‘ఉత్సవం’ కు హార్ట్ ఫుల్ సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ

Must Read

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన హార్ట్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘ఉత్సవం’. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రకాష్ రాజ్ , నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 13 ప్రేక్షుకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరినీ అలరించి హార్ట్ ఫుల్ బ్లాక్ బస్టర్ సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనిట్ సురభి నాటక రంగం కళాకారులను సత్కరించారు.

సక్సెస్ మీట్ లో హీరో దిలీప్ ప్రకాష్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ముందుగా మీడియాకి థాంక్ యూ. మీడియా చాలా సపోర్ట్ చేసింది. వారి సపోర్ట్ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సినిమాకి చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. మొన్న కావలి, సూలూరు పేట సెంటర్స్ లో సినిమా హౌస్ ఫుల్ అయ్యింది. అన్ని చోట్ల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. రేపటి నుంచి సక్సెస్ టూర్ చేస్తున్నాం. మంచి సినిమా ఇది. తప్పకుండా మీ అందరి సపోర్ట్ కావాలి’ అన్నారు.

యాక్టర్ అలీ మాట్లాడుతూ.. నాటక రంగం నుంచి వచ్చిన నటులు ఎంతోమంది పరిశ్రమలో ఎదిగారు. సురభి నాటక రంగం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాటకం చాలా గొప్పది. ఈ పాయింట్ ని తీసుకొని ఉత్సవం చేయడం చాలా ఆనందంగా వుంది. చాలా మంది నటీనటులతో కలసి పని చేయడం మంచి అనుభూతిని ఇచ్చింది. ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకులు ప్రోత్సహించాలలి. సినిమాని ఇంకా పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు.

డైరెక్టర్ అర్జున్ సాయి మాట్లాడుతూ.. అన్ని కళల్లో నాటకం గొప్ప కళ. అలాంటి నాటకాన్ని బ్యాక్ డ్రాప్ తీసుకొని నా మొదటి సినిమా చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఇందులో మంచి లవ్ స్టొరీ వుంది. ఫ్యామిలీ డ్రామా వుంది. ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం గారు లాంటి గొప్ప నటులు వున్నారు. ఈ సినిమా చూసిన వారంతా మంచి సినిమా గొప్ప ప్రయత్నం అని అభినందిస్తున్నారు. ఈ సినిమాని థియేటర్స్ లో చూసి మంచి అనుభూతిని పొందుతారని కోరుకుంటున్నాను’ అన్నారు.

నిర్మాత సురేష్ పాటిల్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అర్జున్ సాయి చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఇందులో లవ్ స్టొరీ వుంది ఫ్యామిలీ వుంది. పెద్ద కళాకారులు వున్నారు. సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.  ప్రేక్షకుకు సపోర్ట్ వుంటే మరిన్ని సినిమాలు చేస్తాను. తప్పకుండా అందరూ సినిమా చూసి  మమ్మల్ని ఆశీర్వదించలాని కోరుకుంటున్నాను.

రైటర్ రమణ గోపిశెట్టి మాట్లాడుతూ.. ఉత్సవం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. చాలా అభినందనలు వస్తున్నాయి. కళని అభిమానించేఅందరినీ సినిమా నచ్చింది. ఇందులో అద్భుతమైన లవ్ స్టొరీ వుంది. దర్శకుడు హార్ట్ ఫుల్ గా సినిమా తీశారు. సినిమా హార్ట్ ఫుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మాటల రచయితగా నాకూ మంచి పేరు వచ్చింది. ఈ సినిమా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్ యూ’ అన్నారు.

యాక్టర్ వెంకట గిరిధర్ మాట్లాడుతూ… నాటకాన్ని బ్రతికించాలనే గొప్ప ఉద్దేశంతో దర్శకుడు ఈ సినిమా చేశారు. నాటకం సినిమాకి అమ్మలాంటింది. దర్శకుడు అద్భుతంగా ఈ సినిమాని తీశారు. నిర్మాత చాలా సపోర్ట్ చేశారు. దిలీప్ తన తొలి సినిమాకి ఇలాంటి నేపధ్యం ఎంచుకోవడం అభినందనీయం. మీ అందరూ సినిమాని సపోర్ట్ చేయాలి’ అని కోరారు.

యాక్టర్ అభినయ కృష్ణ మాట్లాడుతూ.. ఉత్సవం సినిమాకి చాలా మంచి పేరు వస్తోంది. నిజంగా ఉత్సవంలా వుంది. మాన్ కల్చర్, నాటకం గురించి చాలా అద్భుతంగా చూపించారు. దిలీప్ చాలా నేచురల్ గా పెర్ఫామ్ చేశాడు. ఈ సినిమాని అందరూ థియేటర్స్ లో చూడాలి. ఈ సినిమాని మరింత ప్రోత్సహించాలని కోరారు. సురభి నాటక రంగ కళాకారులు, సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ఈ సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News