అల్లు శిరీష్ కథానాయకుడిగా శామ్ ఆంటోన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బడ్డీ’. ఈ చిత్రంతో ప్రిషా సింగ్ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రిషా సింగ్ మాట్లాడుతూ ..
‘‘నా ఫొటోలను చూసి ఆడిషన్కు పిలిచారు. సెలక్ట్ అయ్యాను. అయితే పాత్రలోని వేరియేషన్స్ చూసి నేను చేయగలనా! అని కూడా ఆలోచించాను. బడ్డీ చిత్రంలో నేను ఎయిర్ హోస్టెస్ పాత్రలో కనిపిస్తాను. అందుకోసం నేను చాలా మంది ఎయిర్ హోస్టెస్ను గమనించాను. వారెలా నడుస్తారు.. ఎలా మాట్లాడుతారు, ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు వంటి విషయాలను గమనించాను. ఈ క్రమంలో డైరెక్టర్గారు ఎయిర్ హోస్టస్ పాత్ర చేయటానికి నాకు కొన్ని రెఫరెన్స్లనిచ్చారు. అవేంతో ఉపయోగపడ్డాయి. టాలీవుడ్ నటించటం నటిగా నాకొక మంచి ఎక్స్పీరియెన్స్. ఇంకా వైవిధ్యమైన పాత్రలు చేయటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు.
వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే ప్రిషకు అభిరుచి ఎక్కువ. తన ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా దీనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. అడవుల్లో వైల్డ్ లైఫ్కు సంబంధించిన యాత్రికులతో కలిసి సఫారీల్లో వెళ్లి అక్కడి జంతువులను తన కెమెరాల్లో బంధిస్తుంటుంది ప్రిష.
‘‘వైల్డ్ లైఫ్ అంటే కేవలం జంతువులను, చెట్లకు సంబంధించిన ఫొటోలను కెమెరాల్లో బంధించటం మాత్రమే కాదు. వాటికి సంబంధించి సహజమైన భావోద్వేగాలను బంధించటమే. అలాంటి విషయాలను నా కెమెరాలో బంధించినప్పుడు సంతృప్తిని, మంచి అనుభవాన్ని ఇస్తుంది. మనం కెమెరాలో బంధించే ప్రతి విషయానికి బలమైన కథ ఉంటుంది. నటన పరంగానూ ఇది నన్ను మెరుగుపరుచుకునేలా చేసింది. కెమెరా ముందు ధైర్యంగా నటించగలుగుతున్నాను’’ అన్నారు.
గోపీచంద్, కావ్యథాపర్ జంటగా డైనమిక్ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం విశ్వం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,…
ప్రశాంత్ వర్మ కథతో పెద్ద స్పాన్ వున్న దేవకీ నందన వాసుదేవ సినిమా చేయడం అధ్రుష్టంగా భావిస్తున్నా : అశోక్…
పలు సూపర్ హిట్ సీరియల్స్, సినిమాలు లో నటించి పాన్ ఇండియా వీక్షకుల ఆదరణ పొందడంతో పాటు సోషల్ మీడియాలో…
Jyothi Poorvaj, the heroine who has starred in numerous hit serials and films, has become…
Manmadha, which was released in 2004 with Simbu and Jyotika as the hero and heroine,…
శింబు, జ్యోతిక హీరో హీరోయిన్లు గా 2004లో విడుదలైన మన్మధ 20 సంవత్సరాలు తర్వాత అక్టోబర్ 5న రీ రిలీజ్…