‘డార్లింగ్’ని ఎంజాయ్ చేయండి: సక్సెస్ మీట్ లో హీరో ప్రియదర్శి

Must Read

డార్లింగ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఆడియన్స్ రెస్పాన్స్ అద్భుతంగా వుంది: హీరోయిన్ నభా నటేష్

ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ప్రిమియర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది, శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకుల  నుంచి అద్భుతమైన స్పందనతో డార్లింగ్ ఘన విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

సక్సెస్ మీట్ లో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. నిన్న శ్రీరాములు థియేటర్,  ట్రిపుల్ ఏ లో ప్రిమియర్స్ హౌస్ ఫుల్ షోస్ చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. క్రౌడ్ రెస్పాన్స్ అదిరిపోయింది.  కామెడీ, ఎమోషన్స్ కి  అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు. సినిమా చూసిన మా అమ్మగారు క్లాప్స్ కొట్టడం చాలా ఆనందంగా అనిపించింది. మనఇంట్లోనే మనం చేసిన వర్క్ కి ఆలాంటి అప్రిషియేషన్ వస్తే ఆ సంతోషం వేరుంటుంది. విమెన్ ఆడియన్స్ చాలా కనెక్ట్ అయ్యారు. సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అందరి నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రానున్న రోజుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్స్ కి డార్లింగ్ చూడాలని కోరుకుంటున్నాను. డార్లింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడదగ్గ సినిమా. తప్పకుండా థియేటర్స్ కి వచ్చి డార్లింగ్ చూసి ఎంజాయ్ చేయండి. హ్యాపీ డార్లింగ్ డే. థాంక్ యూ’ అన్నారు.

హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ.. డార్లింగ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఎక్కువమంది ఫ్యామిలీ ఆడియన్స్, అమ్మాయిలు సినిమాని, దర్శి, నా కెమిస్ట్రీని చాలా ఇష్టపడుతున్నారు. జనాలు చాలా నచ్చుతుంది. ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బావుంది. ప్రిమియర్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ కి క్లాప్స్ పడటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆడియన్స్ సపోర్ట్ ఇలానే వుండాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్ యూ సో మచ్’ అన్నారు

డైరెక్టర్ అశ్విన్ రామ్ మాట్లాడుతూ.. డార్లింగ్ మేము ఊహించినట్లే ఆడియన్స్ కి అద్భుతంగా రీచ్ అయ్యింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. రానున్న రోజుల్లో మరింతగా ఫ్యామిలీ, విమెన్ ఆడియన్స్ డార్లింగ్ ని ఇష్టపడతారని ఆశిస్తున్నాం’ అన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News