`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` జాతి రత్నాలు లాంటి వినోదం పంచుతుంది : అనుదీప్ కెవి ఇంటర్వ్యూ

Must Read


ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా, శ్రీ‌జ ఎంట‌ర్‌ టైన్‌మెంట్ బేన‌ర్‌ లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`. ‘జాతి రత్నాలు’తో బ్లాక్‌ బస్టర్‌ ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో అనుదీప్ విలేఖరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

మీరు నవ్వరు కానీ జనాల్ని నవ్విస్తారు.. ఆ రహస్యం ఏమిటో ముందు చెప్పండి ?

నేనూ నవ్వుతాను. అయితే నవ్వినపుడు కెమరాలు వుండవు. (సరదాగా)

`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` ఆలోచన ఎలా మొదలైయింది ?

ఒక చిన్న టౌన్, థియేటర్, సినిమా టికెట్ల కోసం చేసే ప్రయత్నాలు ఇలాంటి నేపధ్యంలో ఎప్పటినుండో సినిమా చేయాలని వుండేది. ప్రేక్షకుకుల కూడా ఒక కొత్త జోనర్ చూసినట్లు వుంటుంది. విడుదలకు ముందు తర్వాత మంచి క్రేజ్ వున్న సినిమాలని ఎక్స్ ఫ్లోర్ చేసి.. ‘ఖుషి’ సినిమా నేపధ్యాన్ని తీసుకుని ఈ కథని చెబుతున్నాం.

ఈ కథ మీ జీవితానికి దగ్గర వుంటుందా ?

చాలా దగ్గరగా వుంటుంది. టికెట్స్, ఫ్యాన్స్ సంబరాలు ఇవన్నీ దగ్గరుండి చూసినవే.

`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` చూసిన  అనుభవాలు ఉన్నాయా ?

`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` చూడకపోతే నాకు సినిమా చూసినట్లే వుండదు. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` చూడాల్సిందే. చిన్న టౌన్ లో అదొక గొప్ప ఫీలింగ్. ‘పోకిరి’ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి చాలా కష్టపడ్డాను. నాకు పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం. అలాగే వెంకటేష్ గారంటే కూడా ఇష్టం.

జాతి రత్నాలు తర్వాత ఇంకా పెద్ద సినిమా ఆలోచన చేయాలి కదా.. మరి కొత్తవారితో ఈ సినిమా చేయడం వెనుక లెక్క ఏమిటి ?

 నేను పెద్దగా లెక్కలు వేసుకొను. సినిమా చేసినప్పుడు మజా రావాలి. అంతే. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` చేసినప్పుడు చాలా మజా వచ్చింది.

శ్రీకాంత్ ని ఎలా ఎంపిక చేశారు ? శ్రీకాంత్ మీకు స్నేహితుడని చెప్పారు.

శ్రీకాంత్ నా స్నేహితుడే. అయితే ఆడిషన్స్ చేసి నిర్మాతలకు నచ్చిన తర్వాతే తీసుకున్నాం. శ్రీకాంత్ లో మంచి హ్యుమర్ వుంటుంది. అతనిలో మంచి ఇంప్రవైజేషన్ వుంటుంది.

`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`తో మరో జాతిరత్నాలని ప్రేక్షకులు అంచనాలు పెట్టుకోవచ్చా ?

తప్పకుండా. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`లో కూడా హిలేరియస్ హ్యుమర్ వుంటుంది. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు పెట్టుకుంటారో ఆ అంచనాలకు తగ్గట్టే వుంటుంది. కొత్తవాళ్ళు అంతా చక్కగా చేశారు. వెన్నెల కిశోర్, తనికెళ్ళ భరణి లాంటి అనుభవజ్ఞులు కూడా వున్నారు.

పబ్లిక్ ఫెమిలియర్ కాస్ట్ వుంటే ఇంకా హిలేరియస్ గా వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా ?

ఈ కథలో పబ్లిక్ ఫెమిలియర్ కాస్ట్ తో ఒక సమస్య వుంది. అందరికీ తెలిసన నటుడు ఉన్నారనుకోండి. అతడికి సినిమా టికెట్ దొరకదని చూపించడం అంత సహజంగా వుండదు. అదే కొత్త నటుడు అయితే ఇది మరింత ఆర్గానిక్ గా వుంటుంది.

శివకార్తికేయన్ సినిమాతో బిజీగా వుండటం వలన ఈ సినిమాకి దర్శకత్వం చేయలేదా ? మరే ఇతర కారణాలు ఉన్నాయా ?

మొదట నేనే దర్శకత్వం చేయాలని అనుకున్నా. అయితే నాకు కొంత లైనప్ వుంది. నా సహాయ దర్శకులకు కథ బాగా నచ్చడంతో వారికి ఇవ్వడం జరిగింది. వంశీ మరో దర్శకుడు వుంటే బావుందని అన్నారు. అలా లక్ష్మీ నారాయణ మరో దర్శకుడిగా వచ్చారు. నేను షూటింగ్ లో లేను కానీ స్క్రిప్ట్, ఎడిటింగ్, నేపధ్య సంగీతం ఇలా చాలా అంశాలలో నా ఇన్వాల్మెంట్ వుంది. ఈ సినిమా ఫలితం విషయంలో నా భాద్యత వుంటుంది.

