‘లవ్ యు రామ్’ రచయిత, నిర్మాత కె దశరధ్   ఇంటర్వ్యూ

Must Read

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె దశరధ్ నిర్మాతగా వ్యవహరిస్తూ కథ అందించిన చిత్రం ‘లవ్ యు రామ్’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు.  రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్, పాటలకు కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 30న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర కథా రచయిత, నిర్మాత దశరధ్ విలేకరుల సమావేశంలో ‘లవ్ యు రామ్’ విశేషాలని పంచుకున్నారు.

తొలిసారి ఈ చిత్రంలో నటించారు కదా ? నటుడిగా ఎలాంటి అనుభూతి పొందారు ?
తప్పని పరిస్థితిలో నటించాల్సి వచ్చింది (నవ్వుతూ). కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో కొంత జరుగుతుంది. ముందు మేము ఇండియాలో షూట్ చేశాం. అమెరికా వీసాలు రావడం కొంచెం కష్టంగా వుంది. మా అందరికీ బి1 బి 2 వీసాలు వున్నాయి.  ఇండియాలో ఈ పాత్ర చేస్తున్న నటుడికి వీసా రాలేదంటే ఇండియాలో  చేసిన షూటింగ్ వృధా అవుతుంది. ఆ భయంతో ఆ పాత్రని నేను చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. మొదట ట్రయిల్ షూట్ చేశాం. అందరికీ నచ్చింది. ఇప్పటివరకూ సినిమా చూసిన అందరూ అభినందించారు. నేను ఎప్పుడూ కెమెరా ముందుకు రాలేదు. విచిత్రంగా ఇది జరిగింది.

మరి నటన కొనసాగిస్తారా ?
లేదండీ. ఐతే ఒక్కటి మాత్రం నిజం.. సక్సెస్ ఐతే మాత్రం దర్శకత్వం కంటే నటన చాలా సుఖం(నవ్వుతూ).

లవ్ యు రామ్ కథ గురించి చెప్పండి ?
ఈ చిత్ర దర్శకుడు డివై చౌదరి నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం. ఓటీటీలు ఓపెన్ అయ్యాక ఓ మూడు వెబ్ సిరీస్ లు చేశాం. అందులో భాగంగా ఒక చిన్న లవ్ స్టొరీ చేద్దామని భావించాం. అప్పటికే నేను ఒక కథపై పని చేస్తున్నాను. ఈ జనరేషన్ లవ్ స్టొరీ ఎలా వుండాలి ? అని ప్రశ్నించుకున్నపుడు.. ఒకప్పుడు పిల్లల ప్రేమకు తల్లిదండ్రులు విలన్ గా వుండేవాళ్ళు. ప్రేమకు వాళ్ళు అంగీకారం తెలపకపోతేనే సమస్య. ఐతే కాలం మారిపోయింది. ఇప్పుడు ప్రేమికుల మధ్య వచ్చిన గొడవలే ప్రేమకు విలన్స్ గా మారుతున్నాయి.

ఇప్పుడు దాదాపు అన్ని ప్రేమలు సోషల్ మీడియాలో మొదలవుతున్నాయి. పోస్టులకు లైక్ కొట్టి నెంబర్లు ఇచ్చిపుచుకొని ఓ మూడు నెలలు తర్వాత కలుసుకొని ఐ లవ్ యూ చెప్పుకుంటున్నారు. కలసినప్పుడే విపరీతమైన ప్రేమ వుంటుంది. ఐతే హ్యూమన్ నేచర్ ప్రకారం ముందు మనలోని మంచే చూపిస్తాం. ఐతే ప్రయాణం మొదలైన తర్వాత మనలోని ఒక్కొక్క నెగిటివ్ లేయర్ బయటపడుతుంది. చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. ఇలాంటి సమయంలో ఆ ప్రేమకథ పరిస్థితి ఏమిటి ? ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒకరిని ఇష్టపడుతుంది. అతనే ఆ అమ్మాయికి స్ఫూర్తిని ఇచ్చాడు. అలాంటి వ్యక్తి కాలగమనంలో వేరే క్యారెక్టర్ అయిపోయాడని తెలిస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి ? అనేది ఈ జనరేషన్ కి నచ్చేలా ఈ కథ వుంటుంది. చాలా మంది జీవితాల్లో జరిగే కథ ఇది. సెకండ్ హాఫ్ బ్యూటీ ఏమిటంటే.. మూడు రోజుల్లో జరుగుతుంది. పెళ్లి నుంచి శోభనం మధ్యలో జరిగే లవ్ స్టొరీ రాశాం. ఇది చాలా కొత్తగా వుంటుంది.

కొత్తవారితో చేశారు కదా.. యూరప్ లో షూట్ చేయడానికి కారణం ?
కథ రాసుకున్నప్పుడే అనుకున్నాం. ఈ కథకు సరిపోయేవారినే తీసుకున్నాం. కథకు తగినట్లు ఖర్చు చేశాం. ఐతే అమెరికా వీసాలు ఇబ్బంది రావడంతో నార్వే వెళ్లాం. అది ప్రపంచంలోనే కాస్ట్లీ కంట్రీ అని అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. అందరం కలసి ఉండటానికి ఒక ఇల్లు తీసుకుంటే 18 గంటలకు 85 వేలు ఛార్జ్ చేశారు. పైగా విపరీతంగా వర్షాలు. ఐతే ఫైనల్ ప్రోడక్ట్ మాత్రం చాలా బావొచ్చింది.

రోహిత్, అపర్ణ నటన గురించి ?
రోహిత్, అపర్ణ లాంటి నటులు దొరకడం మా అదృష్టం. చాలా అంకింతభావంతో అద్భుతంగా నటించారు. ఈ జనరేషన్ చాలా సిన్సియర్ గా ఉంటున్నారు. ముందుకు వెళ్లాలనే కసితో పని చేస్తున్నారు. ఇది యూత్ ఫుల్ స్టొరీ. అందరికీ నచ్చుతుంది.

మ్యూజిక్ గురించి ?
వేద చాలా మంచి ఆల్బమ్ ఇచ్చాడు. తనకి చాలా అనుభవం వుంది. దాదాపు డెబ్బై సినిమాలకు నేపధ్య సంగీతం ఇచ్చాడు. ఇందులో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది.

మీరు ఎక్కువగా లవ్ అండ్  ఫ్యామిలీ  ఎంటర్ టైనర్ లు రాస్తారు కదా.. ఉస్తాద్ తో మాస్ కమర్షియల్ వైపు మారాలని అనుకుంటున్నారా ?

నేను ముందు ఇండస్ట్రీలో రైటర్ ని. యండమూరి, పరుచూరి బ్రదర్స్, తేజ గారి దగ్గర పని చేశాను. కానీ నేను డైరెక్ట్ చేసినప్పుడు వారి స్టయిలే లేదు కదా. నేను ఒకలా తీయాలని ఇష్టపడతాను. కానీ నేను రచయితగా పని చేసిన్నపుడు మాత్రం కస్టమర్ ఈజ్ ది కింగ్. వాళ్లకి ఏం కావాలో అది డెలివర్ చేయాలి.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
ఒక ప్రాజెక్ట్ పై వర్క్ జరుగుతోంది. మరో మూడు నెలల్లో అనౌన్స్ మెంట్ వస్తుంది. అలాగే ఒక వెబ్ సిరిస్ చేస్తున్నాను. దానికి హరీష్ శంకర్ షో రన్నర్ గా ఉంటారు.

ఆల్ ది బెస్ట్
థాంక్స్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News