‘శంబాల’ బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు యుగంధర్ ముని సందీప్ కిషన్తో ప్రకటించిన ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రకటన నుంచే ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తించింది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ను రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు.
‘కరికాల’ అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్తో ఈ చిత్రం రాబోతోంది. ఈ పోస్టర్లో సందీప్ కిషన్ కనిపిస్తున్న తీరు చాలా కొత్తగా ఉంది. గుర్రంపై హీరో, చేతిలో ఖడ్గం, సింహాన్నే పరిగెత్తిస్తున్నట్టుగా ఆ రాజసం అన్నీ కూడా సినిమాపై ఉత్సుకతను పెంచేలా ఉన్నాయి. ఈ టైటిల్ పోస్టర్తో ఒక్కసారి అంచనాల్ని రెట్టింపు చేసేశారు. ఈ మూవీని రెండు పార్టులుగా మేకర్లు ప్లాన్ చేశారు. మొదటి చాప్టర్ 2027 జూలై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, రెండో చాప్టర్ 2027 అక్టోబర్ 28న రానుంది. రెండు పార్టుల రిలీజ్ డేట్లను ఒకే సారి ప్రకటించడం చూస్తుంటే.. ఇది ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న స్థాయిని, ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
‘శంభాల’ విజయం తర్వాత, దర్శకుడు యుగంధర్ ముని, షైనింగ్ పిక్చర్స్ బృందం ఈ ‘కరికాల’ ప్రాజెక్ట్ను మరింత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. విస్తృతమైన ప్రపంచ నిర్మాణం, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, అత్యద్భుతమైన కథనంతో, ‘కరికాల’ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సోషియో-ఫాంటసీ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
‘కరికాల’ వంటి అద్భుతమైన టైటిల్ ఆవిష్కరణ, ఆకట్టుకునే ఫస్ట్ లుక్, మ్యాజికల్ ఫాంటసీ సెట్టింగ్, రెండు భాగాలుగా విడుదల చేసే వ్యూహంతో ఒక్కసారిగా రాబోతోన్న పాన్-ఇండియా చిత్రాల్లో ఇదొక క్రేజీ ప్రాజెక్ట్గా నిలిచింది. ఈ చిత్రానికి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.
నటీనటులు, ఇతర సాంకేతిక సిబ్బంది, సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు తర్వాత వెల్లడించనున్నారు.
కొరియన్ కనకరాజు' నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్. సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్తో ఒక రోజు ముందుగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రీమియర్స్ వేస్తున్నాం. ఇది…
-ఈనెల 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న సినిమా కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా…
ఇటీవల మైసా సినిమాలో డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా తీవ్రంగా గాయపడింది హీరోయిన్ రశ్మిక మందన్న. ఆమె 6 వారాల పాటు…
విజేతలకు షీల్డ్, శాలువా నగదు బహుమతులతో సత్కారం బహుముఖ ప్రతిభాశాలి నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర "కథ - మాటలు -…
మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ మూవీకి రవి కుమార్…
‘ఒక్కడు’ సినిమాకి మహేష్ బాబు కరెక్ట్, ‘వర్షం’కి ప్రభాస్ కరెక్ట్, 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'కి సిద్ధార్థ్ కరెక్ట్, ‘మనసంతా నువ్వే’కి ఉదయ్…