‘రాజుబాబు స్మృతి ఎప్పటికీ ఉంటుంది’ దర్శకుడు బి .గోపాల్

సినిమా , టీవీ రంగాళ్లలో ప్రసిద్ధుడైన నటుడు బొడ్డు రాజబాబు స్మృతి ఎప్పటికీ ఉంటుందని , ఆయన జయంతి సందర్భంగా స్నేహితులు నిర్వహించిన స్మారక అవార్డుల కార్యక్రమమే ఇందుకు నిదర్శనమని దర్శకుడు బి .గోపాల్ చెప్పారు.


నటుడు రాజబాబు 67వ జయంతి స్మారక అవార్డుల కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో గురువారం లో జరిగింది . ఇందులో ముఖ్య అతిధిగా గోపాల్ పాల్గొన్నారు . ఏ వ్యక్తినైనా చనిపోయిన తరువాత గుర్తు పెట్టుకొని స్నేహితులు కార్యక్రమం నిర్వహించడం అపూర్వమైన విషయమని , రాజబాబు స్నేహితులు కె .వి .బ్రహ్మం , నర్రా వెంకటరావు ను ఈ సందర్భంగా అభినందిస్తున్నాని గోపాల్ తెలిపారు .


నిర్మాతల మండలి అధ్యక్షులు , ఫిలిం ఛాంబర్ కార్యదర్శి కానూరి దామోదర ప్రసాద్ మాట్లాడుతూ – గత మూడు సంవత్సరాలుగా రాజబాబు జయంతి ఉత్సవాలకు హాజరవుతున్నాని , ఇది ఎందరికో స్పూర్హిగా నిలవాలని తాను కోరుకుంటున్నాని న, సినిమా , టీవీ , నాటక రంగాల్లో ప్రతిభావంతులను ఎంపిక చేసి వారికి రాజబాబు స్మారక అవార్డులు ఇవ్వడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు .


నటుడు , గాయకుడు , కవి గుమ్మడి గోపాల కృష్ణ మాట్లాడుతూ – రాజబాబు తో తనకు ఎంతో అనుబంధం ఉందని , ఆయన మంచి నటుడే కాదు స్నేహశీలి అని చెప్పారు . తన పేరుతో ఏర్పాటైన ట్రస్టు ద్వారా ఇచ్చే అవార్డుల్లో వచ్చే సంవత్సరం నుంచి రాజబాబు పేరుతో ఒక అవార్డును ప్రదానం చేస్తామని చెప్పారు .


దర్శకుడు ఉప్పలపాటి నారాయణ రావు మాట్లాడుతూ – సినిమా రంగానికి తానె పరిచయం చేశానని , రాజబాబు జయంతి రోజు ఇలా ప్రతిభావంతులను సత్కరించడం ఎంతో తృప్తిగా ఉందని చెప్పారు .


నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ .- ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చంద్ర బాబు నాయుడు అధికారంలోకి వచ్చారని , త్వరలో నంది అవార్డుల ప్రదానం ఉంటుందని , టీవీ అవార్డుల్లో రాజబాబు స్మారక అవార్డును కూడా ప్రవేశ పెట్టడానికి తాను ప్రయత్నం చేస్తానని చెప్పారు .


రాజబాబు స్మారక అవార్డుల కమిటీ చైర్మన్ కె .వి .బ్రహ్మం మాట్లాడుతూ – రాజబాబుది విలక్షణమైన వ్యక్తిత్వం , అందరినీ ఆత్మీయంగా ప్రేమించే గొప్ప మనిషి, అలాంటి స్నేహితుణ్ని కోల్పోవడం మా అందరికీ బాధ కలిగిస్తుందని , ఆయన ఎప్పటికీ గుర్తుండేలా ఈ అవార్డులకు ప్రదానం చేస్తున్నామని , ఇది ప్రతి సంవత్సరం కొనసాగుతుందని, ఈ అవార్డుల ఎంపికలో సీనియర్ జర్నలిస్ట్ భగీరథ సహకరించారని చెప్పారు .


ఈ కార్యక్రమంలో నిర్మాత సి .వి రెడ్డి , దర్శకుడు పి .సాంబశివరావు , నటి అన్నపూర్ణమ్మ , గుమ్మడి గోపాకృష్ణ , పి వి .ఎన్ .కృష్ణ, పత్తి ఓబులయ్య , డాక్టర్ రఘునాథ బాబు , ప్రవీణ్ చంద్ర , గోపి కసిరెడ్డి , వాసు ఇంటూరి , కొర్రపాటి వెంకటేశ్వర రావు , సద్దుల మధుసూదన్ లను రాజబాబు స్మారక అవార్డులతో సత్కరించారు .
మల్లికార్జున్ కార్యక్రమాన్ని నిర్వహించారు .

Tfja Team

Recent Posts

హేబల్‌వంత్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో థియేటర్లు ఊగిపోతున్నాయి: సక్సెస్‌మీట్‌లో చిత్ర యూనిట్‌

ప్రామిసింగ్‌ కథానాయకుడు సుహాస్‌, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'హే బల్‌వంత్‌'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌…

15 hours ago

‘హే బల్‌వంత్’తో కచ్చితంగా హిట్టు కొట్టబోతోన్నాం.. రిలీజ్ ప్రెస్ మీట్‌లో డిస్ట్రిబ్యూటర్, నిర్మాత వంశీ నందిపాటి

‘లిటిల్‌హార్ట్స్‌’, ‘రాజు వెడ్స్‌ రాంబాయి’, ‘ఈషా’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా…

2 days ago

“ప్రభాస్ నిమ్మలతో కలిసి”మిరాకిల్” చేద్దాం రండి” అంటున్నహీరోయిన్ హెబ్బా పటేల్!!

సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఎగ్గిడి - శ్రీకాంత్ మొగదాసు - చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న…

2 days ago

ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించేలా ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ట్రైలర్.. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్‌ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

2 days ago

ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించేలా ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ట్రైలర్.. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’,…

2 days ago

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన హీరో సత్యదేవ్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నూతన చిత్రం

హీరో సత్యదేవ్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సత్యదేవ్ నటిస్తున్న 15వ చిత్రమిది. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజినరీ…

3 days ago