మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ “పళ్లిచట్టంబి”. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణక్య, చైతన్య, చరణ్ నిర్మించారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే మలయాళంలో “పళ్లి చట్టంబి” సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. రేపు (ఈనెల 17న) తెలుగులో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్, అసోసియేట్ ప్రొడ్యూసర్ మేఘ శ్యామ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా
ప్రొడ్యూసర్ చైతన్య మాట్లాడుతూ – ఈ సినిమా కోసం మేము ఏడాదిన్నరగా కష్టపడ్డాం. చివరకు సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరంతా సినిమా చూశారు. మీ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. మలయాళంలో ఇప్పటికే ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. తెలుగు ఆడియెన్స్ కూడా అదే స్థాయి ఘన విజయాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
అసోసియేట్ ప్రొడ్యూసర్ మేఘ శ్యామ్ మాట్లాడుతూ– “పళ్లిచట్టంబి” సినిమాకు మన మీడియా మిత్రులు బాగా సపోర్ట్ చేశారు. మలయాళంలో ఈ మూవీ రిలీజై బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రతి ఒక్కరూ సినిమాను ఓన్ చేసుకుంటున్నారు. కారణం…ఇది తమ కథగా వాళ్లు భావిస్తున్నారు. తెలుగు ఆడియెన్స్ ముందుకు రేపు మా చిత్రాన్ని తీసుకొస్తున్నాం. బన్నీ వాస్ గారు మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. తెలుగులోనూ ఘన విజయం దక్కుతుందని ఆశిస్తున్నాం. ప్రొడ్యూసర్స్ చరణ్, చైతన్య, చాణక్య నాకు బ్రదర్స్ లాంటి వాళ్లు. వాళ్లకు సక్సెస్ రావాలి. మారుతి గారి వల్లే నేను మూవీస్ లోకి వచ్చాను. తెలుగులోనూ మంచి మూవీస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.
ప్రొడ్యూసర్ చరణ్ మాట్లాడుతూ – ఏడాదిన్నరగా “పళ్లిచట్టంబి” సినిమా కోసం కష్టపడ్డాం. 2వేల మంది ఈ మూవీ కోసం 130 రోజులు వర్క్ చేశారు. హీరో టొవినో థామస్, డైరెక్టర్ డిజో జోస్ చాలా సపోర్ట్ చేశారు. అనేక రకాల భావోద్వేగాలు మాలో కలుగుతున్నాయి. సినిమా ఎలా ఉంటుందో మేము చెబుతూ వచ్చాం. ఈ రోజు సినిమా మీరంతా చూశారు. మలయాళంలో మాసివ్ హిట్ అయ్యింది. తెలుగు ఆడియెన్స్ కూడా మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
ప్రొడ్యూసర్ చాణక్య మాట్లాడుతూ – మాకున్న ఈ చిన్న ఎక్సిపీరియన్స్ లో ఇలాంటి భారీ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉంది. మలయాళంలో పళ్లిచట్టంబి రిలీజై మంచి విజయం సాధించింది. ఫ్యామిలీ ఆడియెన్స్ పిల్లలతో కలిసి మూవీ చూస్తున్నారు. ఈ జర్నీలో నాకు నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేశారు. రేపు తెలుగులో మూవీ రిలీజ్ కు వస్తోంది. ఇక్కడ కూడా బిగ్ హిట్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్స్ గా మరిన్ని మంచి మూవీస్ చేయాలని భావిస్తున్నాం. అన్నారు.
నటీనటులు – టొవినో థామస్, కయదు లోహర్, విజయరాఘవన్, సుధీర్ కరమన, బాబురాజ్, వినోద్ కేదమంగళం, ప్రశాంత్ అలెక్జాండర్, తదితరులు
కాస్ట్యూమ్స్ – మంజూష రాధకృష్ణన్
మేకప్ – రషీద్ అహ్మద్
ప్రొడక్షన్ డిజైన్ – దిలీప్ నాథ్
ఎడిటింగ్ – శ్రీజిత్ సరంగ్
సినిమాటోగ్రఫీ – టిజో టోమీ
మ్యూజిక్ – జేక్స్ బిజోయ్
స్క్రిప్ట్ – ఎస్ సురేష్ బాబు
అసోసియేట్ ప్రొడ్యూసర్స్ – మేఘశ్యామ్, తంజీర్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – నౌఫల్, బ్రిజీష్, చాణక్య, చైతన్య, చరణ్
డైరెక్టర్ – డిజో జోస్ ఆంటోనీ
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…