సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తోన్న పక్కా మాస్అండ్యాక్షన్ ఎంటర్టైనర్ గాలోడు. గెహ్నా సిప్పి హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రానికి రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. టైటిల్ అనౌన్స్ చేసినప్పటినుండే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్కి విశేష ఆదరణ లభించింది. తాజాగా గాలోడు థియేట్రికల్ ట్రైలర్ను విడుదలచేసింది చిత్ర యూనిట్..దాదాపు రెండున్నర నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్తో సినిమా ఎలా ఉండబోతుందో ముందే హింట్ ఇచ్చారు మేకర్స్.. ఫస్ట్ టైమ్ సుధీర్ మాస్లుక్లో చేసే యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఒకవైపు మాస్ లుక్లో ఆకట్టుకుంటూనే మరోవైపు స్టైలీష్ లుక్స్తో ఫ్యాన్స్ని ఖుషీ చేశారు సుధీర్. ఇక `వయసు తక్కువషోలు ఎక్కువ, నువ్వు శనివారం పుట్టావా? శనిలా తగులుకున్నావ్, రామాయణంలో ఒక్కటే మాయ లేడీ ఇక్కడ అందరు మాయ లేడీలే..
వంటి డైలాగ్స్లో ఎంటర్టైన్ చేస్తూనేవాడిది మామూలు రేంజ్ కాదు మాఫియా రేంజ్, సైనైడ్, యాసిడ్ కంటే డేంజర్రా వాడు, రాక్షసుల గురించి పుస్తకాల్లో చదివాను, విన్నాను మొట్టమొదటి సారి వీడిలో చూశాను సార్` వంటి పవర్ఫుల్ డైలాగ్స్ సినిమాపై అంచానాల్ని రెట్టింపు చేశాయి. గెహ్నాసిప్పి గ్లామర్, సప్తగిరి కామెడీ టైమింగ్ ట్రైలర్కు అదనపు ఆకర్షణలుగా నిలిచాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సి. రాంప్రసాద్ విజువల్స్, టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్ట్ లెవల్లో ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా గాలోడు సినిమా నవంబరు 18న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి, సప్తగిరి, పృథ్విరాజ్, శకలక శంకర్, సత్య క్రిష్ణ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫి: సి రాం ప్రసాద్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ప్రొడక్షన్ కంట్రోలర్: బిక్షపతి తుమ్మల
సమర్పణ: ప్రకృతి
బేనర్: సంస్కృతి ఫిలింస్,
రచన – దర్శకత్వం: రాజశేఖర్ రెడ్డి పులిచర్ల.
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా…
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతీ శతకం' విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి…
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్,…
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…
హైదరాబాద్, ఫిబ్రవరి 5: ప్రముఖ ఓటీటీ మాధ్యమం జియో స్టార్లో ది రాజా సాబ్ సినిమాను ఫిబ్రవరి 6 నుంచి…
ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…