సినీ ప్రేమికులకు ఎప్పటికప్పుడు భారీ చిత్రాలు, విజువల్ వండర్స్ చిత్రాలనే కాదు.. వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్ను కూడా అందిస్తోన్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. ఓ వైపు స్టార్ హీరోలు, దర్శకులతో సినిమాలు చేస్తూనే యంగ్ టాలెంట్ను ఎంకరేజ్ చేయటంలో ఈ సంస్థ ఎప్పుడూ ముందుటుంది. తాజాగా లైకా ప్రొడక్షన్ తమ బ్యానర్లో కొత్త సినిమాను రూపొందించనున్నట్లు అధికారిక ప్రకటననను విడుదల చేసింది. ఆ సినిమాను డైరెక్ట్ చేయబోయేదెవరో కాదు.. మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ జూడ్ ఆంథని జోసెఫ్.
రియల్ కాన్సెప్ట్తో ‘2018’ వంటి ఓ విభిన్నమైన సినిమాను తెరకెక్కించిన జూడ్ ఆంథని జోసెఫ్ అందరి దృష్టిని ఆకర్షించారు. 2018లో కేరళలో వరద బీభత్సాన్ని ఎవరూ మరచిపోలేరు. అయితే ప్రభుత్వానికి, ప్రజలు అండగా నిలవటంతో భయానక పరిస్థితుల నుంచి అందరూ బయటపడ్డారు. ఈ నిజ ఘటనను కళ్లకు కట్టినట్లు చూపించిన ఆంథని జోసెఫ్ .. మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులను మెప్పించటానికి రెడీ అయ్యారు.
ఈసారి ఆయనతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ చేతులు కలిపింది. కచ్చితంగా ప్రేక్షకులను అంచనాలను మించేలా ఓ మెస్మరైజింగ్ మూవీతో రాబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని లైకా ప్రతినిధులు తెలియజేశారు.
సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’. ఈ మూవీని…
ప్రామిసింగ్ కథానాయకుడు సుహాస్, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్ ఎంటర్టైనర్ 'హే బల్వంత్'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్…
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…
సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…