సూపర్ స్టార్ బాద్షా కిచ్చా సుదీప్, దర్శకుడు అనూప్ భండారి బ్లాక్ బస్టర్ ‘విక్రాంత్ రోణ’ తర్వాత మరోసారి చేతులు కలిపారు. హనుమాన్ తో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హై బడ్జెట్, భారీ కాన్వాస్పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యూచర్ లో జరగబోయే కథను పరిచయం చేసే కాన్సెప్ట్ వీడియోతో పాటు ‘బిల్లా రంగ బాషా‘ అఫీషియల్ లోగో ని మేకర్స్ రివిల్ చేశారు. యూనిక్ అప్రోచ్ సినిమాలు చేయడంలో అనూప్ భండారి దిట్ట. ఈ వీడియో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది.
కాన్సెప్ట్ వీడియో క్రీ.శ. 2209లో జరిగిన భవిష్యత్తు గురించి గ్లింప్స్ ని అందిస్తోంది. ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఈఫిల్ టవర్, తాజ్ మహల్ స్మాస్ అయినట్లుగా చూపిస్తూ, ఒక వ్యక్తి అన్నింటినీ జయించినట్లు ప్రజెంట్ చేయడం ఆసక్తికరంగా వుంది. దీనికి మూడు వేర్వేరు ప్రాంతాలు, క్లైమాట్స్ యాడ్ చేశారు. అనూప్ భండారి ఎక్సయిటింగ్ డీటెయిల్స్ తో విజువల్ ప్యాడ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చారు.
ఈ కొలాబరేషన్ గురించి డైరెక్టర్ అనూప్ భండారి మాట్లాడుతూ, ‘విక్రాంత్ రోణ తర్వాత నిరంజన్ రెడ్డి నాతో కలిసి పనిచేయాలనుకున్నారు. మేము ఇంతకు ముందు హనుమాన్ పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో కలుసుకున్నాము. నా తర్వాతి చిత్రం కూడా బాద్షా కిచ్చా సుదీప్తోనే ఉంటుందని, బిల్లా రంగ బాషా కథాంశాన్ని, ఆ వరల్డ్ వివరించినప్పుడు ఆయన థ్రిల్ అయ్యారు. వారు తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ను పెద్ద ఎత్తున నిర్మించాలని కోరుకున్నారు. బిల్లా రంగ బాషా దీనికి పర్ఫెక్ట్. కిచ్చా సుదీప్తో జతకట్టడం గురించి అనూప్ మాట్లాడుతూ, ‘సుదీప్ సర్తో కలిసి పనిచేయడం ఎప్పుడూ గొప్ప అనుభవం. ప్రజలు విక్రాంత్ రోనాను ఇష్టపడ్డారు. వారు దీన్ని మరింత ఇష్టపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. సుదీప్ సార్ దీనిని తన బిగ్గెస్ట్ అని పిలవడం చాలా పెద్ద అభినందన, నా భుజాలపై పెద్ద బాధ్యత. అంచనాలని అందుకునేలా ఈ సినిమా వుంటుంది’ అన్నారు
‘కిచ్చా సుదీప్తో అనూప్ భండారి సినిమా చేస్తున్నారని మొదట విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాం. విక్రాంత్ రోనా తెలుగులో విజయవంతమైంది. ఈ కొలాబరేషన్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. బిల్లా రంగ బాషా కథ విన్నప్పుడు, ఇది మేమే నిర్మించాలి అనే నమ్మకం కలిగింది. సూపర్స్టార్ కిచ్చా సుదీప్తో సినిమా చేయడం గొప్ప అవకాశం. షూటింగ్ ప్రారంభం కావాలని, ప్రేక్షకులు బిల్లా రంగ బాషా ప్రపంచాన్ని చూడాలని ఎదురుచూస్తున్నాం’ అని నిర్మాతలు తెలిపారు.
బిల్లా రంగ బాషా అన్ని ప్రధాన భారతీయ భాషలలో నిర్మాణమౌతుంది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.
తారాగణం: కిచ్చా సుదీప్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అనూప్ భండారి
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
బ్యానర్: ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్ట్యాగ్ మీడియా
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…