మాస్ మహారాజా రవితేజ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ”ధమాకా’. కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ గ్రాండ్ గా నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ధమాకా’ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ధమాకా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నేపధ్యంలో నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ చిత్ర విజయాన్ని విలేఖరుల సమావేశంలో పంచుకున్నారు.
ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. కంగ్రాట్స్
థాంక్స్ అండీ
ధమాకా ఫస్ట్ డే ఎలా వుంది ?
చాలా బావుందండీ. గ్రాండ్ గా ఓపెనింగ్స్ వచ్చాయి. అన్ని చోట్ల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది.
ధమాకా ప్రాజెక్ట్ ఎలా కుదిరింది ?
దర్శకుడు త్రినాథరావు, రచయిత ప్రసన్న కథ చెప్పారు. ఇది రవితేజ గారికి బావుంటుందని అనుకున్నాం. రవితేజ గారికి నచ్చింది. తర్వాత కథపై పని చేయడం మొదలుపెట్టాం. కోవిడ్ తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్ళాం.
పీపుల్స్ మీడియాలో ఇదే పెద్ద బడ్జెట్ ప్రాజెక్ట్ నా ?
ఇంతకుముందు వెంకీ మామ సినిమాని కూడా సిమిలర్ బడ్జెట్ లోనే చేశాం.
ధమాకా పాటల కోసం భారీ సెట్స్ వేశారు కదా ?
అవునండీ. ధమాకా లో సాంగ్స్ ప్రధానమైనవి. పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. రవితేజ గారు శ్రీలీల డ్యాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. థియేటర్స్ ప్రేక్షకులు రెస్పాన్స్ అద్భుతంగా వుంది. ఎక్స్ టార్డినరీగా ఎంజాయ్ చేస్తున్నారు. బీ సీ సెంటర్ల రెస్పాన్స్ మేము ఊహించాం. మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుండి మేము ఊహించిన దానికంటే ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.
ప్రాజెక్ట్ లో రవితేజ గారి కోపరేషన్ ఎలా వుంది ?
రవితేజ గారు ఎక్స్ టార్డినరీ పర్సన్. మల్టీ పుల్ సినిమాలు చేస్తున్నప్పటికీ షెడ్యుల్ వారీగా చాలా కంఫర్ట్ బుల్ గా పని చేశాం.
రవితేజ గారు మీ నిర్మాణంలో మళ్ళీ మళ్ళీ చేస్తానని చెప్పారు కదా ?
అవునండీ. కొన్ని ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నాం.
హీరోయిన్ గా మొదట శ్రీలీలనే సంప్రదించారా ?
అవునండీ. కొన్ని ఆప్షన్లు అనుకున్నప్పటికీ మొదట సంప్రదించింది శ్రీలీలనే.
ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వుంది ?
అద్భుతంగా వుందండీ. ధమాకా కంప్లీట్ ఎంటర్ టైనర్. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు.
కథల విషయంలో మీ ఆలోచనలు ఎలా వుంటాయి ?
ధమాకా కంప్లీట్ మాస్ ఎంటర్ టైనర్ కథ. రవితేజ గారి ఎనర్జీ ని పూర్తిగా ఎక్స్ ప్లోర్ చేస్తూ చేసిన మూవీ. అలాగే ఎవరూ ఊహించని ట్విస్ట్ కూడా వుంది. సినిమాలోని ప్రతి ఎలిమెంట్ ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్ నుండి ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కదా.. భవిష్యత్ ప్లానింగ్స్ ఎలా వున్నాయి ?
ఒక ఫ్యాక్టరీ మోడల్ లో పని చేయాలనే ఉద్దేశంతోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ని మొదలుపెట్టాం. కంటిన్యూస్ సినిమాలు నిర్మిస్తాం. డిఫరెంట్ కంటెంట్ తో మంచి లైనప్ వుంది.
ఓటీటీ పై కూడా ద్రుష్టి పెట్టినట్లు వున్నారు ?
ఓటీటీకి చాలా కంటెంట్ డెలివర్ చేస్తున్నాం. ఇప్పటికే మూడు ప్రాజెక్ట్స్ ని ఓటీటీ వేదికగా విడుదల చేశాం. ప్రొడక్షన్ లో మరికొన్ని ప్రాజెక్ట్స్ వున్నాయి.
విడుదలకు సిద్ధమౌతున్న చిత్రాలు ?
నాగశౌర్య- శ్రీనివాస్ అవసరాల ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి.. గోపీచంద్ – శ్రీవాస్ కాంబినేషన్ లో రామబాణం .. అలాగే లావణ్య త్రిపాఠితో ఒక ప్రాజెక్ట్ వుంది. తర్వాత కొన్ని పెద్ద చిత్రాలు వున్నాయి. తర్వలోనే ప్రకటిస్తాం.
ఆల్ ది బెస్ట్
థాంక్స్
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…