* చైతన్య రావ్, హృతికా శ్రీనివాస్ హీరో హీరోయిన్లు
చైతన్య రావ్, హృతికా శ్రీనివాస్ హీరో హీరోయిన్లుగా గౌతమ్స్ ఈగల్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి బ్యానర్పై సాయి తేజ దర్శకత్వంలో ఎం.గౌతమ్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ఆదివారం ఉదయం లాంఛనంగా హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ కొట్టగా ఎఫ్డీసీ చైర్మన్ అనీల్ కురుమాంచలం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బెక్కం వేణు గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత ఎం.గౌతమ్, సి.కళ్యాణ్ చేతుల మీదుగా డైరెక్టర్ స్క్రిప్ట్ను అందుకున్నారు. నిర్మాత రాచాల యుగంధర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అలాగే పలువురు సినీ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
చిత్ర నిర్మాత ఎం.గౌతమ్ మాట్లాడుతూ ‘‘మా గౌతమ్స్ ఈగల్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి బ్యానర్లో మేం చేస్తున్న తొలి సినిమా ఇది. చైతన్య రావ్, హృతికా శ్రీనివాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. డైరెక్టర్ సాయితేజ ఓ డిఫరెంట్ పాయింట్తో స్క్రిప్ట్ను సిద్ధం చేశారు. కొత్తగా పెళ్లైన జంటలో భర్త కొన్ని అనుకోని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాన్ని తనెలా హ్యాండిల్ చేశాడనే కథాంశంతో సినిమా రూపొందనుంది. మంచి కామెడీ, లవ్, ఎమోషన్స్తో ఫ్యామిలీ ఆడియెన్స్, యూత్ను ఆకట్టుకునే అంశాల మేళవింపుంగా సినిమా ఆకట్టుకోనుంది. సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు.
నటీనటులు:
చైతన్య రావ్, హృతికా శ్రీనివాస్, కృష్ణ చైతన్య, సాయి శ్రీనివాస్, సుదర్శన్, మహేష్ అచంట, మహేష్ విట్టా, రాజేష్ ఉల్లి, షిన్నింగ్ ఫణి తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: గౌతమ్స్ ఈగల్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి
నిర్మాత: ఎం.గౌతమ్
రైటర్, డైరెక్టర్: సాయితేజ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మోహన్ పున్న
లైన్ ప్రొడ్యూసర్: వంశీ కృష్ణ
సినిమాటోగ్రఫీ: పి.సి.మౌళి
ఎడిటర్: విజయ్ ముక్తావరపు
మ్యూజిక్: గ్యాని
ఆర్ట్: రామాంజనేయులు
ప్రొడక్షన్ కంట్రోలర్: కాస కిరణ్ కుమార్
కొరియోగ్రాఫర్: జెడి మాస్టర్
కాస్ట్యూమ్స్: ప్రదీప్తి భూమ
పి.ఆర్.ఒ: వంశీ కాకా, దుద్ది శ్రీను
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా…
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతీ శతకం' విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి…
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్,…
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…
హైదరాబాద్, ఫిబ్రవరి 5: ప్రముఖ ఓటీటీ మాధ్యమం జియో స్టార్లో ది రాజా సాబ్ సినిమాను ఫిబ్రవరి 6 నుంచి…
ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…