డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా ‘నిన్నే పెళ్లాడతా’ టీజర్ విడుదల

Must Read

అమన్ (రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు), సిద్ధికా శర్మ హీరోహీరోయిన్లుగా అంబికా ఆర్ట్స్, ఈశ్వరీ ఆర్ట్స్ పతాకాలపై వైకుంఠ్ బోను దర్శకత్వంలో రమ్య రాజశేఖర్, శ్రీధర్ బాబు నిర్మించిన చిత్రం ‘నిన్నేపెళ్లాడతా’. అక్టోబర్ సెకండ్ వీక్‌లో విడుదల కానున్న ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా చిత్రయూనిట్ తాజాగా విడుదల చేసింది.

టీజర్ విడుదల అనంతరం డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. ‘‘ నిన్నేపెళ్లాడతా.. ఆల్రెడీ అందరికీ తెలిసిన టైటిల్ ఇది. ఈ టైటిల్‌తో కొత్త కథతో వస్తున్న టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి టీమ్ అందరికీ మంచి గుర్తింపును తీసుకురావాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.

చిత్ర నిర్మాత శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ‘‘మా చిత్ర టీజర్‌ని విడుదల చేసిన దర్శకులు శ్రీకాంత్ అడ్డాల గారికి మా టీమ్ తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాము..’’ అని అన్నారు.

చిత్ర దర్శకుడు వైకుంఠ్ బోను మాట్లాడుతూ.. ‘‘ నిన్నేపెళ్లాడతా.. టీజర్‌ను విడుదల చేసి.. మా టీమ్‌ని ఆశీర్వదించిన శ్రీకాంత్ అడ్డాల గారికి ధన్యవాదాలు. చిత్రాన్ని అక్టోబర్ సెకండ్ వీక్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల గారు టీజర్ విడుదల చేశారు. నెక్ట్స్ వీక్ మరో గెస్ట్‌తో రొమాంటిక్ సాంగ్‌ని విడుదల చేయనున్నాం. విడుదలలోపు మ్యాగ్జిమమ్ ప్రమోషన్స్ ప్లాన్ చేశాం.
మరో నిర్మాత రమ్య రాజశేఖర్ మాట్లాడుతూ”స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గారి సోదరుడు అమన్ ఇందులో హీరోగా చేశారు. సిద్ధికా శర్మ హీరోయిన్. సాయికుమార్‌గారు, ఇంద్రజగారు, అన్నపూర్ణమ్మగారు.. ఇలా సీనియర్ నటీనటులెందరో ఈ చిత్రంలో నటించారు. సినిమా అంతా చాలా బాగా వచ్చింది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాము. సహకరించిన అందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు.

అమన్ , సిద్ధికా శర్మ, సాయికుమార్, ఇంద్రజ, సీత, సిజ్జు, అన్నపూర్ణమ్మ, విద్యుల్లేఖ రామన్, మధునందన్, సాయికిరణ్, గగన్ విహారి తదితరులు నటించిన ఈ చిత్రానికి

బ్యానర్స్: అంబికా ఆర్ట్స్, ఈశ్వరీ ఆర్ట్స్
సంగీతం: నవనీత్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ ఈదర,సురేష్ గొంట్ల
ఫైట్స్: రామకృష్ణ
లిరిక్స్: భాస్కరభట్ల, చైతన్య ప్రసాద్, రాంబాబు గిడాల, రామ్ పైడిశెట్టి
కో ప్రొడ్యూసర్:సాయికిరణ్ కొనేరి
పీఆర్వో: బి. వీరబాబు
నిర్మాతలు:రమ్య రాజశేఖర్, వెలుగోడు శ్రీధర్ బాబు
రచన-దర్శకత్వం: వైకుంఠ్ బోను

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News