‘పొట్టేల్’లో చేసిన పటేల్ క్యారెక్టర్ టెర్రిఫిక్ గా వచ్చింది యాక్టర్ అజయ్  

Must Read

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. ఈ చిత్రంలో అజయ్ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి. శేఖర్ చంద్ర అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ‘పొట్టేల్’ అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా యాక్టర్ అజయ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. 

‘పొట్టేల్’ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? 

సాహిత్ కథ చెప్పాడు. మొదట నేను చాలా క్యాజువల్ గా విన్నాను. ఒక రెండు గంటల నేరేషన్ తర్వాత ఈ సినిమాలో క్యారెక్టర్ డెఫినెట్ గా చేయాలనిపించింది. నా క్యారెక్టర్ ని చాలా బాగా చేయాలి, లేకపోతే సినిమా పాడైపోతుందనే ఫీలింగ్ ని డైరెక్టర్ కలిగించగలిగారు. కథని ఎంత అద్భుతంగా చెప్పాడో సినిమాని కూడా అంత అద్భుతంగా తెరకెక్కించాడు. 

-ఇది మల్టీ లేయర్ కథ. పాప ఎడ్యుకేషన్ కోసం ఫైట్ చేసే బ్యాక్ డ్రాప్. ఇలాంటి కథలు చెప్పినప్పుడు కొన్నిసార్లు సందేశం ఎక్కువైపోయే అవకాశం వుంది. దీన్ని కమర్షియల్ గా తీసుకురావడం చాలా కష్టం. డైరెక్టర్ సాహిత్ ఈ కథని మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో చాలా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దాడు. ఇందులో విజిల్స్ పడే సీన్స్ ఉంటాయి. 

ఇందులో మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేసిన ఎలిమెంట్ ఏంటి? 

– కథ చాలా నచ్చింది. అదే నన్ను ఈ సినిమా చేయడానికి ఎక్సైట్ చేసింది. తర్వాత నా క్యారెక్టర్ నచ్చింది. నాదే కాదు యువ, అనన్య వీళ్ళ క్యారెక్టర్స్ అన్నీ చాలా అద్భుతంగా కుదిరాయి. 

– స్లాంగ్ విషయంలో సాహిత్ చాలా హోంవర్క్ చేసుకున్నాడు. తన నేటివ్ నిర్మల్. డైలాగ్ రాయడమే స్లాంగ్ లో రాశాడు. అయితే డబ్బింగ్ చెప్పినప్పుడు కొంచెం హార్డ్ అనిపించింది. నా క్యారెక్టర్ కి కొన్ని చాంట్స్ ఉంటాయి. అవి చెప్పడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది.

విక్రమార్కుడిలో టిట్ల క్యారెక్టర్ తర్వాత పటేల్ క్యారెక్టర్ నచ్చిందని చెప్పడానికి కారణం ?  

-విక్రమార్కుడు తర్వాత అంతా టెర్రిఫిక్ విలన్ వేషాలు తక్కువే వచ్చి ఉంటాయి. అవి కూడా చాలా వరకు రాజమౌళి గారి సినిమాలోనే ఉన్నాయి. టిట్ల లాంటి క్యారెక్టర్స్ రెగ్యులర్ గా రావు. అదొక మ్యాజిక్ లాగా జరిగిపోయింది. తర్వాత నేను కొన్ని క్యారెక్టర్స్ ట్రై చేసాను. కానీ ఆ మ్యాజిక్ కుదరలేదు. ఈ సినిమాలో చేస్తున్న పటేల్ క్యారెక్టర్ లో చాలా షేడ్స్ వున్నాయి. అందుకే చాలా రోజుల తర్వాత నాకు నచ్చిన రోల్ దొరికిందని చెప్పాను. యాక్టర్ గా హ్యాపీనెస్ ఇచ్చిన రోల్ ఇది. 

పటేల్ క్యారెక్టర్ కోసం ఎలాంటి హోంవర్క్ చేశారు? 

-ప్రతి సినిమా యాక్టర్ కి ఒక డిస్కవరీ లానే ఉంటుంది. ఈ సినిమాలో నా వరకు కష్టపడింది కల్చర్ ని ప్రజెంట్ చేయడం కోసం. తెలంగాణలో సిగం అని ఉంటుంది. సిగం అంటే దేవుడు రావడం అంటారు. దానికి ఒక పాటర్న్ ఉంటుంది. అది వచ్చినప్పుడు మాట్లాడే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. దానిమీద నేను డైరెక్టర్ కూర్చొని కొంత హోమ్ వర్క్ చేశాం. కొంతమందిని కలిశాం. చాలా ఎఫర్ట్ పెట్టాం. 

మ్యూజిక్ గురించి ? 

శేఖర్ చంద్ర ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చాడు. ఆర్ఆర్ సినిమాలో హైలెట్ గా వుంటుంది. ఒక పెద్ద కాన్వాస్ వున్న సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది. సినిమా చూశాను కాబట్టే ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాను. 

 ఈ సినిమాలో మూఢనమ్మకాల గురించి ఉంటుందా? 

-మూఢనమ్మకాలు, మూఢనమ్మకల్ని అడ్డం పెట్టుకుని బతికే మనుషుల గురించి,  మొండితనం గురించి, గ్రామదేవతల గురించి.. ఇలా మల్టీ లేయర్స్ లో ఈ  సినిమా  వుంటుంది.

ఈ సినిమాకి ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? 

 -కొరటాల శివ గారికి నా వెల్ విషర్ గా ఈ సినిమా చూపించాను. దేవర పనుల్లో బిజీగా ఉండి కూడా ఆయన వచ్చి ఈ సినిమా చూశారు. ఆయనకి చాలా నచ్చింది.  సందీప్ రెడ్డి వంగా గారు చూశారు. ఆయనకీ నచ్చింది. కమర్షియల్ సక్సెస్ తో పాటు అవార్డ్స్ కూడా ఈ సినిమాకు వస్తాయని డైరెక్టర్ తో ఆయన చెప్పారు. 

 యాక్టర్ గా 25 ఇయర్స్  మీ జర్నీని డిఫైన్ చేయాలంటే ? 

-25 ఇయర్స్ కెరీర్ నాట్ ఏ జోక్. 25 ఏళ్లుగా యాక్టర్ గా ఇక్కడ ఉన్నాం. అదే పెద్ద గిఫ్ట్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 250 సినిమాలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ తగ్గిపోతున్నాయి. అందరూ సెలెక్టివ్ అయిపోతున్నారు. ఆ రకంగా చూసుకుంటే అదృష్టంగా భావిస్తున్నాను. 

-2024లో దేవర, మత్తువదలరా లాంటి రెండు పెద్ద హిట్లు వచ్చాయి.  నా క్యారెక్టర్ లో కొన్ని మీమ్స్ వైరల్ కూడా అయ్యాయి. అవి నా ఫ్రెండ్స్ సెండ్ చేసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది.  

యాక్టర్ గా ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని వుంది ?,

-నాకు ఎమోషనల్ రోల్స్ చేయడం బాగా ఇష్టం. నేను ఎమోషన్స్ ని బలంగా చేయగలనని నా పర్శనల్ ఫీలింగ్.  

కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి? 

అజయ్ దేవగన్ గారితో సింగం చేశాను. పుష్ప 2  ఉంది. అలాగే ఓ రీమేక్ మూవీ జరుగుతోంది. అలాగే తమిళ్, మలయాళం ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. 

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News