భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ స్టార్స్ లో ఒకరైన వెంకటేష్ దగ్గుబాటి నెట్ఫ్లిక్స్ సిరీస్ ‘రానా నాయుడు’తో స్ట్రీమింగ్ లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా వున్నారు. ఈ సిరిస్ యాక్షన్ క్రైమ్ డ్రామా అభిమానులకు థ్రిల్లింగ్ వాచ్ అని భరోసా ఇచ్చింది.
వెంకటేష్ దగ్గుబాటి కెరీర్ లో ‘రానా నాయుడు’ ఒక ముఖ్యమైన మైలురాయి. ఎందుకంటే ఇది లాంగ్ స్టొరీ టెల్లింగ్ ప్రపంచంలోకి వెంకటేష్ మొదటి ప్రయత్నం మాత్రమే కాదు, వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబు గారి అబ్బాయి రానాతో కలసి నటిస్తున్న తొలి ప్రాజెక్ట్. కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన వెంకటేష్ ఈ సిరీస్ లో నాగనాయుడు పాత్రలో కనిపించనున్నారు. తన అబ్బాయితో తలపడే పాత్ర ఇది. తండ్రి, కొడుకులుగా ఇద్దరూ పోటాపోటీ పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సిరిస్ కోసం పనిచేసిన తన అనుభవం, స్ట్రీమింగ్ ఫార్మాట్ విశేషాలని పంచుకున్నారు వెంకటేష్. “ఇది ఇప్పటివరకు నాకు ఒక ఎక్సయిటింగ్ ప్రయాణం. సిరీస్ లో పనిచేయడానికి, ఒక చిత్రంలో పనిచేయడానికి చాలా తేడా వుంటుంది. కథ చెప్పే వేగం శైలికి అలవాటు పడటానికి కొంత సమయం తీసుకుంది’’ అని చెప్పారు. నెగిటివ్ పాత్రను పోషించడం నా వరకూ రిఫ్రెష్ మార్పు. క్రాఫ్ట్ యొక్క కొత్త కోణాలను అన్వేషించడానికి దోహదపడింది. ” సంక్లిష్టమైన పాత్రలు నన్ను ఆకర్షిస్తాయి. ‘రానా నాయుడు’ లో చేసింది కూడా అలాంటి పాత్రే. పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వం వున్న పాత్రను పోషించడం సవాలుగా అనిపించినప్పటికీ ఈ పాత్ర తృప్తిని ఇచ్చింది అన్నారు.
రానాతో స్క్రీన్ పంచుకోవడం గురించి చెబుతూ.. “రానా కి ఎదురుగా వార్ చేయడం అంత సులువు కాదు. నటుడిగా నాకిది ఒక సవాల్. ఆఫ్-స్క్రీన్ మాకు గొప్ప ఈక్వేషన్ వుంది. బాబాయ్ అబ్బాయి కంటే మేము స్నేహితులలాంటివాళ్ళం. కానీ తెరపై, ఒకరంటే ఒకరికి పడని తండ్రి-కొడుకులుగా వార్ ఈక్వేషన్ తీసుకురావడం కష్టం! ఒక నటుడిగా ఆర్ట్ లో ఇది చాలా సంతోషకరమైన భాగం. ఇప్పటివరకు అనుభవించని పరిస్థితులను, భావోద్వేగాలతో పాటు ప్రేక్షకులు పాత్రలతో కనెక్ట్ అవుతారు. ఇది ఖచ్చితంగా మా ఇద్దరికీ కొత్త ప్రయత్నం. మేము కలిసి పనిచేశాము. మా పాత్రలకు జీవం పోయడానికి ఓకరికొకరు సూచనలు తీసుకున్నాము’’ అన్నారు
రానా నాయుడు లో వెంకటేష్ ని ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని పాత్రలో చూస్తారు. గ్రిప్పింగ్ కథాంశం, హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు, పవర్హౌస్ పెర్ ఫార్మెన్స్ కోసం, మంచి క్రైమ్ డ్రామాను ఇష్టపడే అందరూ తప్పక ఈ సిరిస్ చూడాలి. నాగా తన కుటుంబంతో తిరిగి కలవగలడా లేదా అతను తన కొడుకు రానా అంతిమ ప్రత్యర్థి అని నిరూపిస్తాడా?
మార్చి 10 నుంచి నెట్ఫ్లిక్స్లో మాత్రమే రాబోయే “రానా నాయుడు” సిరిస్ లో తెలుసుకోండి.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…