టుక్ టుక్ చిత్రం నుంచి తొలి లిరిక‌ల్ సాంగ్ వ‌ర‌ల్డ్‌టూర్ న‌జభ‌జ జ‌..జ‌..ర క‌థ‌లెన్నో విన‌రా… మ‌న‌క‌థ విన‌నిది రా.. విడుద‌ల

Must Read

హ‌ర్షరోహ‌న్‌, కార్తీకేయ దేవ్‌, స్టీవెన్ మ‌ధు, సాన్వీ మేఘ‌న‌, నిహాల్ కోధాటి ముఖ్య‌తార‌లుగా న‌టిస్తున్న ఫ‌న్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ టుక్ టుక్‌. చిత్రవాహిని మరియు ఆర్ వై జి బ్యానర్‌ల ప‌తాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ‌వ‌రుణ్‌, శ్రీ‌రాముల రెడ్డి, సుప్రీత్‌.సి. కృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సి.సుప్రీత్ కృష్ణ ద‌ర్శ‌కుడు. ఇటీవల విడుద‌లైన ఈ చిత్రం ప్ర‌చార చిత్రాలు అంద‌ర్ని ఆక‌ట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి లిరిల‌క్‌సాంగ్‌గా వ‌ర‌ల్డ్‌టూర్ న‌జభ‌జ జ‌జ‌ర క‌థ‌లోన్నో విన‌రా… మ‌న‌క‌థ విన‌నిది రా.. అనే సాంగ్‌ను విడుద‌ల చేశారు. సంతు ఓంకార్ సంగీతాన్ని అందించిన ఆల‌పించిన ఈ పాట‌కు ద‌ర్శ‌కుడు సుప్రీత్ సాహిత్యం అందించారు. యూత్‌ఫుల్ ట్రెండీగా సాంగ్‌గా ఈ చిత్రం గీతం అంద‌ర్ని ఆక‌ట్టుకునే విధంగా వుంది. ట్యూన్ అండ్ లిరిక్స్ క్యాచీగా వున్నాయి. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ


“టుక్ టుక్ష ఇదొక ఒక ఆహ్లాదకరమైన సినిమాటిక్ అనుభూతిని అందిచేలా చిత్రం వుంటుంది. సినిమాలో వుండే ఓ స‌రికొత్త ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఆడియ‌న్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసే విధంగా వుంటుంది. ఆ ఫాంట‌సీ ఎలిమెంట్స్‌తో పాటు చిత్రంలోని ప్ర‌తి స‌న్నివేశం ఆడియ‌న్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేసే విధంగా వుంటుంది. కొత్త‌ద‌నం ఆశించే ప్రేక్ష‌కుల‌కు పూర్తిగా సంతృప్తిప‌రిచే చిత్రం ఇది. ముఖ్యంగా యూత్‌కు న‌చ్చే అన్నిఅంశాలు ఈచిత్రంలో వున్నాయి అన్నారు.”టుక్ టుక్” ఒక ఉత్తేజకరమైన సినిమాటిక్ రైడ్‌గా ఎక్స్పీరియన్‌గా అన్ని వ‌ర్గాల ఆడియ‌న్స్‌ను మెప్పిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది అన్నారు.

తారాగణం:
హర్ష రోషన్
కార్తికేయ దేవ్
స్టీవెన్ మధు
సాన్వీ మేఘన
నిహాల్ కోధాటి

సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: సి.సుప్రీత్ కృష్ణ
సినిమాటోగ్రాఫర్: కార్తీక్ సాయికుమార్
సంగీతం: సంతు ఓంకార్
ఎడిటర్: అశ్వత్ శివకుమార్
నిర్మాతలు:
రాహుల్ రెడ్డి
లోక్కు శ్రీ వరుణ్
శ్రీరాముల రెడ్డి
సుప్రీత్ సి కృష్ణ
పి ఆర్ ఓ: ఏలూరు శ్రీను, మాడురి మధు
డిజిటల్ మీడియా : పిక్చర్ పిచ్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News