ప్రామిసింగ్ కథానాయకుడు సుహాస్, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్ ఎంటర్టైనర్ ‘హే బల్వంత్’. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ఫుల్ ద్వయం నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ శుక్రవారం ఈనెల 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం హిలేరియస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల అభినందనలతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ బ్లాక్బస్టర్ టాక్తో దూసుకపోతుంది.ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్మీట్ను ఏర్పాటుచేసింది. ఈసందర్బంగా
వంశీ నందిపాటి మాట్లాడుతూ ” ఎక్కడ షోలు వేసినా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓవర్సీస్లో ప్రీమియర్స్కు 100కె వరకు కలెక్ట్ చేసింది. చాలా పాజిటివ్గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ఫుల్స్ అయ్యాయి. మార్నింగ్తో పోల్చితే.. మ్యాట్నీకి కలెక్షన్లు పెరిగాయి. ఎంతో ఒత్తిడిలో ఉన్న వారికి హే బల్వంత్ సినిమా మెడిసిన్ లాంటంది ఎంతో హాయిగా మనసు తేలిక అవుతుంది. అందరూ ప్యామిలీస్తో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఓ మంచి సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది. ఈ వీకెండ్లో బ్రేక్ ఈవెన్ అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు.
దర్శకుడు గోపీ మాట్లాడుతూ అందరి సపోర్ట్కు ధన్యవాదాలు. పెయిడ్ ప్రీమియర్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. అందరూ ఫెంటాస్టిక్ సినిమా అని అభినందిస్తున్నారు. అందరూ నవ్వి నవ్వి రిలాక్స్ అవుతున్నామని చెబుతున్నారు. కలెక్షన్లు కూడా పెరుగుతున్నాయి. తప్పకుండా చిత్రాన్ని ప్రేక్షకులు మరింత ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు.
నిర్మాత నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ ” రెస్పాన్స్ చాలా బాగుంది. చూసిన ప్రతి ఒక్కరూ మంచి సినిమా అంటుంటే ఆనందంగా ఉంది. మా బ్యానర్లో ఇది బ్లాక్బస్టర్ చిత్రం అన్నారు.
నటి స్రవంతి.. అందరూ హిలేరియస్గా నవ్వుకోవడమే కాకుండా ఎమోషనల్గా ఫీలవతున్నారు. అందరూ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.
నటుడు సుదర్శన్ మాట్లాడుతూ హిలేరియస్ కామెడీతో థియేటర్లు ఊగిపోతున్నాయి. సినిమా రెస్పాన్స్ చూసిన తరువాత హ్యపీగా నిద్రపోయాం. ఫ్యామిలీస్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.చూడని వారు అందరూ థియేటర్లలో సినిమా చూడాలని కోరుకుంటున్నాను అన్నారు.
హీరోయిన్ శివానీ మాట్లాడుతూ మంచి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చినందుకు హ్యపీగా ఉంది. అందరూ ఫ్యామిలీస్తో చూడండి. అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. హ్యపీగా నవ్వుకుంటున్నారు అన్నారు.
హీరో సుహాస్ మాట్లాడుతూ నాకెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్. కలెక్షన్లు చూస్తే నమ్మలేకపోతున్నాను. అందరూ నవ్వుకుంటూ సినిమా చూస్తున్నారని చెబుతున్నారు. రాను రాను కలెక్షన్లు మరింత పెరుగుతున్నాయి అన్నారు.
నరేష్ మాట్లాడుతూ ” ప్రీమియర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చూస్తే ఆనందంగా ఉంది. నా కెరీర్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా అరుదు. నవ్వులతో థియేటర్లు ఊగిపోవడం చూశాను. ఎవ్వరూ కూడా సీట్లలో కూర్చోవడం లేదు. లేచిలేచి పడి పడి నవ్వుతున్నారు. ప్రేక్షకుల ఆనందం చూస్తుంటే నా కళ్లో నీళ్లు వచ్చాయి. సేమ్ టైమ్ పతాక సన్నివేశాలు పావుగంట ఓ ఎమోషనల్ సీన్తో ఫినిష్ అవ్వగానే థియేటరల్్లో ప్రేక్షకులు స్టాండింగ్ ఓవెషన్ చేయడం నేను చూడలేదు. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్. షోకు షోకు కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఈ సక్సెస్ను ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ సినిమా బజ్కు తగ్గ రెస్పాన్స్ వస్తుంది. సినిమా చూసి ఆనందం తట్టుకోలేక దర్శకుడిని, హీరో సుహాస్ను ముద్దు పెట్టుకున్నాను. చాలా అరుదుగా వచ్చిన ఈ సినిమాను అందరూ చూడాలి. మళ్లీ నాకు ఇలాంటి సినిమా, ఇలాంటి పాత్ర రాదు. కొత్త కాన్సెప్ట్తో దర్శకుడు బ్లాక్బస్టర్ సినిమా తీశాడు’ అన్నారు.
తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న కొత్త సినిమా "ది మేజ్". ఈ…
▪️ తెలుగు, కన్నడ భాషల్లో జూన్లో విడుదలైన చిత్రం▪️ 300 థియేటర్లలో విడుదలై హిట్ టాక్ హారర్-యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకుల…
టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల అంత్యక్రియలు నేడు నిర్వహించనున్నారు. వనస్థలిపురంలోని రెడీ టూ సర్వ్ ఆశ్రమం నుండి…
వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ చిత్ర యూనిట్ ఈరోజు (మంగళవారం) ఫస్ట్ సింగిల్…
మార్వెల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అవెంజర్స్: డూమ్స్డే' సినిమా ట్రైలర్ను బిగ్ స్క్రీన్ పై చూసే అవకాశం రానుంది.…
హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల గారు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె…