అల్లు శిరీష్ కథానాయకుడిగా శామ్ ఆంటోన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బడ్డీ’. ఈ చిత్రంతో ప్రిషా సింగ్ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రిషా సింగ్ మాట్లాడుతూ ..
‘‘నా ఫొటోలను చూసి ఆడిషన్కు పిలిచారు. సెలక్ట్ అయ్యాను. అయితే పాత్రలోని వేరియేషన్స్ చూసి నేను చేయగలనా! అని కూడా ఆలోచించాను. బడ్డీ చిత్రంలో నేను ఎయిర్ హోస్టెస్ పాత్రలో కనిపిస్తాను. అందుకోసం నేను చాలా మంది ఎయిర్ హోస్టెస్ను గమనించాను. వారెలా నడుస్తారు.. ఎలా మాట్లాడుతారు, ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు వంటి విషయాలను గమనించాను. ఈ క్రమంలో డైరెక్టర్గారు ఎయిర్ హోస్టస్ పాత్ర చేయటానికి నాకు కొన్ని రెఫరెన్స్లనిచ్చారు. అవేంతో ఉపయోగపడ్డాయి. టాలీవుడ్ నటించటం నటిగా నాకొక మంచి ఎక్స్పీరియెన్స్. ఇంకా వైవిధ్యమైన పాత్రలు చేయటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు.
వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే ప్రిషకు అభిరుచి ఎక్కువ. తన ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా దీనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. అడవుల్లో వైల్డ్ లైఫ్కు సంబంధించిన యాత్రికులతో కలిసి సఫారీల్లో వెళ్లి అక్కడి జంతువులను తన కెమెరాల్లో బంధిస్తుంటుంది ప్రిష.
‘‘వైల్డ్ లైఫ్ అంటే కేవలం జంతువులను, చెట్లకు సంబంధించిన ఫొటోలను కెమెరాల్లో బంధించటం మాత్రమే కాదు. వాటికి సంబంధించి సహజమైన భావోద్వేగాలను బంధించటమే. అలాంటి విషయాలను నా కెమెరాలో బంధించినప్పుడు సంతృప్తిని, మంచి అనుభవాన్ని ఇస్తుంది. మనం కెమెరాలో బంధించే ప్రతి విషయానికి బలమైన కథ ఉంటుంది. నటన పరంగానూ ఇది నన్ను మెరుగుపరుచుకునేలా చేసింది. కెమెరా ముందు ధైర్యంగా నటించగలుగుతున్నాను’’ అన్నారు.
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా…
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతీ శతకం' విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి…
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్,…
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…
హైదరాబాద్, ఫిబ్రవరి 5: ప్రముఖ ఓటీటీ మాధ్యమం జియో స్టార్లో ది రాజా సాబ్ సినిమాను ఫిబ్రవరి 6 నుంచి…
ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…