క్రైమ్-థ్రిల్లర్ ఆర్యన్  ఫస్ట్ లుక్ విడుదల

Must Read

హీరో విష్ణు విశాల్ కథానాయకుడిగా, ప్రవీణ్ కె దర్శకత్వంలో, దర్శకుడు సెల్వరాఘవన్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్యన్ (A.A.R.Y.A.N ). శ్రద్ధా శ్రీనాథ్‌, వాణీ భోజన్‌ కథానాయికలు. విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మిస్తుండగా, శుభ్ర, ఆర్యన్ రమేష్ సమర్పిస్తున్నారు. రేసీ మూమెంట్స్, ట్విస్ట్‌లు, టర్న్‌లతో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రం గ్రాండ్ గా ప్రారంభమైయింది,.

విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రని పోషిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో విష్ణు విశాల్ ఖాకీ యూనిఫాంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సీరియస్ లుక్ తో చిన్న గడ్డం, మీసాలతో కనిపించాడు. 

ఈ చిత్రంలో సాయి రోనక్, తారక్ పొన్నప్ప, అభిషేక్ జోసెఫ్ జార్జ్, మాలా పార్వతి, ఇతర ప్రముఖ నటీనటులు కూడా ఉన్నారు. విష్ణు సుభాష్ కెమెరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీత దర్శకుడు.

 ఆర్యన్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ , హిందీ భాషల్లో పాన్ ఇండియా విడుదల అవుతుంది.

నటీనటులు: విష్ణు విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, వాణీ భోజన్, సాయి రోనక్, తారక్ పొన్నప్ప, అభిషేక్ జోసెఫ్ జార్జ్, మాలా పార్వతి, తదితరులు.

సాంకేతిక విభాగం :

నిర్మాత : విష్ణు విశాల్ (విష్ణు విశాల్ స్టూడియోస్) 

రచన, దర్శకత్వం : ప్రవీణ్ కె

డీవోపీ – విష్ణు సుభాష్

సంగీతం – సామ్ సిఎస్

ఎడిటర్ – శాన్ లోకేష్

స్టంట్ – స్టంట్ సిల్వా

సహ రచయిత – మను ఆనంద్

ఆర్ట్ డైరెక్టర్ – ఇందులాల్ కవీద్

కాస్ట్యూమ్ డిజైనర్,  స్టైలిస్ట్ – వినోద్ సుందర్

సౌండ్ ఎడిటింగ్ – సింక్ సినిమా

వీఎఫ్ ఎక్స్- హరిహరసుతన్, ప్రథూల్ ఎన్ టి

సూపర్వైజింగ్  ప్రొడ్యూసర్ – ఎకెవి దురై

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సీతారాం

క్రియేటివ్ ప్రొడ్యూసర్ – శ్రవంతి సాయినాథ్

ప్రొడక్షన్ కంట్రోలర్ – ఏఆర్ చంద్రమోహన్

పీఆర్వో – వంశీ శేఖర్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News