గ్రాఫిక్స్ – విజువల్ ఎఫెక్ట్స్ వల్లబడ్జెట్ పెరగదు – తగ్గుతుంది!!

Must Read

“ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్”తో
అద్భుతాలు అలవోకగా ఆవిష్కరించవచ్చు!!

“గీతాంజలి-2″కి గ్రాఫిక్స్ అద్దే
అవకాశం ఇచ్చిన కోన వెంకట్ సార్’కి
ఎప్పటికీ రుణపడి ఉంటాను!!

-గ్రాఫిక్ & విజువల్ ఎఫెక్ట్స్ జీనియస్
ఉదయ్ తిరుచినాపల్లి

గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అనగానే… అవి పెద్ద సినిమాలకు మాత్రమే అనుకుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే” అంటున్నాడు గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ జీనియస్ ఉదయ్ తిరుచినాపల్లి. అంతేకాదు… గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ వల్ల చిన్న సినిమాలు మాత్రమే కాకుండా, పెద్ద సినిమాల బడ్జెట్ ను కూడా గణనీయంగా తగ్గించవచ్చని, ఇక ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్”తో అలవోకగా అద్భుతాలు ఆవిష్కరించవచ్చని ఘంటాపధంగా చెబుతున్నాడు!!

కంప్యూటర్ ఇంజినీరింగ్ లో పట్టభద్రుడైన ఉదయ్ తిరుచినాపల్లి… అమెరికా, ఆస్ట్రేలియాలో మల్టీ నేషనల్ సంస్థల్లో ఉన్నతోద్యోగాలు చేశాడు. అయితే చిన్నప్పటి నుంచి “సినిమా పిచ్చోడైన” ఉదయ్… విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూనే… “అడ్వాన్స్ విజువల్ ఎఫెక్ట్స్”లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. జాబ్ చేస్తూనే, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ కి పని చేస్తూ… తన స్కిల్స్’కి పదును పెట్టుకున్న ఉదయ్… కొన్నేళ్ల క్రితం, ఉద్యోగానికి స్వస్తి చెప్పి… సినిమాలకు గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అద్దడం ప్రధాన వ్యాపకం చేసుకున్నాడు!!

పలు ఇంగ్లీష్ సినిమాలకు ఈ విభాగాల్లో పనిచేసి, తన ఉనికిని, ప్రతిభను ఘనంగా ప్రకటించుకున్న ఉదయ్… “హౌ ఈజ్ దట్ ఫర్ ఎ మండే” (HOW IS THAT FOR A MONDAY) అనే ఆంగ్ల చిత్రానికి వి.ఎఫ్.ఎక్స్ సూపర్’వైజర్’గా పని చేశాడు. ఈ చిత్రం “ఈటివి విన్”లోనూ ప్రసారమవుతుండడం విశేషం. అలాగే విమర్శకులు, ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుని “జీ-5″లో ప్రసారమవుతున్న “8 ఎ.ఎమ్.మెట్రో”కు కూడా గ్రాఫిక్స్ అందించాడు. ఈ చిత్రాన్ని “మల్లేశం” ఫేమ్ రాజ్ రాచకొండ రూపొందించి ఉండడం విశేషం. “సాచి” చిత్రానికి కూడా విజువల్ ఎఫెక్ట్స్ సొబగులు అద్దిన ఈ యువ ప్రతిభాశాలి… సెన్సేషనల్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ “గీతాంజలి – మళ్లీ వచ్చింది” చిత్రానికి పని చేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెబుతాడు. ఈ చిత్రం ఆహా మరియు అమెజాన్ ప్రేక్షకులను అలరిస్తోంది. తన మీద ఎంతో నమ్మకం ఉంచి, తనకు అవకాశం ఇచ్చి, ప్రోత్సహించిన కోన వెంకట్ గారికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానని తెలిపాడు!!

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News