సినిమా టికెట్ గురించి ప్రయత్నించడం చిన్న లైన్ కదా.. దిన్ని రెండు గంటల సినిమాగా మార్చడం ఒక సవాల్ కదా ?

నిజమే. రెండు రోజుల్లో జరిగిపోయే కథ ఇది. చిన్న పాయింట్. దాన్ని రెండు గంటల కథ చేయడం సవాల్ తో కూడుకున్నదే. ఈ ఆలోచన ఎప్పటి నుండో వుంది. చాలా కాలం పాటు చర్చలు జరిగి ఒక సంపూర్ణమైన సినిమా కథగా మలిచాం. కథ ఎప్పటినుండో వున్నా .. డైలాగ్స్ మాత్రం జాతిరత్నాలు తర్వాత రాశాను.

ఖుషి `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`  చూశారా ?

`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` టికెట్లు దొరకలేదు. నారాయణ్ ఖేడ్ లో మాట్నీ షో చూశా. నేను పుట్టి పెరిగిన ప్రాంతాలు, చుసిన ప్రదేశాలు గురించి సులువుగా రాయగలుగుతానని భావిస్తాను. ఈ సినిమాలో చిత్రీకరించిన  థియేటర్ హైదరాబాద్ లోని మణికంఠ. 

కామెడీ విషయంలో మీ స్ఫూర్తి ?

ఛార్లీ చాప్లీన్ ప్రభావం నాపై ఎక్కువుంది. అలాగే రాజ్ కపూర్. అమాయకత్వం నుండి పుట్టే కామెడీ నాకు చాలా ఇష్టం. అమాయకత్వం అందరికీ కనెక్ట్ అవుతుంది. హారర్, వైలెన్స్ తప్పా .. మిగతా అన్నీ జోనర్స్ ఇష్టం. మంచి డ్రామా వున్న కథలు కూడా రాయాలని వుంది.

అల్లు అరవింద్ గారు, వెన్నెల కిషోర్ లతో చేసిన ఫన్నీ ప్రమోషన్స్ ఆలోచన మీదేనా ?

అవును. అయితే అల్లు అరవింద్ గారి ఇంటర్వ్యూ అంత ఫన్నీ గా వస్తుందని అనుకోలేదు. ఆయన పెద్ద మనసుతో చాలా గొప్పగా సహకరించారు. ప్రమోషన్స్ విషయంలో వంశీ, శ్రీజగారి ఆలోచనలు కూడా వుంటాయి.

వంశీ, లక్ష్మీ నారాయణల గురించి చెప్పండి ?

హ్యుమర్ విషయంలో వంశీ, నాకు సిమిలర్ ఆలోచనలు వుంటాయి. సినిమా అంటే క్రేజీ వుండాలని ఆలోచిస్తుంటాడు. లక్ష్మీ నాకు ఎప్పటినుండో స్నేహితుడు. మంచి రీడర్. చాలా పుస్తకాలు చదువుతాడు. కొన్ని సీరియస్ కథలు రాసుకున్నాడు. ఈ కథ విని నచ్చితే చేయమని అడిగాను. అతనికి నచ్చి చేయడం జరిగింది. ఇద్దరిలోనూ మంచి హ్యుమర్ వుంది.

జాతి రత్నాలు తర్వాత జీవితం ఎలా వుంది ?

మొదటి సినిమా సరిగ్గా ఆడలేదు కాబట్టి కొంచెం అలానే చూశారు. జాతిరత్నాలు హిట్ కాబట్టి హిట్ డైరెక్టర్ గా చూశారు.  అయితే జాతిరత్నాలు తర్వాత జీవితంలో అన్నీ చూసిన ఫీలింగ్.

నాగ్ అశ్విన్ తో కథలు గురించి మాట్లాడుతుంటారా ?

లేదండీ. ఆయన చాలా బిజీ. కలిసినప్పుడు కథలు గురించి మాట్లడుకోము. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` చూశారు. ఆయనకి చాలా నచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి కూడా సినిమా చూపించాలని భావిస్తున్నాం.

శివకార్తికేయన్ గారితో చేస్తున్న ప్రిన్స్ గురించి ?

పాండిచ్చేరి నేపధ్యంలో సాగే కథ అది. షూటింగ్ దాదాపు పూర్తయింది. దీపావళి రిలీజ్ వుంటుంది. అది అవుట్ అండ్ అవుట్ లవ్ స్టొరీ. హ్యుమర్ కూడా వుంటుంది.

జాతి రత్నాలు 2 ఎప్పుడు ?

కొన్ని ఐడియాలు వున్నాయి. రెండు మూడేళ్ళ తర్వాత చేయాలి.

కొత్త ప్రాజెక్ట్స్ ?

వెంకటేష్ గారికి కథ చెప్పాలి. ఇంకొన్ని ఆలోచనలు కూడా వున్నాయి.

ఆల్ ది బెస్ట్

థాంక్స్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News